అన్వేషించండి

Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్

Chandra Babu: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఇన్ని ఆరోపణలు చేసినప్పటికీ గౌరవప్రధమైన పోస్టింగ్‌లే ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది.

Jawahar Reddy And Poonam Malakondaiah: వెయింట్‌లో ఉన్న మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయంలో సీఎస్‌గా ఉంటూ అనేక అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న జవహర్‌ రెడ్డి, మరో అధికారి పూనంమాలకొండయ్యకు రిటైర్‌మెంట్‌ ముందు రోజు పోస్టింగ్ ఇచ్చింది. 

కేఎస్ జవహర్ రెడ్డి... వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టి నాటి నుంచి వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్నికల నాటికి ఆ ఆరోపణలు మరింత ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా ఆ టైంలో పింఛన్ల పంపిణీపై రేగిన దుమారానికి జవహర్ రెడ్డే ప్రధాన కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపించాయి. 

పింఛన్లు పంపిణీ విషయంలోనే కాదు కీలక నిర్ణయాల్లో కూడా అడ్డగోలుగా వ్యవహరించారనే అపప్రధ మూటకట్టుకున్నారు. ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైర్‌మెంట్‌ వరకు పోస్టింగ్ ఇవ్వకుండా వేడుక చూశారని ఆరోపణలు ఉన్నాయి. చివరకు ఆయన కోర్టులకు వెళ్లి న్యాయ పోరాటం చేసి ఆయన తన హక్కులను సాధించుకున్నారని అంటారు. 

ఇన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వానికి అంటకాగారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం రాక ముందే జవహర్‌రెడ్డిని పక్కన పెట్టింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఇంతలో నీరబ్‌ కుమార్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇన్ని రోజులు వెయిటింగ్‌లో ఉన్న జవహర్‌ రెడ్డికి గురువారం అర్థరాత్రి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 

సాధారణంగా గత ప్రభుత్వ హయాంలో తమకు వ్యతిరేకంగా పని చేశారని ఆరోపణలు ఉన్న అధికారులను ప్రధాన్యం లేని పోస్టుల్లో వేస్తుంటారు. ముఖ్యంగా ప్రెస్‌ అండ్ ప్రిటింగ్ విభాగం వారికి కనిపించే మొదటి ఆప్షన్. అయితే జవహర్‌ రెడ్డికి మాత్రం ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. వెంటనే ఆయన జాయిన్ అవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. 

ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రటరీగా అనంత రాము ఉన్నారు. ఆయన్ని వెంటనే రిలీవ్ కావాలని నీరబ్ కుమార్ ఆదేశించారు సీఎస్‌గా ఉన్న వ్యక్తిని అదనపు సెక్రటరీగా నియమించడం కాస్త ఇబ్బందిగా ఉన్న గత ప్రభుత్వాల మాదిరిగా అవమానించలేదనే టాక్ వినిపిస్తోంది. జవహర్‌ రెడ్డి జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు. దీని ఒక రోజు ముందే ఆయనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 

జవహర్‌రెడ్డితోపాటు మరో అధికారికి కూడా ప్రభుత్వం రిటైర్మెంట్ ముందే పోస్టింగ్ ఇచ్చింది. ఐఏఎస్‌ అధికారుల బదిలీల టైంలో జీఏడీలో రిపోర్ట్ చేసిన పూనం మాలకొండయ్యకు ఈసారి పోస్టింగ్ వచ్చింది. ఆమె కూడా జూన్ 30 పదవీ విరమణ చేయనున్నారు. ఆమెను జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలో ఉన్న పోలా భాస్కర్‌ స్థానంలో ఈమెను నియమించారు. భాస్కర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. పూనం మాలకొండయ్య కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేసి ఆరోపణలు ఎదుర్కొన్నారు. జూన్ 30 ఆదివారం కావడంతో  వీళ్లిద్దరు ఒక రోజు ముందు అంటే జూన్ 29 శనివారం నాడే ఆఖరి వర్కింగ్‌డేగా గుర్తిస్తారు. కాబట్టి వీళ్లకు రిటైర్మెంట్‌కు ఒకరోజు ముందే పోస్టింగ్ వచ్చినట్టు అయింది. 

కేంద్ర సర్వీస్‌ నుంచి ఏపీకి వచ్చిన పీయూష్‌ కుమార్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఆయన్ని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించింది. పీఎఫ్‌ఎస్‌ ముఖ్య కార్యదర్శి అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారు. ప్రస్తుతం ఆ బాధ్యతలో ఉన్న ఎస్‌ ఎస్‌ రావత్‌ను తప్పించారు. ఆయన ప్రస్తుతం సెలవులో ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget