అన్వేషించండి

పులివెందులలో YSRCP ఓటమి: కుప్పం ఎఫెక్ట్! జగన్ కంచుకోటలో టీడీపీ సంచలన విజయం వెనుక అసలు కారణం ఇదేనా?

YSRCP Pulivendula Defeat: పులివెందుల నియోజకవర్గంలో జగన్ మోహనరెడ్డి దారుణ పరాభవానికి రీజన్ ఏంటి..? పులివెందుల ZPTC ఓటమికి.. కుప్పుంకు కనెక్షన్ ఉందా..? అదేంటో చూడండి

YSRCP Pulivendula Defeat: పులివెందులలో ZP ఎన్నికల్లో ఘోర పరాభవానికి కుప్పంలో లింక్ ఉందా..అప్పటి అత్యుత్సాహమే ఇప్పటి ఓటమికి కారణమైందా అన్నవిశ్లేషణలు వస్తున్నాయి. 2021 స్థానిక ఎన్నికల్లో  కుప్పంను కొల్లగొట్టి.. Why Not Kuppam అంటూ చేసిన అతి చర్యలవల్లే ఇప్పుడు YSRCPకి ఈ పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం అంటోంది. వై నాట్ 175 అంటూ అప్పట్లో జగన్ కుప్పం ను కూడా కలుపుకునే అన్నారు. దానికి ప్రతిగా చంద్రబాబు వైనాట్ పులివెందుల అంటూ సవాల్ చేశారు.

అప్పట్లో జగన్ అయినా.. చంద్రబాబు అయినా కూడా ముఖాముఖీగా వాళ్ల నియోజకవర్గాలను కూడా ఓడిస్తామని సవాల్ చేశారు. అది జరగలేదు కానీ.. ఏడాది తర్వాత పులివెందులలో వైసీపీని టీడీపీ చావు దెబ్బ కొట్టింది. వైఎస్ కుటుంబానికి ఓటమంటే తెలియని పులివెందులలో అదీ ఆ మండలంలో వైసీపీని డిపాజిట్ కూడా రాకుండా ఓడించడం వెనుక చాలా సంగతే ఉంది. క్యాడర్ కష్టపడిందా..  అధికారంతో అక్రమాలు చేసిందా.. ప్రత్యర్థులను భయపెట్టిందా.. లేక జగన్‌పైనే వ్యతిరేకత వచ్చిందా.. ఇలా ఎన్నిరకాల వాదనలున్నా.. సరే మొత్తానికి ఆన్ రికార్డ్ టీడీపీ అక్కడ గెలిచింది. దీనికి కారణం కుప్పం..

కుప్పంలో వైఎస్సార్సీపీ చేసిందే ఇక్కడ జరిగిందా..?

సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలు అంత దృష్టి పెట్టవ్.. వాళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేత నియోజకవర్గంలో రాజకీయ ఫిరాయింపులని ప్రోత్సహించడం లాంటివి కూడా చేయరు.. అదంతా వైఎస్ చంద్రబాబు జమానా వరకూ సాగింది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2017లో కడప జిల్లాలో బీటెక్‌ రవిని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ గెలిపించుకోగలిగింది. చంద్రబాబు తన జిల్లాలో రాజకీయం చేస్తే.. జగన్ ఏకంగా ఆయన నియోజకవర్గంలోనే చేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీతో పాటు.. నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీలను.. ఎంపీటీసీలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది.

పులివెందులో టీడీపీ దౌర్జన్యాలు చేసిందని.. ఓటర్లను బయటకు రానివ్వకుండా రిగ్గింగ్ చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. మరి ఆ రోజు.. కుప్పంలో జరిగింది కూడా అదే. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలపై  దాడులు జరిగాయి. జర్నలిస్టులను కూడా కొట్టారు. ఆ నియోజకవర్గం మొత్తం టీడీపీ బయటకు రాకుండానే చేశారు.

