అన్వేషించండి

జగన్‌కు పవన్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌ జనాలపై ఉంటే బాగున్ను: రామకృష్ణ

గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే.. వాటిని అడ్డుకునేందుకు సీఎం జగన్ తెగ ఆసక్తి చూపించారని గుర్తు చేశారు. ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద ఉంటుంటే చాలా బాగుండేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సీఎం పదవీ కాలం పూర్తయ్యేనాటికి రాష్ట్ర అప్పులు పది లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇస్తున్న ఉచితాలపై పెద్ద చర్చ జరుగుతోందని అన్నారు. ఆశ్వనీ కుమార్ వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు స్పందించిందని, పెద్ద వ్యాపార సంస్ధలకు పది లక్షల కోట్లు మాఫీ చేశారని.. ఇది అశ్వనీ కుమార్ కు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. వ్యవసాయానికి గిట్టుబాటు ధర రావడం లేదని, 1986 నుంచి ఇప్పటి వరకూ 6 లక్షల మంది రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులపై వివరంగా సీజేఐకి లేఖ రాయబోతున్నట్లు తెలిపారు. లక్షల మంది రైతులు ఎందుకు చనిపోయారో కమిటీ వేయండని కోరుతామని స్పష్టం చేశారు. 

అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు..

ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల పాలైందని, 2014 జూన్ 2 నాటికి జనాభా నిష్పత్తి ప్రకారం 96 వేల కోట్లు అప్పు ఉందని.. జగన్ దిగిపోయే నాటికి ఆ అప్పు పదిలక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులు లేకుండా చేశారని, విద్యావ్యవస్థను అస్ధవ్యస్ధం చేసి ప్రాథమిక విద్యలో మాతృభాష లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కావాలని ఆనాడు పదేపదే చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు ఆ మాట కూడా ఎత్తట్లేదని ఆగ్రంహ వ్యక్తం చేశారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేశారని రామకృష్ణ విమర్శించారు. గంగవరం పోర్టును అదానికి అప్పజెప్పావంటూ.. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ విశాఖలో మహా సభలు జరుగుతున్నాయని ఈ అంశాలన్నింటినీ ఆ సభల్లో చర్చిస్తామని తెలిపారు. 

పవన్ కల్యాణ్ యాత్రలపై ఉన్న ఇంట్రెస్ట్ ప్రజలపై లేదు..

గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే.. వాటిని అడ్డుకునేందుకు సీఎం జగన్ తెగ ఆసక్తి చూపించారని గుర్తు చేశారు. ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద ఉంటుంటే చాలా బాగుండేదన్నారు. మూడేళ్ల పాలనలో రైతులను పట్టించుకోకుండా ఉండి పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే జగన్‌కేంటీ నొప్పి అని ప్రశ్నించారు రామకృష్ణ. సీఎంగా ఉండి జగన్ చేయలేనిది ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పవన్ కల్యాణ్ చేసి చూపించారన్నారు.

వరదలు వచ్చినప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోలేరు..!

రెండు నెలల క్రిత భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర ప్రజలంతా అనేక రకాల సమస్యలు ఎదుర్కున్నారని రామకృష్ణ గుర్తు చేశారు. ఆ సమయలో కూడా సీఎం జగన్ సరిగ్గా స్పందించలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కడపలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించినప్పుడు.. ప్రజలందరూ సమస్యలు తీర్చాలంటూ కాళ్లావేలా పడ్డారని వివరించారు. అంతటి కష్ట కాలంలో కూడా సీఎం ప్రజలకు దగ్గరగా లేకపోవడం.. సాయం చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
Amaravati High Speed Rail: అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే
అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Embed widget