అన్వేషించండి

Polavaram Project: పోలవరం తొలిదశ డీపీఆర్‌కు ఆమోదముద్ర పడేనా- రేపటి కేంద్ర కేబినెట్‌ ఏ నిర్ణయం తీసుకోనుంది?

Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టు తొలిదశ డీపీఆర్‌ సిద్ధమైంది. కేంద్రం ఆమోదమే తరువాయి. కేంద్ర కేబినెట్‌ సమావేశంలో... డీపీఆర్‌కు ఆమోదముద్ర పడితే.. రాష్ట్రానికి రూ.12వేల కోట్ల నిధులు అందనున్నాయి.

Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్‌... ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ప్రజల కలల ప్రాజెక్ట్‌. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే... రాష్ట్రంలోని రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయి. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని... నిల్వచేసి... రైతులు  అందిచవచ్చు. అయితే... ఈ ప్రాజెక్టు.. కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఈ ప్రాజెక్టును... రాష్ట్రంలో ఏర్పాటయిన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తోంది. కొత్త ప్రాజెక్ట్‌ డిజైన్‌ను సిద్ధం చేసింది. ఈ డీపీఆర్‌కు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహామండలి, రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదముద్ర  వేశాయి. ఇక.. ఫైనల్‌గా కేంద్రం కేబినెట్‌ (Central Cabinet) ఆమోదం కావాల్సి ఉంది. అందుకే... రేపు(బుధవారం) ప్రధాని మోడీ(PM MODI) అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్‌ అజెండాలో... పోలవరం డీపీఆర్‌(Polavaram DPR) అంశాన్ని కూడా చేర్చారు. రేపు(బుధవారం) పోలవరం డీపీఆర్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేయబోతున్నట్టు సమాచారం. 

పోలవరం కొత్త డీపీఆర్‌లో ఏముంది..?
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణానికి 30వేల 436 కోట్ల రూపాయలతో డీపీఆర్‌ను సిద్ధం చేశారు. 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వచేసేలా అన్ని సాంకేతిక అంశాలను డీపీఆర్‌లో పొందుపరిచారు. వాస్తవిక డిజైన్‌లో తొలిదశ, మలిదశ  అన్న అంశాలు లేకపోయినా.. కేంద్రం నుంచి నిధులను త్వరగా రాబట్టేందుకు... రెండు దశలను ప్రస్తావిస్తున్నారు. 41.15 మీటర్ల వరకు నిర్మాణానికి అవసరమైన అంచనా వ్యయాన్ని తొలిదశ డీపీఆర్‌లో పొందుపరిచారు. గతంలో 2010-11 ధరలతో  16వేల కోట్లకు డీపీఆర్‌ కేంద్రం ఆమోదం పొందింది. దాని ప్రకారం నిధులన్నీ కేంద్రం చెల్లించింది. ఇక... తొలిదశ పేరుతో సిద్ధంగా ఉన్న డీపీఆర్‌ కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందితే... రాష్ట్రానికి మరో రూ.12,157 కోట్లు వస్తాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థులను  దృష్టిలో పెట్టుకుని ఈ నిధులను ముందుగానే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. 

రేపటి కేంద్ర కేబినెట్‌ సమావేశంలో రెండో దశపై చర్చకు వస్తుందా...?
రేపటి కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తొలదశ డీపీఆర్‌ను ఆమోదం లభిస్తోందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే...ఈ సందర్భంగా రెండో దశపై కూడా చర్చిస్తే బాగుంటుందన్న డిమాండ్‌ వినిపిస్తోంది. తొలిదశ డీపీఆర్‌ను ఆమోదిస్తే... మరో డీపీఆర్‌ను  ఆమోదించబోమని.. గత ప్రభుత్వంతో చర్చల సందర్భంగా స్పష్టంగా చెప్పాయి కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు. అయితే.. కొత్త డీపీఆర్‌ను ఆమోదించలే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం... అలాంటి షరతులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుత డీపీఆర్‌  ఆమోదం పొందడంతో పాటు... రెండో దశ డీపీఆర్‌కు నిధులు ఇచ్చేలా.... కేంద్రంలో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. కేంద్రంలోని NDA సర్కార్‌లో ఏపీ ప్రభుత్వం కీలకంగా ఉన్నందున... ఇది అసాధ్యం కాదన్నది విశ్లేషకుల మాట. అయితే...  ప్రభుత్వం ఆ దిశగా... చర్చల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇప్పటికే కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు....
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం... పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. అయితే.. నిర్మాణ పనుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుటోంది. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేలా అడుగులు వేగంగా ముందుకు పడాలంటే... కేంద్రం  నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. దీంతో.. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. ప్రధాని మోడీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman)‌,  జలవనరుల శాఖ మంత్రి పాటిల్‌(Water Resources Minister Patil)తో పోలవరం నిధులపై చర్చించారు. వారు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీంతో... రేపటి కేంద్ర కేబినెట్‌ ముందుకు పోలవరం తొలిదశ డీపీఆర్‌ రానుంది. కేంద్ర  కేబినెట్‌ నిర్ణయం కోసం ఏపీ ప్రభుత్వం కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తొలిదశ డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే.. ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు తీసుకువెళ్లొచ్చన్నది ఏపీ సర్కార్‌ అభిప్రాయం.

Also Read: మదనపల్లి మంటల కేసులో మరో ట్విస్ట్- మద్యం పాలసీ గుట్టు రట్టైనట్టు సమాచారం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati High Alert: అమరావతిలో హై అలర్ట్‌! ఆరు చెక్‌పోస్టు, డ్రోన్లతో భద్రత కట్టుదిట్టం! అసలేం జరిగిందంటే?
అమరావతిలో హై అలర్ట్‌! ఆరు చెక్‌పోస్టు, డ్రోన్లతో భద్రత కట్టుదిట్టం! అసలేం జరిగిందంటే?
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
US Iran War: అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
Embed widget