కుప్పంలో చంద్రబాబు అప్పటికే 7సార్లు ఎమ్మెల్యే. ప్రత్యర్థి పార్టీకి అంతగా పట్టు లేదు. కానీ 2021లో కుప్పం పరిధిలోని 89 పంచాయతీల్లో YSRCP 74చోట్ల గెలిచింది.  నియోజకవర్గంలోని 4 మండలాలు వైసీపీ పరం అయ్యాయి. ఇక  నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో అయితే.. ఏకంగా 17వేలు, 16వేలు, 11 వేల చొప్పున మెజార్టీలు వచ్చాయి. 68 ఎంపీటీసీ స్థానాల్లో 63 వైసీపీవే..! పెద్దిరెడ్డి కుప్పంలోనే క్యాంప్ వేసి మరీ ఎన్నికల్లో ఈ రిజల్ట్ తెప్పించారు. “చంద్రబాబు ఇలాకాలో 90శాతానికి పైగా సీట్లు అప్పట్లో వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మరిప్పుడు ఒక్క చోట ఓడిపోతేనే గగ్గోలు పెడుతున్నారు ఎందుకు” అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కుప్పంలో గెలుపొందిన వైసీపీ అక్కడితో ఆగలేదు.. చాలా అత్యుత్సాహం ప్రదర్శించింది. చంద్రబాబు ఓడిపోయాడని.. కూలిపోయాడని... ప్రచారం ప్రారంభించింది. జెడ్పీ ఓట్ల లెక్కల ప్రకారం చంద్రబాబు కంటే 62వేల ఓట్లు మెజార్టీ వచ్చిందని చెప్పింది. దీనికి కుప్పం మునిసిపాలిటీమెజార్టీ అదనం.. అది కూడా కలుపుకుంటే 75వేల ఓట్లు మెజార్టీ...వైనాట్ 175 స్లోగన్‌కు అదే బీజం కూడా..! అప్పట్లో నియోజకవర్గం మొత్తం కొల్లగొట్టిన వైసీపీ ఇప్పుడు రెండు ZPTC ఓటములను జీర్ణించుకోలేకపోయింది.

YSRCP లెక్క ప్రకారం చంద్రబాబుకు అప్పటికే ఉన్న మెజార్టీని దాటుకుని 75వేలు ఓట్లు పెరిగాయంటే.. దాదాపు లక్ష ఓట్లు టర్న్ అయినట్లు. కానీ 2024 రిజల్ట్ మాత్రం వేరు. చంద్రబాబు తనకు అంతకు మందు వచ్చిన దానికంటే.. 18వేలు పెంచుకున్నారు. మరి ఈ లక్ష ఓట్లు ఏమయ్యాయి. ఇక జగన్ తనకు ఉన్న 90వేల మెజార్టీ నుంచి 60వేలకు పడిపోయారు. దీనిని బట్టే పులివెందులలో జగన్ ప్రాభవం తగ్గినట్లు కనిపిస్తోంది. అప్పట్లో కుప్పం ఒక్కదానితోనే ఆగలేదు.. జిల్లా మొత్తంలో 65 జెడ్పీ స్థానాలుంటే.. 65 వైసీపీనే గెలిచింది. ఇందులో ఏకంగా 33 స్థానాలు ఏకగ్రీవాలయ్యాయి. ఇలాంటి పరిస్థితి ఎంజాయ్‌ చేసిన వైసీపీ ఇప్పుడు రెండు ఓటములను తీసుకోలేకపోతోంది.


పులివెందులలో YSRCP ఓటమి: కుప్పం ఎఫెక్ట్! జగన్ కంచుకోటలో టీడీపీ సంచలన విజయం వెనుక అసలు కారణం ఇదేనా?

పులివెందులను టార్గెట్ చేసిన లోకేష్

కుప్పంలో జరిగిన హంగామాను తెలుగుదేశం చాలా సీరియస్‌గా తీసుకుంది. అందుకే పులివెందులను టార్గెట్‌ చేసింది. జగన్ నేరుగా ఓడించడం సాధ్యం కాదు అని తెలిసి.. అక్కడ దెబ్బకొట్టడానికి తగిన అవకాశం కోసం చూసింది. మరో ఏడాదిలోనే స్థానిక ఎన్నికలున్నాయి. మామూలుగానే  టీడీపీ స్థానిక ఎన్నికలను వేగంగా పెట్టదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపఎన్నిక పెట్టడం.. అది కూడా పులివెందులలో పెట్టడం అంటే ఓ రకంగా రిస్క్ తీసుకున్నట్లు అర్థం. లోకేష్ నేరుగా ఇన్వాల్వ్ అయి... పులివెందుల ఎన్నికకు చొరవ చూపినట్లు తెలుస్తోంది. కచ్చితంగా గెలిచి తీరాలన్న టాస్క్ ఇచ్చిన తర్వాత.. గెలిచి తీరతామన్న నమ్మకంతోనే ముందుకెళ్లారు. జగన్‌ను మొన్నటి ఎన్నికల్లో ఎదుర్కొన్న బీటెక్‌రవి భార్య లతా రెడ్డిని రంగంలోకి దింపారు. గురి చూసి వైఎస్ కుటుంబం కుంభస్థలాన్ని కొట్టారు.

ఇంత దారుణమైన ఫలితమా..?

కుప్పంలో తెలుగుదేశం నాలుగు చోట్ల కలిపి 20వేల ఓట్లు అయినా సాధించింది. కానీ.. పులివెందులలో వైఎస్సార్సీపీకి డిపాజిట్ రాలేదు.  7వేలకు పైగా ఓట్లు పోలైతే... 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం అసలు ఓటర్లను ఇళ్లనుంచి బయటకు రానివ్వకుండా మొత్తం రిగ్గింగ్ చేసుకుందని వైసీపీ ఆరోపణ. చాలా చోట్ల దొంగ ఓట్లు వేసిన ఆధారాలను ఆ పార్టీ అధినేత బయటపెట్టారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు నుంచి ఓట్లు వేశారని చెప్పారు. ఇవే తరహా ఆరోపణలు కుప్పుం ఎలక్షన్‌లోన వచ్చాయి. మేం రిగ్గింగ్ చేసుకుంటే.. “ఓటింగ్ 74శాతమే ఎందుకవుతుంది.. 90శాతం చేసుకునే వాళ్లం కదా..” అని టీడీపీ అంటోంది.

అవినాష్‌రెడ్డి మీద వ్యతిరేకత కూడా కారణమా..?

తెలుగుదేశం దూకుడుగా వెళ్లినట్లు  కనిపిస్తున్నా.. కొన్ని చోట్ల వైసీపీ ఓటర్లు కూడా ఓటింగ్‌కు నిరాసక్తత చూపారు. కొన్నేళ్లుగా నియోజకవర్గంలో వైఎస్ అవినాష్‌రెడ్డి హవానే సాగుతోంది. జగన్ సొంత నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. వైఎస్ అవినాష్‌పై కోపం ఉన్న వాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇలా చేస్తే అయినా జగన్‌కు విషయం అర్థం అవుతుంది అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సరే ఏదైతే ఏంటి.. మొత్తానికి మొట్టమొదటి సారి తెలుగుదేశం పులివెందులలో జెండా ఎగరేస్తే.. 45ఏళ్ల తర్వాత వైఎస్ కుటుంబం ఓటమిని ఎదుర్కొంది.

Why Not  కుప్పం అంటూ ఆరోజు.. చేసిన దానికి Why Not పులివెందుల అంటూ వీళ్లు బదులిచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
YS Sharmila On Jagan: మోదీ దత్తపుత్రుడివి కాకపోతే సీఈసీపై అభిశంసనకు మద్దతివ్వాలి - జగన్‌కు షర్మిల సవాల్
మోదీ దత్తపుత్రుడివి కాకపోతే సీఈసీపై అభిశంసనకు మద్దతివ్వాలి - జగన్‌కు షర్మిల సవాల్

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Embed widget