అన్వేషించండి

Pawan Kalyan: వాళ్లకీ యాప్ ఉండాలట! పవన్ కల్యాణ్ డిమాండ్ - సీఎం జగన్‌పై సెటైరికల్ కార్టూన్

టీచర్లకు యాప్ అందుబాటులోకి తేవడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.

ఏపీలో గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల హాజరు, సమయపాలన కచ్చితత్వం కోసం తీసుకొచ్చిన యాప్ వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గతంలో ఉన్న బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు తిరిగి మళ్లీ అన్ని నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెలవుల సమాచారం కూడా ఇకపై యాప్‌లోనే అప్లై చేయాలని నిబంధన విధించారు. ఉదయం 9 గంటల వరకు ఖచ్చితంగా స్కూలుకు వచ్చి హాజరు వేసుకోవాల్సిందేనని లేకపోతే ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని విద్యాశాఖ తేల్చి చెప్పింది. అయితే, ఈ విధానంపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

విపక్షాలు కూడా ఈ విధానం పట్ల విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ట్విటర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం టీచర్లపై బాధ్యతలు గుర్తు చేసేలా వ్యవహరిస్తే, ప్రజలు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేల బాధ్యతల్ని గుర్తు చేసేలా ఒక యాప్ ను రూపొందించాలని అన్నారు. జవాబుదారీతనం అనేది ఒకవైపు నుంచే కాకుండా రెండు వైపుల నుంచి ఉండాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన ఓ కార్టూన్ లో ఫన్నీగా ఉపాధ్యాయుల పరిస్థితిని చూపించారు. వారు యాప్ లో అటెండెంన్స్ వేయించుకోవడం కోసం సిగ్నల్ లేదని తిరుగుతున్నట్లుగా చూపించారు. సీఎం జగన్ హెలికాప్టర్ లో అక్కడికి వచ్చి ఆ పరిస్థితిని ఆరా తీసినట్లుగా కార్టూన్ గీశారు. ‘‘పాపం వాళ్లు స్కూల్ కి రాగానే పిల్లలకు పాఠాలు చెప్పుకునేటోళ్లు.. అదేదో యాపట.. దాని సిగ్నల్ కోసం చెట్టుకొకరు, పుట్టకొకరు అట్టా తిరుగుతున్నారు సార్’ అని అటెండర్ సీఎం జగన్ కి చెబుతున్నట్లుగా ఉంది. ఉపాధ్యాయులుకు ఒక రూల్, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఒక రూల్ ఉండకుండా జవాబుదారీతనం ఇద్దరికీ ఉండేలా చేయాలని అన్నారు.

ఆగస్టు 20న కడప జిల్లా పర్యటనకు పవన్ కల్యాణ్

ఏపీలో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు.

ఇప్పటికే పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష విరాళం అందించారు. బహిరంగ సభల్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆగస్టు 20న వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే, పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటనకి ఇంతకీ పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
CM Chandrababu: ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
Cooking Without LPG : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vishal On Rajendra Prasad: సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
Embed widget