అన్వేషించండి

CM Jagan : ఆక్వా ధరల పతనంపై సీఎం జగన్ సీరియస్, సిండికేట్‌ వ్యాపారులకు వార్నింగ్!

CM Jagan : ఆక్వా ధరల పతనం, ఫీడ్ ధరలపై వస్తున్న ఫిర్యాదుపై సీఎం జగన్ సమీక్షంచారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

CM Jagan : ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్‌ ధరల పెంపుపై ముఖ్యమంత్రికి రైతులు, రైతు సంఘాలు నేతలు ఫిర్యాదు చేశారు. ఆక్వా రైతుల ఫిర్యాదుల పై స్పందించిన సీఎం... ముగ్గురు మంత్రులు, సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతుల ఫిర్యాదు చేయ‌టంతో జ‌గ‌న్ వెంట‌నే స‌మీక్ష నిర్వహించారు. ధరలు పతనమై నష్టపోతున్నామన్న రైతులు, ఆక్వాఫీడ్‌ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. తన దష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నివేదిక అందించాలని సీఎం అన్నారు. నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం. కమిటీలో విద్యుత్‌, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, స్పెషల్‌ సీఎస్‌లు విజయానంద్, పూనం మాలకొండయ్య, మత్సశాఖ కమిషనర్‌ కన్నబాబు ఉన్నారు. 

ఆక్వా కల్చర్ చట్టం 

ఆక్వా కల్చర్‌లో 60 శాతం నిర్వహణ వ్యయం కేవలం ఫీడ్‌ కోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెల‌కొంది. ప్రస్తుతం ఈ ఫీడ్‌కు సంబంధించిన నాణ్యత ఇతర అంశాల పర్యవేక్షణ కోసం ఎలాంటి నియంత్రణ వ్యవస్ధ దేశంలో మరెక్కడా లేదు. ఫిష్‌ ఫీడ్‌కు సంబంధించి అధిక ధరలు, సిండికేట్‌ వ్యవహారాలను నియంత్రించడానికి, మత్స్యపరిశ్రమ మనుగడ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్ట్‌ – 2020 ఆక్వా రైతులకు అండగా ఉంటుందని భావించింది. ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్ట్‌ 2020ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. 

కల్తీ సీడ్ నియంత్రణకు చర్యలు 

ఈ చట్టాలు ద్వారా ఆక్వా కల్చర్‌ రంగలో నాణ్యమైన సీడ్‌ అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు అడుగులు పడతాయని భావించింది ప్రభుత్వం. కల్తీ సీడ్‌ని నియంత్రించడం ద్వారా వ్యాధుల బారిన పడని, పెరుగుదల లేని రకాలను నియంత్రణతో పాటు మంచి దిగుబడినిచ్చే సీడ్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంది. ఇది ఆక్వా కల్చర్‌ రంగానికి వెన్నుముక అయిన రైతుకు అండగా నిలుస్తుందని అభిప్రాయపడింది.  ఈ యాక్ట్‌ ద్వారా ఆక్వారంగంలో అనైతిక విధానాలకు అడ్డుకట్టు వేయడంతోపాటు నాణ్యత కలిగిన ఉత్పత్తులను మెరుగుపర్చేందుకు అవకాశం కలిగిస్తుందని కూడా అధికారులు తెలిపారు. కానీ వారి అంచనాలు తారుమారు చేస్తూ వ్యాపారులు సిండికేట్‌గా మారడం రైతులు నష్టపోతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటు 

మత్స్యపరిశ్రమ, ఆక్వాకల్చర్‌ సమగ్రాభివృద్ధి కోసం నిపుణుల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీని పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడనుంది ప్రకటించింది. రాష్ట్రంలోని ఆక్వాకల్చర్‌కు సంబంధించిన కార్యకలాపాలును ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ ఆక్వాకల్చర్‌ ఉత్పత్తుల నాణ్యత, ధరలతోపాటు సీడ్, ఫీడ్‌కు సంబంధించిన అంశాలను కూడా పర్యవేక్షిస్తుంది. కోవిడ్‌ సమయంలో కూడా 2020లో ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు పలు చర్యలు తీసుకుంది. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాల నుంచి నిషేధం కారణంగా... ధరలు గణనీయంగా పడిపోవడంతోపాటు రైతులు కూడా తమ ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది.అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, శీతలగిడ్డంగులను, ప్రాసెసింగ్‌ ప్లాంట్లను వెంటనే తెరిపించడంతోపాటు రైతుల ఉత్పత్తులను తగిన ధరలను కూడా నిర్ణయించింది. 

