By: ABP Desam | Updated at : 22 Nov 2021 01:05 PM (IST)
ప్రభుత్వాన్ని నమ్మలేమన్న అమరావతి రైతులు
మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి అమరావతి రైతులు నమ్మడం లేదు. ప్రభుత్వం మళ్లీ ఏదో తిరకాసు పెడుతుందని నమ్ముతున్నారు. అందుకే పాదయాత్రలో ఉన్న రైతులు తాము వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదని.. 700 రోజులుగా ప్రభుత్వం ఎన్నో కష్టాలు పెట్టిందన్నారు. ఏడు వందల రోజులుగా ఇబ్బందులు పడ్డాం... తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదని జేఏసీ నేతలు గుర్తు చేశారు. పిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేశారన్నారు.
Also Read : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
తాము చేపట్టిన పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వస్తోందని.. చివరికి ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే వెనక్కి తగ్గారని రైతులు భావిస్తున్నారు. ఒక వేళ నిర్ణయం వెనక్కి తీసుకున్నా అమరావతిని అభివృద్ది చేస్తారన్న నమ్మకం లేదన్నారు. బిల్లులు వెనక్కి తీసుకోవడం కుట్రలో భాగమేనని రైతులు గట్టిగా నమ్ముతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మలేమని.. న్యాయస్థానాల నుంచతి భరోసా రావాల్సి ఉందన్నారు. మహాపాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదన్నారు. తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్న తర్వాత డిసెంబర్ 17వ తేదీన పాదయాత్ర ముగిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.
రాజధాని విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందాలేదా అన్న విషయంలో ఎక్కువ మంది ప్రభుత్వాన్ని నమ్మడంలేదు. ప్రభుత్వానికి రో వ్యూహం ఉందని భాిస్తున్నారు. ఆ వ్యూహం ఏమిటో స్పష్టత లేదు ఇప్పటి వరకూ బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా స్పష్టమయింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలని.. రైతుల పోరాటాన్ని అంగీకరించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రైతుల పోరాటాన్ని అభినందిస్తున్నారు. ప్రభుత్వం మరో విధంగా ముందుకు వస్తుందని.. కొంత మంది అనుకోవడం లేదు.
అమరావతికి బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిచించిన తరుణంలో... జనగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని... మరో రకంగా కుట్రలు చేయకపోవచ్చునని వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
HMFW: అనంతపురం జిల్లా వైద్యారోగ్యశాఖలో 72 పోస్టులు, ఈ అర్హతలుండాలి
Gold-Silver Prices Today 29 November 2023: ఆరు నెలల గరిష్టంలో తిష్ట వేసిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Weather Latest Update: 48 గంటల్లో బంగాళాఖాతంలో తుపాను, ఏపీ తెలంగాణపై ఎఫెక్ట్ ఉంటుందా?: ఐఎండీ
Nara Lokesh: ఆ తమ్ముడ్ని నేను చదివిస్తా, విద్యార్థి ఆవేదన విని స్పందించిన లోకేష్
AP High Court : కోర్టు ధిక్కరణ - ఇద్దరు ఏపీ ఐఏఎస్లకు హైకోర్టు నెల రోజుల శిక్ష !
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>