అన్వేషించండి

Chirala Politics: వైసీపీ నేత ఆమంచి కాంగ్రెస్‌లోకి ఫిక్స్ - కీలక ప్రకటన

AP News: చీరాలలో తన అనుచరులు, అభిమానులతో సమావేశమైన తర్వాత మంగళవారం (ఏప్రిల్ 9) ఆమంచి క్రిష్ణమోహన్ ఈ ప్రకటన చేశారు. త్వరలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని చెప్పారు.

Amanchi Krishna Mohan: చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి క్రిష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కొంత కాలంగా ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. చీరాల నియోజకవర్గంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశమైన అనంతరం మంగళవారం (ఏప్రిల్ 9) ఆమంచి ఈ ప్రకటన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్‌ తన అనుచరులతో సమావేశం అయ్యారు. త్వరలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని ప్రకటన చేశారు. 

కొద్ది రోజులుగా తాను చీరాలలో వరుసగా సమావేశాలు పెట్టి అభిప్రాయం సేకరించినట్లుగా ఆమంచి చెప్పారు. వారి అభిప్రాయం మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. అంతకుముందు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగాలని నిర్ణయించుకున్నానని.. ఆటో గుర్తు కూడా అనుకున్నట్లుగా వివరించారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసినందువల్ల తాను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమంచి చెప్పారు. కాంగ్రెస్ తరపున చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో తాను గెలుస్తానని ఆమంచి ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబుపై తనకు గౌరవం ఉన్నప్పటికీ.. తన భావజాలానికి సెట్ అవ్వకపోవడంతో అందులో ఇమడలేకపోయానని ఆమంచి చెప్పారు. తనకు వైసీపీ అధిష్ఠానం సముచిత స్థానం ఇచ్చిందని.. పర్చూరు నుంచి పోటీ చేయమని సూచించిందని తెలిపారు. అయితే, తనకు చీరాల అయితేనే కరెక్ట్‌ అనుకుని వైఎస్ఆర్‌ సీపీ నుంచి బయటకు వచ్చానని ఆమంచి కృష్ణమోహన్‌ చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పారు.

చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం
చీరాల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సార్లు ఇరు వర్గాలకు చెందిన వారు బాహాబాహీకి కూడా దిగారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేలా వైసీపీ అధిష్ఠానం ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది. అయినా ఎలాంటి మార్పు రాకపోగా.. శత్రుత్వం మరింత పెరిగింది. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రయత్నించారు.

తొలుత టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరడంతో పార్టీలో ఆమంచికి ప్రాధాన్యం తగ్గింది. దీన్ని ఆమంచి క్రిష్ణమోహన్ సహించలేకపోయారు. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాలలో వీరిద్దరే ప్రత్యర్థులుగా ఉండగా.. ఆమంచి ఓడారు.. కరణం గెలిచారు. ఎన్నికలు అయిన వెంటనే కరణం బలరాం వైసీపీ కండువా కప్పుకున్నారు. అలా ఈ రెండు వర్గాల మధ్య ఓ యుద్ధమే జరుగుతూ వచ్చింది.

బలమంతా చీరాలలోనే
ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధిష్ఠానం చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు చీరాల ఇంఛార్జి బాధ్యతలు.. మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చింది. కానీ, తన బలమంతా చీరాలలోనే ఉందని ఆమంచి భావించి.. పర్చూరు బాధ్యతలను అయిష్టంగానే తీసుకున్నారు. కానీ, ఎలాగైనా చీరాలలోనే పోటీ చేయాలని ఫిక్స్ అయి.. వైసీపీకి రాజీనామా చేసి బయటికి వచ్చారు. తాజాగా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget