By: ABP Desam | Updated at : 09 May 2022 06:20 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
AP Power Connections Meters : రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు వచ్చే ఆరు నెలల్లో విద్యుత్ మీటర్లను అమర్చాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కం అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు చెల్లించాల్సిన సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఆ సబ్సిడీ మొత్తాలను రైతుల ఖాతాలకే నేరుగా డీబీటీ కింద జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. అందుకోసం రైతులతో ఈ నెలాఖరు నాటికి బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. సచివాలయంలో సోమవారం విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు.
అదనపు చెల్లింపులకు చెక్
విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయానికి నికరంగా రైతులు ఎంత మేరకు విద్యుత్ ను వినియోగించుకుంటున్నారో కచ్చితమైన వివరాలు తెలుస్తాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా 28 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే జిల్లాలో 26 వేల వ్యవసాయ కనెక్షన్ లకు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకున్నారన్నారు. దాని ప్రకారం విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. అయితే ఇదే జిల్లాల్లో విద్యుత్ మీటర్లను బిగించిన తరువాత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 28 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు 67.76 మినియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించినట్లు గుర్తించామన్నారు. మీటర్లు పెట్టడంతో నికరంగా ఎంత విద్యుత్ ను వ్యవసాయం కోసం వినియోగిస్తున్నారో తేలిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రెండు వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ తక్కువగానే వినియోగించినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని డిస్కంలకు చెల్లించిందన్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పేరుతో చేస్తున్న అదనపు చెల్లింపులకు చెక్ పెట్టామన్నారు.
రైతులకు బ్యాంకు ఖాతాలు
సీఎం జగన్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ ను మరింత నాణ్యత, మెరుగైన సరఫరాతో రైతులకు చేరువ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, రైతులు వ్యవసాయానికి వినియోగించిన ప్రతి యూనిట్ కు ప్రభుత్వమే సబ్సిడీ చెల్లింపులు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకోసం రైతుల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించాలని, వారి వ్యవసాయ కనెక్షన్ కోసం వినియోగించిన విద్యుత్ కు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా డీబీటీ విధానంలో వారి ఖాతాల్లోనే జమ చేస్తుందన్నారు. ఈ సొమ్మును రైతులు డిస్కంలకు చెల్లిస్తారన్నారు. దీని వల్ల డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వాటికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను త్వరతగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అందుకు డిస్కం అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన గడువు నాటికి రాష్ట్రం అంతా కొత్త మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
డిస్కంలకు రుణాలు
జగనన్న హౌసింగ్ కాలనీలు పూర్తయ్యి, గృహాల్లో లబ్ధిదారులు నివాసాలను ప్రారంభించే నేపథ్యంలో ఆ కాలనీల్లో విద్యుదీకరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అందుకోసం నిధుల కొరత లేకుండా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డిస్కంలకు రుణాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైయస్ఆర్ జలకళ కింద రైతులకు విద్యుత్ సదుపాయం కల్పించడం, విద్యుత్ ఉపకరణాలను అందించే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని సూచించారు.
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్
Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి