అన్వేషించండి

CM Jagan Review : మూడోతరగతి నుంచి 10వ తరగతి వరకూ సబ్జెక్ట్‌ టీచర్స్‌ కాన్సెప్ట్ - సీఎం జగన్

CM Jagan Review : పాఠశాలలు తెరిచే రోజే విద్యాకానుక కిట్ ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇస్తున్నందు వల్ల పుస్తకాల సైజ్ పెరిగిందన్నారు.

CM Jagan Review : నాణ్యమైన విద్యకోసం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తున్నామని సీఎం జగన్ అన్నారు. విద్యా శాఖ పై సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. బడులు ప్రారంభమ్యయే తొలి రోజునే విద్యాకానుక కిట్‌ ఇస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా స్కూల్‌ బ్యాగు, బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఇస్తున్నామని చెప్పారు. వీటన్నింటినీ ఒకేసారి పిల్లలకు స్కూల్‌ ప్రారంభించే తొలిరోజే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్కూల్‌ పిల్లలకు సెప్టెంబరు, అక్టోబరు వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండేదని సీఎం గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ విధానంలో మార్పు తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యతిరేక మీడియా రాతలు ఉన్నాయని జగన్ మండిపడ్డారు.

ఇంగ్లీషు మీడియంపై ఎందుకు వ్యతిరేకత 

పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందడం కొందరికి ఇష్టం లేదని సీఎం జగన్ అన్నారు. అందుకే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాకీయంగా జగన్‌ను ఇబ్బందిపెట్టాలి కాబట్టి, ఇలాంటి కథనాలు రాస్తున్నారని, రాజకీయంగా జరుగుతున్న ఈ యుద్ధంలో.. దురదృష్టవశాత్తూ  సామాన్యులు, తల్లిదండ్రులు, బడిపిల్లలు ఇబ్బంది పడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకువచ్చామని, పుస్తకాల్లో జోడించిన అదనపు సమాచారంతో బైలింగువల్‌ కాన్సెప్ట్‌ వల్ల టెక్ట్స్‌బుక్‌ సైజు పెరిగిందని, బైలింగువల్‌ టెక్ట్‌బుక్స్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషు ఉంటుందన్నారు.  దీంతో సాధారణంగానే టెక్ట్స్‌బుక్‌ సైజు పెరుగుతుందన్నారు. దీన్ని కూడా వక్రీకరించి, పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు ప్రచారం చేయటం పై జగన్ అభ్యంతరం తెలిపారు.

పటిష్టంగా సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌ 

గతంలో క్లాస్‌ టీచర్‌కే అవకాశం లేని పరిస్థితుల నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నట్లు సీఎం వివరించారు. అంతకు ముందు పాఠ్యాంశాలు అదే సబ్జెక్టులో నిపుణుడైన టీచర్‌ బోధించే పరిస్థితి లేదని గుర్తు చేశారు. అందుకే సబ్జెక్టు టీచర్‌ కాన్సెప్ట్‌ పేరుతో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మూడోతరగతి నుంచి 10వ తరగతి వరకూ సబ్జెక్ట్‌ టీచర్స్‌ కాన్సెప్ట్‌ సమర్థవంతగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ పిల్లలకు సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ బోధన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.

 డిజిటలైజేషన్‌ ఆఫ్‌ క్లాస్‌ రూమ్స్‌ 

డిజిటలైజేషన్‌ ప్రక్రియలో స్కూల్లో ఉన్న  ప్రతి క్లాస్‌రూం డిజిటలైజ్ కావాలని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పేద పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే మన లక్ష్యమని వివరించారు. అప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. పేదరికం నుంచి బయటపడి, కేవలం విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అందుకే విద్యారంగంలో చేపడుతున్న ఈ మార్పులు విషయంలో రాజీ పడొద్దని సూచించారు. విద్యారంగంలో పెడుతున్న ఖర్చు  మానవవనరుల మీద పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి కింద భావించాలని, ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయాల్సిన పనిలేదన్నారు. అంతే కాదు గోరుముద్ద అమలు ప్రక్రియ కూడా పక్కాగా ఉండాలని సీఎం అన్నారు. ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs RR Match Highlights | లాస్ట్ ఓవర్ థ్రిల్లర్..KKR పై రాజస్థాన్ సూపర్ విక్టరీ | IPL 2024 | ABPCivils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP DesamCivils Ranker Arpitha Khola Interview | IPS అవుతున్నారుగా.. ఏం మార్చగలరు..! | ABP DesamCivils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Embed widget