అన్వేషించండి

Amaravati pipes on fire: అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !

Amaravati pipe fires: అమరావతి పైపులకు మంటలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరమని ప్రభుత్వం అనుమానిస్తోంది. విచారణకు ఆదేశించింది.

Amaravati pipe fires were a deliberate crime: అమరావతి రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు, ముఖ్యంగా హెచ్‌వోడీ (HOD) భవనాల సమీపంలో పైపులు తగలబడటంపై సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.   

వరుసగా పైపులకు నిప్పు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మళ్లీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. రాయపూడి సమీపంలోని హెచ్‌వోడీ  భవనాల నిర్మాణ ప్రాంగణంలో సోమవారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రాజధాని నిర్మాణ పనుల కోసం  మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ అక్కడ నిల్వ ఉంచిన భారీ పైపులకు ఒక్కసారిగా నిప్పంటుకోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అగ్నిప్రమాదాలు జరగడానికి ఏమాత్రం అవకాశం లేని చోట ఇలా వరుసగా జరుగుతుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వరుసగా మూడు ఘటనలు.. పెరిగిన అనుమానాలు 

రాజధాని ప్రాంతంలో గత పదిహేను రోజుల్లోనే ఇది మూడో ప్రమాదం. ఈ నెల 11వ తేదీన వెలగపూడి జంక్షన్ వద్ద ఎల్ అండ్ టీ  సంస్థకు చెందిన పైపులు తగలబడ్డాయి. అంతకుముందు కూడా ప్రధాని పర్యటన సమయంలో  వెంకటపాలెం సమీపంలో ఇలాంటి ప్రమాదాలే జరిగాయి. సాధారణంగా ఈ పైపులు  HDPE, PVC తయారీవి.  త్వరగా అంటుకునే స్వభావం కలవి కావు, కానీ ఎండిపోయిన గడ్డిని పైపుల వరకు వరుసగా పేర్చి నిప్పు పెట్టినట్లు కొన్ని చోట్ల ఆనవాళ్లు లభించడంతో ఇది ప్రమాదం కాదు  కుట్ర  అనే అనుమానాలు బలపడుతున్నాయి.

సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం - ప్రత్యేక విచారణ 

అమరావతిలో జరుగుతున్న ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం యాదృచ్ఛికం కాదని అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఏదైనా విద్రోహ చర్య . కుట్ర కోణం ఉందేమో తేల్చాలని డీజీపీ, సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. నిర్మాణ సామగ్రిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.

భద్రత పెంపు.. ఫోరెన్సిక్ దర్యాప్తు 

ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో నమూనాలను సేకరించాయి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారా లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ సామగ్రి నిల్వ ఉంచిన చోట్ల సీసీ కెమెరాల నిఘాను పెంచాలని, సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అన్న కోణంలో నిఘా వర్గాలు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాయి. అమరావతిలో వరుసగా జరుగుతున్న ఈ అగ్నిప్రమాదాలు ఇప్పుడు రాజకీయంగాను, పరిపాలనా పరంగాను పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వం చేపట్టే విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Advertisement

వీడియోలు

Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget