అన్వేషించండి

జగన్‌కు పవన్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌ జనాలపై ఉంటే బాగున్ను: రామకృష్ణ

గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే.. వాటిని అడ్డుకునేందుకు సీఎం జగన్ తెగ ఆసక్తి చూపించారని గుర్తు చేశారు. ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద ఉంటుంటే చాలా బాగుండేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సీఎం పదవీ కాలం పూర్తయ్యేనాటికి రాష్ట్ర అప్పులు పది లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇస్తున్న ఉచితాలపై పెద్ద చర్చ జరుగుతోందని అన్నారు. ఆశ్వనీ కుమార్ వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు స్పందించిందని, పెద్ద వ్యాపార సంస్ధలకు పది లక్షల కోట్లు మాఫీ చేశారని.. ఇది అశ్వనీ కుమార్ కు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. వ్యవసాయానికి గిట్టుబాటు ధర రావడం లేదని, 1986 నుంచి ఇప్పటి వరకూ 6 లక్షల మంది రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులపై వివరంగా సీజేఐకి లేఖ రాయబోతున్నట్లు తెలిపారు. లక్షల మంది రైతులు ఎందుకు చనిపోయారో కమిటీ వేయండని కోరుతామని స్పష్టం చేశారు. 

అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు..

ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల పాలైందని, 2014 జూన్ 2 నాటికి జనాభా నిష్పత్తి ప్రకారం 96 వేల కోట్లు అప్పు ఉందని.. జగన్ దిగిపోయే నాటికి ఆ అప్పు పదిలక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులు లేకుండా చేశారని, విద్యావ్యవస్థను అస్ధవ్యస్ధం చేసి ప్రాథమిక విద్యలో మాతృభాష లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కావాలని ఆనాడు పదేపదే చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు ఆ మాట కూడా ఎత్తట్లేదని ఆగ్రంహ వ్యక్తం చేశారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేశారని రామకృష్ణ విమర్శించారు. గంగవరం పోర్టును అదానికి అప్పజెప్పావంటూ.. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ విశాఖలో మహా సభలు జరుగుతున్నాయని ఈ అంశాలన్నింటినీ ఆ సభల్లో చర్చిస్తామని తెలిపారు. 

పవన్ కల్యాణ్ యాత్రలపై ఉన్న ఇంట్రెస్ట్ ప్రజలపై లేదు..

గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే.. వాటిని అడ్డుకునేందుకు సీఎం జగన్ తెగ ఆసక్తి చూపించారని గుర్తు చేశారు. ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద ఉంటుంటే చాలా బాగుండేదన్నారు. మూడేళ్ల పాలనలో రైతులను పట్టించుకోకుండా ఉండి పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే జగన్‌కేంటీ నొప్పి అని ప్రశ్నించారు రామకృష్ణ. సీఎంగా ఉండి జగన్ చేయలేనిది ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పవన్ కల్యాణ్ చేసి చూపించారన్నారు.

వరదలు వచ్చినప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోలేరు..!

రెండు నెలల క్రిత భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర ప్రజలంతా అనేక రకాల సమస్యలు ఎదుర్కున్నారని రామకృష్ణ గుర్తు చేశారు. ఆ సమయలో కూడా సీఎం జగన్ సరిగ్గా స్పందించలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కడపలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించినప్పుడు.. ప్రజలందరూ సమస్యలు తీర్చాలంటూ కాళ్లావేలా పడ్డారని వివరించారు. అంతటి కష్ట కాలంలో కూడా సీఎం ప్రజలకు దగ్గరగా లేకపోవడం.. సాయం చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
AP CM Chandrababu: వేట్లపాలెంలో బాణసంచా పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
వేట్లపాలెంలో బాణసంచా పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Embed widget