![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
YS Sharmila News: దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి, మంత్రులకు షర్మిల ఛాలెంజ్
AP Congress: ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే ఆయన కుమారుడైన జగన్ కేవలం 6 వేల పోస్టులతో ధగా డీఎస్సీ వేశారని షర్మిల ఎద్దేవా చేశారు.
![YS Sharmila News: దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి, మంత్రులకు షర్మిల ఛాలెంజ్ YS Sharmila asks YSRCP leaders to answers her questions over DSC notification in AP YS Sharmila News: దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి, మంత్రులకు షర్మిల ఛాలెంజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/aecd12e7ab74cccd0b39bc646fe36e901707816752903234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YS Sharmila Challenges YSRCP: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్ పైన రోజూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల, గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా ఎక్స్ ద్వారా కూడా షర్మిల జగన్ తీరును తప్పుబట్టారు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే ఆయన కుమారుడైన జగన్ కేవలం 6 వేల పోస్టులతో డీఎస్సీ వేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి షర్మిల సవాలు విసిరారు.
‘‘మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. వారసుడిగా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది "దగా డీఎస్సీ". ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు.. వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ? 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు? ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి? టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి? నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్ కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధా? వైఎస్ఆర్ హాయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా?
ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా? రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా? మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా? నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆన్న.. ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మహానేత YSR 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే...వారసుడు గా చెప్పుకొనే జగన్ ఆన్న 6 వేలతో వేసింది "దగా డీఎస్సీ".ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు,వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్.
— YS Sharmila (@realyssharmila) February 13, 2024
1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ?
2. 5 ఏళ్లు…
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)