అన్వేషించండి

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు, సీఎంవోలోకి పూనం మాలకొండయ్య

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీలు అయ్యాయి. నూతన సీఎస్ ప్రకటన ఉత్తర్వులు వచ్చిన కొద్ది సేపటికే ఐఏఎస్ ల బదిలీలపై జీవో విడుదల అయింది.

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ప్రస్తుతం సీఎంవో స్పెషల్‌ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న  కేఎస్‌ జవహర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఎంవో స్పెషల్‌ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన రెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. బుడితి రాజశేఖర్‌ సెలవు నుంచి తిరిగొచ్చాక జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.  

సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి 

ఏపీ నూతన సీఎస్ గా కేఎస్ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తతు ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం ఈ నెల(నవంబర్) 30కు పూర్తికానుంది. డిసెంబరు 1 నుంచి నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు.  2024 జూన్‌ వరకు జవహర్ రెడ్డి సర్వీసులో ఉంటారు.  అంటే ఏడాదిన్నర పాటు సేవలు అందిస్తారు. కరెక్ట్‌గా ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత రిటైర్ అవుతారు. అందుకే ఆయన నియామకానికి సీఎం మొగ్గు చూపుతున్నారనే మాట వినిపిస్తోంది. సీఎస్ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్‌ రెడ్డిపై ఎప్పటి నుంచే జగన్‌కు ప్రత్యేక ఇంట్రస్ట్ ఉందనే మాట వినిపించింది. ఆయన ఇప్పటి వరకు వివిధ జిల్లాల కలెక్టర్‌గా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా సేవలు అందించారు. ఇప్పుడు సీఎంకు స్పెషల్‌ సెక్రెటరీగా జవహర్ రెడ్డి ఉన్నారు. 

సమీర్ శర్మకు పదవి 

సీఎస్ గా పదవీ విరమణ అనంతరం సమీర్ శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్ లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ ఛైర్మన్ పోస్టులోనూ ఆయనను ఇంఛార్జీగా నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒక్క ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్ప జగన్ ప్రభుత్వ హయాంలో పని చేసిన సీఎస్‌లందరూ రిటైర్‌మెంట్‌ తర్వాత ఏదో ఒక పదవిలో నియమితులయ్యారు. ఇప్పటి వరకు నలుగురు ఐఏఎస్‌లు సీఎస్‌లుగా పని చేశారు. మొదట ఎల్వీ సుబ్రహ్మణ్యం తర్వాత నీలంసహ్నీ, అదిత్యనాథ్‌ దాస్‌, ఇప్పుడు సమీర్ శర్మ. అందరు కూడా సీఎంకు అత్యంత సన్నిహింతగా మెలిగారు. ఎల్వీ సుబ్రహ్మణానికి డిమాష్‌ వస్తే మిగతావాళ్లకు మాత్రం రిటైర్‌ అయిన తర్వాత వేర్వేరు శాఖల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. నీలం సాహ్నిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గానూ, ఆదిత్య నాథ్ దాస్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగాను నియమించారు.
  

బదిలీల వివరాలు ఇలా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా?  సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
Telangana Govt: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో టెండర్ల రచ్చ - మంత్రితో వివాదాలతో ఐఏఎస్ వీఆర్ఎస్ !
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో టెండర్ల రచ్చ - మంత్రితో వివాదాలతో ఐఏఎస్ వీఆర్ఎస్ !
Saudi Arabia: భారత వలస కార్మికులకు పండగే- సౌదీలో కఫీల్ అరాచకాలకు చెక్ -కఫాలా వ్యవస్థ రద్దు !
భారత వలస కార్మికులకు పండగే- సౌదీలో కఫీల్ అరాచకాలకు చెక్ -కఫాలా వ్యవస్థ రద్దు !
IND vs AUS: ఆడిలైడ్‌లో భారత్ ఓటమి, 2 వికెట్ల తేడాతో రెండో వన్డే గెలుచుకున్న ఆస్ట్రేలియా; కెప్టెన్‌గా తొలి సిరీస్ కోల్పోయిన గిల్
ఆడిలైడ్‌లో భారత్ ఓటమి, 2 వికెట్ల తేడాతో రెండో వన్డే గెలుచుకున్న ఆస్ట్రేలియా; కెప్టెన్‌గా తొలి సిరీస్ కోల్పోయిన గిల్
Advertisement

వీడియోలు

కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
New Zealandతో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్‌.. టీమ్‌లో కీలక మార్పులు
1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
టెస్ట్‌ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా?  సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
Telangana Govt: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో టెండర్ల రచ్చ - మంత్రితో వివాదాలతో ఐఏఎస్ వీఆర్ఎస్ !
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో టెండర్ల రచ్చ - మంత్రితో వివాదాలతో ఐఏఎస్ వీఆర్ఎస్ !
Saudi Arabia: భారత వలస కార్మికులకు పండగే- సౌదీలో కఫీల్ అరాచకాలకు చెక్ -కఫాలా వ్యవస్థ రద్దు !
భారత వలస కార్మికులకు పండగే- సౌదీలో కఫీల్ అరాచకాలకు చెక్ -కఫాలా వ్యవస్థ రద్దు !
IND vs AUS: ఆడిలైడ్‌లో భారత్ ఓటమి, 2 వికెట్ల తేడాతో రెండో వన్డే గెలుచుకున్న ఆస్ట్రేలియా; కెప్టెన్‌గా తొలి సిరీస్ కోల్పోయిన గిల్
ఆడిలైడ్‌లో భారత్ ఓటమి, 2 వికెట్ల తేడాతో రెండో వన్డే గెలుచుకున్న ఆస్ట్రేలియా; కెప్టెన్‌గా తొలి సిరీస్ కోల్పోయిన గిల్
Dude Box Office Collection: 6 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి 'డ్యూడ్' - హ్యాట్రిక్ కొట్టేసిన కోలీవుడ్ స్టార్ ప్రదీప్...
6 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి 'డ్యూడ్' - హ్యాట్రిక్ కొట్టేసిన కోలీవుడ్ స్టార్ ప్రదీప్...
Andhra rapists Dead end: ఏపీలో ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు - చంద్రబాబు హెచ్చరికలకు తగ్గట్లే పరిణామాలు!
ఏపీలో ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు - చంద్రబాబు హెచ్చరికలకు తగ్గట్లే పరిణామాలు!
YS Jagan On Balakrishna: బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడు, అలాంటి వ్యక్తితో మాట్లాడించిన స్పీకర్‌కు బుద్ధి లేదు: జగన్ 
బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడు, అలాంటి వ్యక్తితో మాట్లాడించిన స్పీకర్‌కు బుద్ధి లేదు: జగన్ 
Bandi sanjay Kumar: గోవధ జరిగితే చేతులు కట్టుకొని కూర్చోం- పోలీసులు చేయలేని పని చేసి చూపిస్తాం: బండి సంజయ్‌
గోవధ జరిగితే చేతులు కట్టుకొని కూర్చోం- పోలీసులు చేయలేని పని చేసి చూపిస్తాం: బండి సంజయ్‌
Embed widget