అన్వేషించండి

Warangal News: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు

Warangal News: అధిక మొత్తంలో దిగుబడి వస్తుందని నమ్మించి నకిలీ విత్తనాలు అంటగట్టి తమను పలువురు మోసం చేశారంటూ రైతులు కన్నీరు పెడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు. 

Warangal News: అధిక దిగుబడి వస్తుందని అన్నదాతలను నమ్మించి పలు కంపెనీలు మోసం చేశాయి. ఎకరాలు 14 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని చెప్పగా.. కనీసం మూడు క్వింటాళ్లు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను మోసం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ నష్టపోయిన రైతులంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. వారిని అరెస్ట్ చేసి.. మరోసారి ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మనీయకుండా చేయమంటూ వేడుకున్నారు. 

అసలేం జరిగిందంటే..?

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల్ మీదికొండ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 40 మంది రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టారు అంకుర్ కంపెనీ సీడ్స్ ప్రతినిధులు. పంట వేసే సమయానికి ముందే తమ గ్రామంలోకి వచ్చి ఈ విత్తనాలు వాడితే, అధిక మొత్తంలో దిగుబడి వస్తుందంటూ నమ్మించారు. ఎకరాకు 14 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని.. క్వింటాల్ కు 7500 రూపాయల చొప్పున తమ కంపెనీయే పంటను కొనుగోలు చేస్తుందని కూడా నమ్మించారు. అయితే ముందుగా పలువురు రైతులు నమ్మి వాటని కొనుగోలు చేయగా.. మిగతా వారు కూడా ఒకరిని చూస్తూ మరొకరు ముందుకు వచ్చారు. ఇలా దాదాపు 40 మంది రైతులు అంకుర్ సీడ్స్ కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలను కొనుగోలు చేశారు.

వాటితోనే ఆరుగాలం కష్టపడి పంటను పండించారు. చూసేందుకు పంట బాగానే కనిపించినప్పటికీ.. దిగుబడి మాత్రం చాలా తక్కువగా వచ్చింది. 14 క్వింటాళ్లు వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పగా.. ఎకరాకు కేవలం మూడు క్వింటాళ్ల ధాన్యం మాత్రమే వచ్చింది. ఇదే విషయాన్ని కంపెనీ యజమానులకు చెప్పి వారిని అడగ్గా.. వాతావరణం సరిగ్గా లేకే పంట నాశనం అయిందని.. దానికి తమ కంపెనీ బాధ్యత వహించదని చెప్పి వెళ్లిపోయారు. ఏం చేయాలో పాలుపోని అన్నదాతలు... అంకుర్ కంపెనీకి చెందిన కేశిరెడ్డి రాజిరెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని.. కంపెనీని సీజ్ చేయాలని కోరారు. అలాగే తమలా మరే రైతు మోసపోకుండా చూసే బాధ్యత మీదే అంటూ పోలీసులు కాళ్ల మీద పడి కన్నీరు పెట్టుకున్నారు. 

"నా పేరు స్వప్న. మేం గత పదకొండు సంవత్సరాల కాడికెళ్లి పంట పండిస్తున్నం. మేం కష్టం చేసిన తీరు పంటలు మంచిగనే వచ్చినయ్. ఈసారి అన్నరు ఎకరాన 14 క్వింటాళ్లు ఎల్తయ్, మంచి సీడ్ ఇస్తం, కొత్త సీడ్ అచ్చింది అన్నరు. సేర అనేశి పెట్టినం. ఏదో బతుకుతమని పెట్టినం. కూలీ మనిషి దొర్కకపోయినా 500, 600 కూలీలు ఇచ్చుకుంట పని చేపిచ్చుకున్నం. అట్ల ఖర్చయినా సరే బతుకుతం కదా అనుకున్నం. పెట్టినందుకు ఎకరానా 14 క్వింటాళ్లు కాదు కదా.. ఎకరానా మూడు బస్తలు కూడా ఎల్లలేవు. మూడెకరాలు వెట్టిన. అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. మరి గిదీ పరిస్థితి. పెట్టుబడి పెట్టినం. కూలీలకు విత్తనాలకే లక్ష రూపాలైనయ్. మిషన్ తోని కోపిస్తే పైసలేంది, మిగతావాటికి ఏంది. అంతా నాశన్మే. మూడెకరాలకు కలుపుకొని మొత్తం 8 బస్తాలు వచ్చినయ్. మేం ఎట్ల బతకాలే. ఏం జేయాలే." - స్వప్న మహిళా రైతు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Results 2025: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఆగస్టు 15లోగా ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఆగస్టు 15లోగా ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల
Deva Katta: చంద్రబాబు Vs వైఎస్సార్ లైఫ్ స్టోరీ కాదు - 'మయసభ' సిరీస్‌పై డైరెక్టర్ దేవా కట్టాతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
చంద్రబాబు Vs వైఎస్సార్ లైఫ్ స్టోరీ కాదు - 'మయసభ' సిరీస్‌పై డైరెక్టర్ దేవా కట్టాతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
AP Rains Alert:  ఏపీలో మూడు రోజుల పాటు వానలు... ఏయే జిల్లాల్లో అంటే
ఏపీలో మూడు రోజుల పాటు వానలు... ఏయే జిల్లాల్లో అంటే
Tirumala Latest News: ఆగ‌స్టు 5 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు, ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
ఆగ‌స్టు 5 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు, ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
Advertisement

వీడియోలు

India vs England 5th Test Match | భారత్ సిరీస్ ను సమం చేయగలదా ?
Rohit Sharma in The Oval Ground | ఓవల్ క్రికెట్‌ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ
JCB Falls From 300 Meters Height | అదుపు తప్పి లోయలో పడిపోయిన JCB
India vs England Yashasvi Jaiswal Century | స‌చిన్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన జైస్వాల్
AP Liquor Scam Case | వైరల్ అవుతున్న నోట్ల కట్టల వీడియో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Results 2025: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఆగస్టు 15లోగా ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఆగస్టు 15లోగా ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల
Deva Katta: చంద్రబాబు Vs వైఎస్సార్ లైఫ్ స్టోరీ కాదు - 'మయసభ' సిరీస్‌పై డైరెక్టర్ దేవా కట్టాతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
చంద్రబాబు Vs వైఎస్సార్ లైఫ్ స్టోరీ కాదు - 'మయసభ' సిరీస్‌పై డైరెక్టర్ దేవా కట్టాతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
AP Rains Alert:  ఏపీలో మూడు రోజుల పాటు వానలు... ఏయే జిల్లాల్లో అంటే
ఏపీలో మూడు రోజుల పాటు వానలు... ఏయే జిల్లాల్లో అంటే
Tirumala Latest News: ఆగ‌స్టు 5 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు, ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
ఆగ‌స్టు 5 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు, ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
Nagarjuna: 'కూలీ'లో మాస్ విలన్ రోల్‌లో కింగ్ నాగార్జున - అక్కినేని కోడలు శోభిత రియాక్షన్ వైరల్
'కూలీ'లో మాస్ విలన్ రోల్‌లో కింగ్ నాగార్జున - అక్కినేని కోడలు శోభిత రియాక్షన్ వైరల్
Tips for Renting a House : అద్దెకు ఇల్లు తీసుకునే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
అద్దెకు ఇల్లు తీసుకునే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
Rajinikanth: రజనీకాంత్ స్పీచ్‌లో హైలైట్స్... శృతి హాసన్ నుంచి లోకేష్ వరకు ఎవ్వర్నీ వదల్లేదు!
రజనీకాంత్ స్పీచ్‌లో హైలైట్స్... శృతి హాసన్ నుంచి లోకేష్ వరకు ఎవ్వర్నీ వదల్లేదు!
Telangana Politics: కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండాల్సిందే.. టీపిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండాల్సిందే.. టీపిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలనం
Embed widget