అన్వేషించండి

YSRCP Observers: అన్ని నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకుల జాబితా రెడీ, త్వరలోనే సీఎం జగన్ ప్రకటన - కొత్త సమస్యలు తప్పవా !

స్థానికంగా ఉన్న శాసన సభ్యులు, ఇంఛార్జ్‌తో పాటుగా మరో పరిశీలకుడిని నియమించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

వైసీపీ నియోజకవర్గాల వారీగా పరిశీలకుల జాబితా రెడీ అయ్యింది. స్థానికంగా ఉన్న శాసన సభ్యులు, ఇంఛార్జ్‌తో పాటుగా మరో పరిశీలకుడిని నియమించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాడికొండ నియోజకవర్గం నుంచి మెదలయిన పరిశీలకుల నియామకం, ఇప్పుడు ఏపీలోని 175నియోజకవర్గాలకు పూర్తి చేశారు. పరిశీలకుల జాబితాను రెడీ చేసి, జగన్ ముందు తుది ఆమోదానికి ఉంచినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పరిశీలకులు అవసరం ఎందుకొచ్చింది..
ఏపీలో వైసీపీ పార్టీ బలంగా ఉంది. అధికారంలో ఉండటంతో పార్టీకి ఎదురు ఉండే అవకాశం లేదు. దీంతో ఎదైనా సాధ్యం చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రతిపక్షానికి అవకాశాలు ఇవ్వకుండా పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా ముందుకు నడిపించి, తిరిగి 2024లో విజయం సాధించేందుకు అన్ని వైపులా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పరిశీలకులను కూడా నియమించారు. దీని వలన ఇప్పుడున్న శాసన సభ్యుడు, లేదా ఇంఛార్జ్ పై మరింతగా భాద్యత పెరుగుతుందన్నది జగన్ ఆలోచన అంటున్నారు వైసీపీ నేతలు. పరిశీలకులుగా మరో వ్యక్తి నియోజకవర్గంలో పని చేస్తున్నారంటే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఇంఛార్జ్ పై ఉంటుంది, కాబట్టి మెరుగయిన ఫలితాలు సాధించేందుకు వీలుటుందని చెబుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే, లేక ఇంఛార్జ్ కాస్త ఎమరుపాటుగా ఉన్నా, అక్కడ ఉన్న పరిశీలకులు వారిని అలర్ట్ చేసేందుకు వీలుంటుందని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కావాల్సింది స్థానిక ఎమ్మెల్యే, పరిశీలకుల మధ్య మంచి అవగాహనా ఉండాలి. అయితే ఈ విషయంలోనే కొంత అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. అయితే ఇదంతా తాత్కాలికమని, నిదానంగా అన్ని సర్దుకుంటాయని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు.
పరిశీలకుల యోచన అలా మొదలైంది..
వాస్తవానికి ఇప్పటివరకు నియోజకవర్గంలో పార్టీకి ఎమ్మెల్యేనే కింగ్ మేకర్.. అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా ఇంఛార్జ్ గా ఉన్న వ్యక్తే నియోజకవర్గంలో పూర్తిగా చక్రం తిప్పుతారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేతో పాటుగా పరిశీలకుడిగా మరో పోస్ట్ క్రియేట్ చేసి, పార్టీ తరఫున వారిని నియమించటం ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న నూతన విధానం. వాస్తవానికి పరిశీలకుల నియామకం అనేది తొలిసారి తాడికొండ నియోజకవర్గం లో జరిగింది. ఏపీలోని తాడికొండ నియోజకవర్గం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవిపై పార్టీ వర్గాల నుంచి అందిన ఫిర్యాదులు నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ను పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు తాడికొండ నియోజకవర్గానికి పరిశీలకుడిగా నియమించారు. ఈ వ్యవహరం పార్టీలో తీవ్ర వివాదానికి కారణం అయ్యింది. ఇప్పటికీ ఈ వ్యవహరం తాడికొండ నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులానే కొనసాగుతుంది. 
ఎమ్మెల్యే శ్రీదేవి, డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గాల మధ్య వివాదం జరుగుతుంది. అక్కడక్కడ ఇరువర్గాలు ఎదురుపడినప్పుడల్లా గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే శ్రీదేవికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. దీంతో కాలమే సమాధానం ఇస్తుందనే ధోరణిలో వైసీపీ అగ్రనేతలు కూడా ప్రేక్షకపాత్రకు పరిమితం అయ్యారు. దీంతో ఇదే సమయంలో అన్ని నియోజకవర్గాలకు కూడా పరిశీలకులను నియమించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీని పై పీకే నివేదికను తీసుకున్న తరువాత పరిశీలకుల నియామకంలో వేగాన్ని పెంచిన వైసీపీ నేతలు, తుది జాబితాను రెడీ చేసి జగన్ ముందు ఉంచారు. ఆయన ఆమోదం తరువాత అధికారికంగా ప్రకటించనున్నారు.
పరిశీలకుల నియామకంలో కీలక నేతలకు ఊరట...
పరిశీలకుల నియామకంలో పార్టీలోని కీలక నేతలకు ఊరట లభించిందనే చెప్పాలి. వాస్తవానికి పరిశీలకుల నియామకాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు అంతగా పట్టించుకోలేదు. జగన్ నిర్ణయం కావటంతో ఎమ్మెల్యేలు ఎప్పుడో ఒకే చెప్పారు. పార్టీకి విధేయులుగా ఉంటున్న వారు, పార్టీ జిల్లా అద్యక్షులుగా ఉన్న నియోజకవర్గాలకు, మాజీ మంత్రులు, అగ్రనేతలకు చెందిన నియోజకవర్గాలకు పరిశీలకులుగా నియామకం అయిన వ్యక్తులను బట్టి చూస్తే ఇది అర్థం అవుతుందని పార్టీలోనే చర్చ నడుస్తుంది. ఆయా నియోజకవర్గాలకు బాధ్యులుగా ఉన్నవారు సిఫార్సు చేసిన వారిని పరిశీలకులుగా నియమించారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget