అన్వేషించండి

Amit Shah AP Politics : ఏపీలో పొత్తుల అంశం త్వరలో ఓ కొలిక్కి - తొలి సారి స్పందించిన అమిత్ షా

Amith Shah : ఏపీలో పొత్తుల అంశం త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Amit Shah AP Politics :  ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల అంశం త్వరలోనే కొలిక్కి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. డిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్యామిలీ ప్లానింగ్ విధానాన్ని తాము నమ్మబోమని చమత్కరించారు. అంటే.. ఎన్డీఏలో చేరాలనుకున్న పార్టీలను ఆహ్వానిస్తామని ఆయన చెప్పినట్లయింది. తమ మిత్రులను తామ ఎప్పుడూ దూరం చేసుకోలేదని.. దూరమైన వాళ్లు.. వారి వారి రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా దూరయ్యారని అంటున్నారు. ఏపీలో పొత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలా ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.  రెండు రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు..  అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. అమిత్ షా ఇంట్లో జరిగిన ఈ సమావేశం తర్వాత అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఎన్డీఏలో టీడీపీ చేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో .. వైసీపీ అధినేత జగన్ కూడా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సమావేశయ్యారు. ఆయన కూడా ఎన్డీఏలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

ఒకే  రాష్ట్రానికి చెందిన రెండు పార్టీలు ఒకే కూటమిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించాలా.. వైఎస్ఆర్‌సీపీని ఆహ్వానించాలా అన్నదానిపై బీజేపీ హైకమాండ్ పరిశీలన జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఏ పార్టీతో వెళ్తే మెరుగైన సీట్లు వస్తాయి.ఏ పార్టీతే వెళ్తే దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఉంటాయో అంచనా వేసుకుని ఆ పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిజానికి ఏపీలో బీజేపీకి ఉన్న బలం ఒకటి.. రెండు శాతం ఓట్లే. ఆ మాత్రం ఓట్ల బలానికి  పొత్తులు పెట్టుకోమని పార్టీ వెంటపడవు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా..  మూడో సారి కూడా గెలుస్తుందన్న అభిప్రాయం గట్టిగా ఏర్పడిన సందర్భంగా బీజేపీ అండ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ఏపీలో రాజకీయ పార్టీలన్నీ బీజే్పీ తో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి.                           

నిజానికి ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అయ్యాయి. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు చర్చలు దాదాపుగా  పూర్తి చేసుకున్నాయి. కానీ  బీజేపీ కూటమిలోకి వస్తుందన్న కారణంగానే ప్రకటన ఆగిపోయింది. వచ్చే నెల ఎన్నికల షెడ్యూల్  విడదలయ్యే అవకాశం ఉండటంతో.. బీజేపీ త్వరలోనే తమ విధానాన్ని స్పష్టం చేస్తుందని రాజకీయ పార్టీల నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.                                                 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget