అన్వేషించండి

Pawan Kalyan: వాళ్లకీ యాప్ ఉండాలట! పవన్ కల్యాణ్ డిమాండ్ - సీఎం జగన్‌పై సెటైరికల్ కార్టూన్

టీచర్లకు యాప్ అందుబాటులోకి తేవడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.

ఏపీలో గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల హాజరు, సమయపాలన కచ్చితత్వం కోసం తీసుకొచ్చిన యాప్ వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గతంలో ఉన్న బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు తిరిగి మళ్లీ అన్ని నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెలవుల సమాచారం కూడా ఇకపై యాప్‌లోనే అప్లై చేయాలని నిబంధన విధించారు. ఉదయం 9 గంటల వరకు ఖచ్చితంగా స్కూలుకు వచ్చి హాజరు వేసుకోవాల్సిందేనని లేకపోతే ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని విద్యాశాఖ తేల్చి చెప్పింది. అయితే, ఈ విధానంపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

విపక్షాలు కూడా ఈ విధానం పట్ల విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ట్విటర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం టీచర్లపై బాధ్యతలు గుర్తు చేసేలా వ్యవహరిస్తే, ప్రజలు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేల బాధ్యతల్ని గుర్తు చేసేలా ఒక యాప్ ను రూపొందించాలని అన్నారు. జవాబుదారీతనం అనేది ఒకవైపు నుంచే కాకుండా రెండు వైపుల నుంచి ఉండాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన ఓ కార్టూన్ లో ఫన్నీగా ఉపాధ్యాయుల పరిస్థితిని చూపించారు. వారు యాప్ లో అటెండెంన్స్ వేయించుకోవడం కోసం సిగ్నల్ లేదని తిరుగుతున్నట్లుగా చూపించారు. సీఎం జగన్ హెలికాప్టర్ లో అక్కడికి వచ్చి ఆ పరిస్థితిని ఆరా తీసినట్లుగా కార్టూన్ గీశారు. ‘‘పాపం వాళ్లు స్కూల్ కి రాగానే పిల్లలకు పాఠాలు చెప్పుకునేటోళ్లు.. అదేదో యాపట.. దాని సిగ్నల్ కోసం చెట్టుకొకరు, పుట్టకొకరు అట్టా తిరుగుతున్నారు సార్’ అని అటెండర్ సీఎం జగన్ కి చెబుతున్నట్లుగా ఉంది. ఉపాధ్యాయులుకు ఒక రూల్, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఒక రూల్ ఉండకుండా జవాబుదారీతనం ఇద్దరికీ ఉండేలా చేయాలని అన్నారు.

ఆగస్టు 20న కడప జిల్లా పర్యటనకు పవన్ కల్యాణ్

ఏపీలో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు.

ఇప్పటికే పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష విరాళం అందించారు. బహిరంగ సభల్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆగస్టు 20న వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే, పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటనకి ఇంతకీ పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Mahanati Savitri : మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
Advertisement

వీడియోలు

ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Mahanati Savitri : మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
Kiara Advani Sidharth Malhotra : కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
5 seater Cheapest car: 5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
Vanara Movie Teaser : యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్
యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్
Post Office Schemes : పోస్ట్​ ఆఫీస్​లో సేవింగ్స్ చేయడానికి ఈ 3 పథకాలు బెస్ట్.. FD కంటే ఎక్కువ వడ్డీ పొందవచ్చు
పోస్ట్​ ఆఫీస్​లో సేవింగ్స్ చేయడానికి ఈ 3 పథకాలు బెస్ట్.. FD కంటే ఎక్కువ వడ్డీ పొందవచ్చు
Embed widget