అన్వేషించండి

Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం

Andhra Pradesh News | కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విద్యార్థుల కుటుంబసభ్యులతో పోలీసుల తీరు సరిగా లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు.

AP Deputy CM Pawan Kalyan | మంగళగిరి: ఏపీలో పోలీసుల తీరుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదివరకే సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తీరు మార్చుకోవాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సైతం పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో హెచ్చరించారు. అయినా కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోతే పోలీసుల తీరు దారుణంగా ఉందని.. వారి తరఫున పవన్ కళ్యాణ్ బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. పవన్ కళ్యాణ్ సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.

పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని పవన్ కళ్యాణ్ అన్నారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే, వారి తప్పులు తమ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని వ్యాఖ్యానించారు. ఇటీవల కాకినాడ జిల్లా తునిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ కేసులో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రులతో పోలీసుల తీరు ఆ కుటుంబాలకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. 


Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం

మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీమవరానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీమురహరి, విజయవాడకు చెందిన నాదెండ్ల నిరంజన్ ల కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని చలించిపోయారు. మృతుల కుటుంబాలకు తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం పవన్ కళ్యాణ్ అందించారు. 

Also Read: AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం 

పోలీసులు మాట్లాడిన తీరు బాగాలేదన్న పవన్

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ‘ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందడం ఎంతగానో బాధించింది. ప్రమాదంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వారి తల్లిదండ్రులు వెళ్లగా అక్కడి సిబ్బంది ప్రవర్తించిన తీరు సరిగా లేదని నాకు తెలిసింది. కనీసం సమాధానం చెప్పకపోగా బాధితుల కుటుంబాలతో పోలీసులు మాట్లాడిన తీరు బాగాలేదు. రోడ్డు ప్రమాదంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అంత కష్ట సమయంలోనూ రేవంత్ బ్రెయిన్ డెడ్ అయితే... అతడి తల్లిదండ్రులు అవయవదానం చేయడం నన్ను కదిలించింది. పోలీసులు రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కేసు నమోదు చేయలేదని తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ సైతం బాధ్యతగా వ్యవహరించకపోవడం దారుణం’ అన్నారు. 


Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం

రోడ్డు ప్రమాద సమయాల్లో తక్షణ సాయం అవసరం: పవన్ కళ్యాణ్ 
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని తక్షణ సాయం అందాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బాధితులను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఘటనాస్థలంలో  ఉన్నవారిపై ఉంటుందని, కానీ మనం కేసుల భయాల నుంచి బయటకు రావాలన్నారు. పోలీసులు, ఉన్నతాధికారులు ఈ విషయంపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి సకాలంలో వైద్య చికిత్స చేయిస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుందన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Visits SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
Andhra Pradesh: పులివెందుల యువరైతు సంతోషం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Andhra Pradesh: పులివెందుల యువరైతు సంతోషం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Oscars 2025: ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Thandel OTT Release Date: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Visits SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
Andhra Pradesh: పులివెందుల యువరైతు సంతోషం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Andhra Pradesh: పులివెందుల యువరైతు సంతోషం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Oscars 2025: ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Thandel OTT Release Date: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
IND VS NZ Live Score: భార‌త్  స్పోర్టివ్ స్కోరు.. రాణించిన శ్రేయ‌స్, హార్దిక్.. ఫైఫ‌ర్ తో రాణించిన హెన్రీ
భార‌త్  స్పోర్టివ్ స్కోరు.. రాణించిన శ్రేయ‌స్, హార్దిక్.. ఫైఫ‌ర్ తో రాణించిన హెన్రీ
Anantapur Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం- నెలల చిన్నారి సహా నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం- నెలల చిన్నారి సహా నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
Meenakshi Chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి - ఆ ప్రచారంలో నిజమెంత?, అలాంటి వారికి వార్నింగ్
ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి - ఆ ప్రచారంలో నిజమెంత?, అలాంటి వారికి వార్నింగ్
Embed widget