By: ABP Desam | Updated at : 14 Mar 2022 12:11 PM (IST)
టీడీపీ నేతల నిరసన
Jangareddigudem Deaths: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న కల్తీ సారా మరణాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాధ్యత వహించాలని ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాలన్నీ వైఎస్ జగన్ చేసిన హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మద్యపాన నిషేధం అని చెప్పి, కొత్త కొత్త బ్రాండ్లను ఏపీకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్దేనని ఎద్దేవా చేశారు.
నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు నిరసనగా వచ్చారు. నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్వర్యంలో సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి శాసనసభ వరకు మద్యం సీసాలతో వచ్చి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. సీఎం జగన్ మోసం ఖరీదు 25 ప్రాణాలు అని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ.. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. నకిలీ బ్రాండ్ల బాగోతం బయటకు తీయాలని, జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై విచారణ చేపట్టాలన్నారు. ఇప్పటివరకూ దాదాపు 25 మంది కల్తీ సారా తాగి చనిపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చనిపోయి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో తీసుకొచ్చే వింత మద్యం బ్రాండుల వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని ఆరోపించారు.
అసెంబ్లీలో చర్చకు టీడీపీ పట్టు !
జంగారెడ్డి గూడెం మరణాల అంశంపై అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలకు అవకాశం ఇస్తూ, తమకు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. పైకి ఎక్కి, స్పీకర్ కుర్చీని చుట్టుముట్టారు. అంతా కాగితాలు చింపి స్పీకర్ పైన వేశారు. దీంతో సభలోకి మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MP GVL On Bus Yatra : ఏపీలో ఒకే సామాజిక వర్గం చేతిలో అధికారం, మంత్రులకు వారి శాఖల పేర్లు కూడా తెలీదు - ఎంపీ జీవీఎల్
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న
Krishna Road Accident : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లెక్సీ అడ్డురావడంతో బోల్తా పడిన ఆటో, నలుగురి మృతి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!