అన్వేషించండి

TDP Protest: జంగారెడ్డిగూడెంలో మరణాలకు వైఎస్ జగన్‌దే బాధ్యత, సీఎం మోసం ఖరీదు 25 ప్రాణాలు: టీడీపీ

కల్తీ సారా మరణాలన్నీ వైఎస్ జగన్ చేసిన  హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు.

Jangareddigudem Deaths: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న కల్తీ సారా మరణాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాధ్యత వహించాలని ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాలన్నీ వైఎస్ జగన్ చేసిన  హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మద్యపాన నిషేధం అని చెప్పి, కొత్త కొత్త బ్రాండ్లను ఏపీకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని ఎద్దేవా చేశారు. 

నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు నిరసనగా వచ్చారు. నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్వర్యంలో సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి శాసనసభ వరకు మద్యం సీసాలతో వచ్చి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. సీఎం జగన్ మోసం ఖరీదు 25 ప్రాణాలు అని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ.. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. నకిలీ బ్రాండ్ల బాగోతం బయటకు తీయాలని, జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై విచారణ చేపట్టాలన్నారు. ఇప్పటివరకూ దాదాపు 25 మంది కల్తీ సారా తాగి చనిపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చనిపోయి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో తీసుకొచ్చే వింత మద్యం బ్రాండుల వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని ఆరోపించారు.

అసెంబ్లీలో చర్చకు టీడీపీ పట్టు ! 
జంగారెడ్డి గూడెం మరణాల అంశంపై అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలకు అవకాశం ఇస్తూ, తమకు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. పైకి ఎక్కి, స్పీకర్ కుర్చీని చుట్టుముట్టారు. అంతా కాగితాలు చింపి స్పీకర్ పైన వేశారు. దీంతో సభలోకి మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: AP Assembly News: స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై కాగితాలు - అసెంబ్లీలో కొనసాగుతున్న జంగారెడ్డిగూడెం రచ్చ

Also Read: AP Assembly: జంగారెడ్డి గూడెం మరణాలపై తీవ్ర దుమారం, మళ్లీ అసెంబ్లీ వాయిదా - మంత్రులకు జగన్ కీలక ఆదేశాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget