By: ABP Desam | Updated at : 10 Jan 2022 06:30 PM (IST)
హైదరాబాద్ రియల్ కంపెనీల్లో బ్లాక్ దందా !
జనవరి ఐదో తేదీ నుంచి ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో జరిపిన సోదాల్లో దాదాపుగా రూ. 800 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లుగా ఐటీ శాఖ ప్రకటించింది. రూ. కోటి అరవై లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పెద్దగా పబ్లిసిటీ చేసుకోకపోయినప్పటికీ భారీ వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు మూడు రోజుల పాటు కొనసాగాయి. కొద్ది రోజుల క్రితం.. ఏడాదిన్నర క్రితమే ప్రారంభమైన ఓ ఐటీ కంపెనీపై దాడి చేసి దాదాపుగా రూ. డెభ్బై కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలపైనా ఐటీ దాడులు చేశారు.
Also Read: రైతులకు షాక్ ఇచ్చిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు వెంటనే తిరిగిచ్చేయండి
హైదరాబాద్తో పాటు అనంతపురం, తాడిపత్రి, బెంగళూరుల్లో కూడా ఈ కంపెనీలకు సంబంధించిన ఆఫీసుల్లో సోదాలు చేశారు. ఈ కంపెనీలన్నీ విల్లాలు.. భారీ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో విల్లాలు నిర్మిస్తున్నారు. టౌన్ షిప్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. కానీ భారీ ప్రచారానికి దూరంగా ఉంటాయి. పెట్టుబడులకు మాత్రం లోటు ఉండదు. వీటిలోకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయన్నదానిపై ఐటీ అధికారులు కూపీ లాగినట్లుగా తెలుస్తోంది.
Also Read: TN Jallikattu Guidelines: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా
ఆయా సంస్థలు ఇప్పటి వరకూ ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాయి.. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి.. లావాదేవీల సొమ్ము ఎలా మారకం అవుతుంది లాంటి అంశాలను ఐటీ అధికారులు వెలికి తీశారు. సాధారణంగా ఐటీ కంపెనీ సోదాలు చేసిన కంపెనీల పేర్లను ఎప్పుడూ వెల్లడించదు. నాలుగు రోజుల క్రితం నవ్య డెలవపర్స్, రాగమయూరి బిల్డర్స్ వంటి కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. దీంతో ఈ కంపెనీలకు చెందిన వివరాలేనని భావిస్తున్నారు.
Also Read: పిల్లాడిపై ఆ కోతులకు ఎందుకు పగ.. ఇంట్లో నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లాయి.. అంతకుముందు ఇలానే..
మరో వైపు కేరళలో జరిగిన సోదాల్లో అక్కడి కంపెనీలో లెక్కల్లేని రెండు కోట్ల ముఫ్పై లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ శాఖ మరో ప్రకటనలోతెలిపింది. ఆ కంపెనీ రూ. రెండు వందల కోట్ల వరకూ లెక్కలు లేని లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించామని తెలిపింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత
Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
/body>