అన్వేషించండి

TDP Protest: జంగారెడ్డిగూడెంలో మరణాలకు వైఎస్ జగన్‌దే బాధ్యత, సీఎం మోసం ఖరీదు 25 ప్రాణాలు: టీడీపీ

కల్తీ సారా మరణాలన్నీ వైఎస్ జగన్ చేసిన  హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు.

Jangareddigudem Deaths: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న కల్తీ సారా మరణాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాధ్యత వహించాలని ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాలన్నీ వైఎస్ జగన్ చేసిన  హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మద్యపాన నిషేధం అని చెప్పి, కొత్త కొత్త బ్రాండ్లను ఏపీకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని ఎద్దేవా చేశారు. 

నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు నిరసనగా వచ్చారు. నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్వర్యంలో సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి శాసనసభ వరకు మద్యం సీసాలతో వచ్చి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. సీఎం జగన్ మోసం ఖరీదు 25 ప్రాణాలు అని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ.. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. నకిలీ బ్రాండ్ల బాగోతం బయటకు తీయాలని, జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై విచారణ చేపట్టాలన్నారు. ఇప్పటివరకూ దాదాపు 25 మంది కల్తీ సారా తాగి చనిపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చనిపోయి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో తీసుకొచ్చే వింత మద్యం బ్రాండుల వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని ఆరోపించారు.

అసెంబ్లీలో చర్చకు టీడీపీ పట్టు ! 
జంగారెడ్డి గూడెం మరణాల అంశంపై అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలకు అవకాశం ఇస్తూ, తమకు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. పైకి ఎక్కి, స్పీకర్ కుర్చీని చుట్టుముట్టారు. అంతా కాగితాలు చింపి స్పీకర్ పైన వేశారు. దీంతో సభలోకి మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: AP Assembly News: స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై కాగితాలు - అసెంబ్లీలో కొనసాగుతున్న జంగారెడ్డిగూడెం రచ్చ

Also Read: AP Assembly: జంగారెడ్డి గూడెం మరణాలపై తీవ్ర దుమారం, మళ్లీ అసెంబ్లీ వాయిదా - మంత్రులకు జగన్ కీలక ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Tata Advanced Systems Limited:  టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ …  ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ … ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Embed widget