ఆక్వారైతుల సంక్షేమం కోసం 

ఆక్వా రైతుల ఉత్పాదయ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతోపాటు యూనిట్‌కు రూ.1.50 పైసలు సబ్సిడీ కూడా ఇస్తోంది. గతంలో 2016లో ఆక్వా రైతులకు పవర్‌ టారిఫ్‌ యూనిట్‌ రూ.4.63 నుంచి రూ.7  కాగా.. 2016 నుంచి 2018 మే వరకు యూనిట్‌ రూ.3.86 పైసలకు సరఫరా చేసింది. జూన్‌ 2108 నుంచి జూన్‌ 2019 వరకు రూ.2 కే యూనిట్‌ సరఫరా చేయగా... జూలైలో ప్రభుత్వం యూనిట్‌ రూ.1.50 కే అందిస్తూ ఉత్తర్వులుజారీ చేసింది. 

రొయ్యల ఉత్పత్తిలో 78 శాతం వాటా 
 
ఆక్వాకల్చర్‌ సాగులో దేశంలోనే అగ్ర స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సుమారు 2 లక్షల హెక్టార్ల ఆక్వాసాగులో 1.10 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు, 429 రొయ్యల హేచరీస్, 102 ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, 107 శీతల గిడ్డంగులు, 37 ఫీడ్‌ ప్లాంట్లు, 225 ఆక్వా ల్యాబులు, 1014 ఆక్వా షాపులు ఉన్నాయి. ఏపీలో ఏడాదికి సుమారు 60వేల మిలియన్‌ల ఉత్పత్తితో ఆక్వా హబ్‌గా ఏపీ నిల‌బ‌డింది. దేశంలోనే 30 శాతానికిపైగా వాటాతో రొయ్యలు, చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా నిల్చింది ఏపీ. ఆక్వా కల్చర్‌ ద్వారా రాష్ట్రంలో సుమారు 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న రొయ్యలలో 78 శాతం ఏపీ వాటా ఉంది.  దేశవ్యాప్తంగా 10.17 లక్షల మెట్రిక్‌ టన్నుల రొయ్యలు ఉత్పత్తి కాగా కేవలం ఏపీలోనే 7.89 లక్షల మెట్రిక్‌ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిషాతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు ఏటా దాదాపు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల చేపలు ఎపీ నుంచి  సరఫరా అవుతున్నాయి. అందుకే ప్రభుత్వం అక్వారంగంపై ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. ఏ చిన్న అలసత్వం లేకుండా చూడాలని అధికారులను అదేశించారు సీఎం జగన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Hyderabad Latest News: హైదరాబాద్‌ దాహం తీర్చేందుకు సరికొత్త ప్లాన్! ఇంటింటికీ 24/7 నీరు ఎప్పటి నుంచి అంటే?
హైదరాబాద్‌ దాహం తీర్చేందుకు సరికొత్త ప్లాన్! ఇంటింటికీ 24/7 నీరు ఎప్పటి నుంచి అంటే?
The Raja Saab Director: ప్రభాస్ మీడియం రేంజ్ హీరోనా? కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి
ప్రభాస్ మీడియం రేంజ్ హీరోనా? కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి

వీడియోలు

Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Hyderabad Latest News: హైదరాబాద్‌ దాహం తీర్చేందుకు సరికొత్త ప్లాన్! ఇంటింటికీ 24/7 నీరు ఎప్పటి నుంచి అంటే?
హైదరాబాద్‌ దాహం తీర్చేందుకు సరికొత్త ప్లాన్! ఇంటింటికీ 24/7 నీరు ఎప్పటి నుంచి అంటే?
The Raja Saab Director: ప్రభాస్ మీడియం రేంజ్ హీరోనా? కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి
ప్రభాస్ మీడియం రేంజ్ హీరోనా? కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి
Happy New Year 2026 : న్యూ ఇయర్ క్రేజీ ట్రెడీషన్స్.. 12 ద్రాక్షల నుంచి రెడ్ కలర్ ఇన్నర్ వేర్ వరకు, ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం
న్యూ ఇయర్ క్రేజీ ట్రెడీషన్స్.. 12 ద్రాక్షల నుంచి రెడ్ కలర్ ఇన్నర్ వేర్ వరకు, ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం
Bhimili TDP issue: భీమిలి టీడీపీ టిక్కెట్‌పై గంటా, భరత్ మధ్య చిచ్చు ప్రచారం - వాళ్లిద్దరి స్పందన హైలెట్
భీమిలి టీడీపీ టిక్కెట్‌పై గంటా, భరత్ మధ్య చిచ్చు ప్రచారం - వాళ్లిద్దరి స్పందన హైలెట్
Team India: రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విజేత కీలక వ్యాఖ్యలు..
రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విజేత కీలక వ్యాఖ్యలు..
Multibagger stock: ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన మల్టీ బ్యాగర్ స్టాక్.. మీ నగదును రెట్టింపు చేసింది
ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన మల్టీ బ్యాగర్ స్టాక్.. మీ నగదును రెట్టింపు చేసింది
Embed widget