Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
Manmohan Singh Memorial : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలాన్ని కేటాయిస్తుందని కాంగ్రెస్ చేసిన వివాదానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముగింపు పలికింది.
![Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ Centre Agrees To Manmohan Singh Memorial After Congress Attack Says Need Time To Form Trust Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/28/01fa6401e6e1c819bea803021e45d6c61735357660694697_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Manmohan Singh Memorial : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్రకు, అంతిమ సంస్కారాలకు సమయం ఆసన్నమైంది. ఢిల్లీలోని నిగమ్బోధ్లో ఆయన అంత్యక్రియలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇక తాజాగా స్మారకస్థలంపై కూడా కేంద్రం ఒక హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. దీనిపై మన్మోహన్ కుటుంబసభ్యులకు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్రహోంశాఖ సమాచారం అందించింది.
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలాన్ని కేటాయిస్తుందని కాంగ్రెస్ చేస్తున్న వివాదానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డిసెంబర్ 27న రాత్రి ముగింపు పలికింది. "మాజీ ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకానికి సంబంధించిన వాస్తవాలు" అనే శీర్షికతో అర్థరాత్రి విడుదల చేసిన మంత్రిత్వ శాఖ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుండి సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కేంద్రానికి అభ్యర్థన వచ్చిందని తెలిపింది. దీనిపై శుక్రవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించిన తరువాత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలం కేటాయింపు గురించి ఖర్గే. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో సంభాషించారు.
ప్రస్తుతానికైతే మన్మోహన్ సింగ్ దహన సంస్కారాలు, ఇతర లాంఛనాలు జరుగుతాయని కేంద్రం చెప్పింది. ఎందుకంటే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి, దానికి స్థలం కేటాయించేందుకు సమయం పడుతుందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సింగ్ స్మారక చిహ్నానికి స్థలం ఇంకా కనుగొనలేదని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రాన్ని నిందించింది. ఇది దేశం మొదటి సిక్కు ప్రధాన మంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఆపోపించింది.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో సింగ్ అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నుండి తీవ్ర స్పందన వచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఆయన వారసత్వాన్ని పురస్కరించుకుని స్మారక చిహ్నం నిర్మించే ప్రదేశంలో సింగ్ అంత్యక్రియలను నిర్వహించాలని కోరుతూ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని చెప్పారు. "అతని దహన సంస్కారాలు, స్మారక చిహ్నం కోసం భారత ప్రభుత్వం ఎందుకు స్థలాన్ని కనుగొనలేకపోయిందో మన దేశ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, అతని ప్రపంచ స్థాయికి తగినట్లుగా దశాబ్దాలుగా దేశానికి ఆదర్శప్రాయమైన సేవ చేశారు" అని రమేష్ ఎక్స్పై పోస్ట్లో తెలిపారు. ఇది భారత తొలి సిక్కు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను ఉద్దేశపూర్వకంగా అవమానించడమే తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)