అన్వేషించండి

Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ

Manmohan Singh Memorial : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలాన్ని కేటాయిస్తుందని కాంగ్రెస్ చేసిన వివాదానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముగింపు పలికింది.

Manmohan Singh Memorial : భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్రకు, అంతిమ సంస్కారాలకు సమయం ఆసన్నమైంది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌లో ఆయన అంత్యక్రియలకు అధికారులు ఇప్పటికే  ఏర్పాట్లు చేశారు. ఇక తాజాగా స్మారకస్థలంపై కూడా కేంద్రం ఒక హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. దీనిపై మన్మోహన్ కుటుంబసభ్యులకు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్రహోంశాఖ సమాచారం అందించింది.

మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలాన్ని కేటాయిస్తుందని కాంగ్రెస్ చేస్తున్న వివాదానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డిసెంబర్ 27న రాత్రి ముగింపు పలికింది. "మాజీ ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకానికి సంబంధించిన వాస్తవాలు" అనే శీర్షికతో అర్థరాత్రి విడుదల చేసిన మంత్రిత్వ శాఖ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుండి సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కేంద్రానికి అభ్యర్థన వచ్చిందని తెలిపింది. దీనిపై శుక్రవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించిన తరువాత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలం కేటాయింపు గురించి ఖర్గే. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో సంభాషించారు. 

ప్రస్తుతానికైతే మన్మోహన్ సింగ్ దహన సంస్కారాలు, ఇతర లాంఛనాలు జరుగుతాయని కేంద్రం చెప్పింది. ఎందుకంటే ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దానికి స్థలం కేటాయించేందుకు సమయం పడుతుందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సింగ్ స్మారక చిహ్నానికి స్థలం ఇంకా కనుగొనలేదని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రాన్ని నిందించింది. ఇది దేశం మొదటి సిక్కు ప్రధాన మంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఆపోపించింది.

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో సింగ్ అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నుండి తీవ్ర స్పందన వచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఆయన వారసత్వాన్ని పురస్కరించుకుని స్మారక చిహ్నం నిర్మించే ప్రదేశంలో సింగ్ అంత్యక్రియలను నిర్వహించాలని కోరుతూ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని చెప్పారు. "అతని దహన సంస్కారాలు, స్మారక చిహ్నం కోసం భారత ప్రభుత్వం ఎందుకు స్థలాన్ని కనుగొనలేకపోయిందో మన దేశ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, అతని ప్రపంచ స్థాయికి తగినట్లుగా దశాబ్దాలుగా దేశానికి ఆదర్శప్రాయమైన సేవ చేశారు" అని రమేష్‌ ఎక్స్‌పై పోస్ట్‌లో తెలిపారు. ఇది భారత తొలి సిక్కు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించడమే తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ నేత ఆరోపించారు.

Also Read : Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?

 
 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget