అన్వేషించండి

Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్

అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగనున్నాయి. సంక్రాంతి తర్వాత దాదాపు పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు ప్రారంభంకానున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు. ఇప్పిటకే నిర్మాణానికి సంబంధించి 45 వేల కోట్లు ఖర్చుకు ఆమోదం లభించింది.ఈ మధ్య సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు, లేఅవుట్‌లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు రూ.24,276 కోట్లకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు జరిగిన గత 4 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తంగా రూ.45,249.24 కోట్లకు ఆమోదం లభించింది. ఇంకా చదవండి.

2. కనక దుర్గమ్మకు భక్తుల భారీ కానుకలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో భక్తులు సమర్పించిన కానుకలను డిసెంబర్ 18 బుధవారం లెక్కించారు. 21 రోజులకోసారి మహామండపం అంతస్తులో ఈ లెక్కింపు సాగుతుంది.  డిప్యూటీ ఈవో రత్నరాజు, దేవాదాయ శాఖాధికారులు, AEOలు, సిబ్బంది, ప్రత్యేక పోలీసులు, వన్‌టౌన్‌ సిబ్బంది, అమ్మవారి సేవాదారులు ఈ లెక్కింపులో పాల్గొన్నారు. నగదు రూపంలో  రూ.3,68,90,834, బంగారం 560 గ్రాములు, వెండి 9 కిలోల 30 గ్రాములు, USA డాలర్లు 519, ఆస్ట్రేలియా డాలర్లు 80. ఇంకా చదవండి.

3. రాహుల్‌కు కేటీఆర్ లేఖ

కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దీనిపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు. లేఖలో ఏం చెప్పారంటే..." కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న వైరుధ్య, ద్వంద్వ ప్రమాణాలకు సమాధానాలు కోరాలని తెలంగాణ ప్రజల తరపున నేను లేఖ రాస్తున్నారు. గౌతమ్ అదానీకి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మీరు, మీ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇంకా చదవండి.

4. తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు

తెలంగాణ గురుకుపాఠశాలలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు  విద్యార్థులను, తల్లిదండ్రులను ఆసుపత్రులకు పరుగుల పెట్టించాయి. ఇప్పుడు మరో సమస్య వారిని వెంటాడుతోంది. విష సర్పాలు కాటేసి చంపుతున్నాయి. ఎలుకలు కొరికి చిత్రవధ చేస్తున్నాయి. మొత్తానికి గురుకుల పాఠశాలలు, హాస్టల్స్‌లో ఉండాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఈ మధ్య కాలంలో పాము కాటుకు విద్యార్థులు బలి అవుతున్నారు. ఇవాళ(19 డిసెంబర్‌ 2024 )ఉదయం యశ్విత్‌ అనే విద్యార్థికి పాము కాటేసింది. ఇంకా చదవండి.

5. అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత

జానపద కళాకారుడు, 'బలగం' మూవీ ఫేమ్ మొగిలయ్య ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. వరంగల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. దీంతో పలువురు ప్రముఖులు, మూవీ లవర్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. మొగిలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లాలోని, నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న దుగ్గొండి. మొగులయ్య తన భార్య కొమరమ్మతో కలిసి బుర్రకథలు చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Nara Lokesh Speech Tribal University Convocation: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Pawan Kalyan Meets Devendra Fadnavis : రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ
రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Embed widget