అన్వేషించండి

Chirala Politics: వైసీపీ నేత ఆమంచి కాంగ్రెస్‌లోకి ఫిక్స్ - కీలక ప్రకటన

AP News: చీరాలలో తన అనుచరులు, అభిమానులతో సమావేశమైన తర్వాత మంగళవారం (ఏప్రిల్ 9) ఆమంచి క్రిష్ణమోహన్ ఈ ప్రకటన చేశారు. త్వరలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని చెప్పారు.

Amanchi Krishna Mohan: చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి క్రిష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కొంత కాలంగా ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. చీరాల నియోజకవర్గంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశమైన అనంతరం మంగళవారం (ఏప్రిల్ 9) ఆమంచి ఈ ప్రకటన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్‌ తన అనుచరులతో సమావేశం అయ్యారు. త్వరలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని ప్రకటన చేశారు. 

కొద్ది రోజులుగా తాను చీరాలలో వరుసగా సమావేశాలు పెట్టి అభిప్రాయం సేకరించినట్లుగా ఆమంచి చెప్పారు. వారి అభిప్రాయం మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. అంతకుముందు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగాలని నిర్ణయించుకున్నానని.. ఆటో గుర్తు కూడా అనుకున్నట్లుగా వివరించారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసినందువల్ల తాను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమంచి చెప్పారు. కాంగ్రెస్ తరపున చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో తాను గెలుస్తానని ఆమంచి ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబుపై తనకు గౌరవం ఉన్నప్పటికీ.. తన భావజాలానికి సెట్ అవ్వకపోవడంతో అందులో ఇమడలేకపోయానని ఆమంచి చెప్పారు. తనకు వైసీపీ అధిష్ఠానం సముచిత స్థానం ఇచ్చిందని.. పర్చూరు నుంచి పోటీ చేయమని సూచించిందని తెలిపారు. అయితే, తనకు చీరాల అయితేనే కరెక్ట్‌ అనుకుని వైఎస్ఆర్‌ సీపీ నుంచి బయటకు వచ్చానని ఆమంచి కృష్ణమోహన్‌ చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పారు.

చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం
చీరాల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సార్లు ఇరు వర్గాలకు చెందిన వారు బాహాబాహీకి కూడా దిగారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేలా వైసీపీ అధిష్ఠానం ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది. అయినా ఎలాంటి మార్పు రాకపోగా.. శత్రుత్వం మరింత పెరిగింది. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రయత్నించారు.

తొలుత టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరడంతో పార్టీలో ఆమంచికి ప్రాధాన్యం తగ్గింది. దీన్ని ఆమంచి క్రిష్ణమోహన్ సహించలేకపోయారు. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాలలో వీరిద్దరే ప్రత్యర్థులుగా ఉండగా.. ఆమంచి ఓడారు.. కరణం గెలిచారు. ఎన్నికలు అయిన వెంటనే కరణం బలరాం వైసీపీ కండువా కప్పుకున్నారు. అలా ఈ రెండు వర్గాల మధ్య ఓ యుద్ధమే జరుగుతూ వచ్చింది.

బలమంతా చీరాలలోనే
ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధిష్ఠానం చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు చీరాల ఇంఛార్జి బాధ్యతలు.. మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చింది. కానీ, తన బలమంతా చీరాలలోనే ఉందని ఆమంచి భావించి.. పర్చూరు బాధ్యతలను అయిష్టంగానే తీసుకున్నారు. కానీ, ఎలాగైనా చీరాలలోనే పోటీ చేయాలని ఫిక్స్ అయి.. వైసీపీకి రాజీనామా చేసి బయటికి వచ్చారు. తాజాగా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget