అన్వేషించండి

Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!

Raithu Bharosa: తెలంగాణలో రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం కసర్తు చేస్తోంది. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. సర్వే పూర్తయిన వెంటనే నగదు జమ చేయనుంది.

Raithu Bharosa: వర్షాలు సమృద్ధిగా పడటంతో ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. రైతులంతా పొలాలు దున్ని విత్తనాలు నాటడం పూర్తయ్యింది. అయినా ఇప్పటికీ తెలంగాణ(Telangana) ప్రభుత్వం నుంచి రైతుకు ఎలాంటి సాయం అందలేదు. రైతులకు పెట్టుబడిగా సాగు సమయంలో అందించే రైతు భరోసా(Raithu Bharosa) సాయం కోసం తెలంగాణలో అన్నదాతలు ఎదురు చూపులు తప్పడం లేదు.

రైతు భరోసా ఎప్పుడు
అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు 15వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని తెలంగాణ(Telangana)లో గద్దెనెక్కిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం...ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులు దాటినా ఇప్పటికీ రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో రైతుభరోసా(Raithu Bharosa) పథకంపై అధ్యయనం చేసి విధివిధానాలు రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని(Cabinet Sub Commitee) ఏర్పాటు చేసింది. డివ్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Batti Vikramarka) అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswararao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasareddy), శ్రీధర్‌బాబు(Sridharbabu)తో కమిటీ వేశారు. అయితే రైతు భరోసా పథకం ఎవరెవరికి వర్తింపజేయాలి..ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నదానిపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామాలవారీగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రతి సహకారసంఘం పరిధిలో రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 5 ఎకరాలు, 8 ఎకరాలు, పది ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాల లోపు వారికి ఈ పథకం వర్తింపజేస్తే బాగుంటుందన్నది వారి నుంచే సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించి వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించనుంది.

పక్కాగా అమలు 
రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Reavanth Reddy) భావిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో పంటలు వేయని బీడు భూములకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారంపడింది.పైగా వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల ప్రచారంలోనే రైతు భరోసాపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.  అందులో భాగంగా ఊరూరా సర్వే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూములు ఎన్ని, వ్యవసాయేతర భూములు ఎన్ని అన్నదానిపై సర్వే జరుగుతోంది. ఫైలట్‌ ప్రాజెక్ట్‌గా కామారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే సర్వే పూర్తయ్యింది. మిగిలిన జిల్లాల్లోనూ వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏరివేత
గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం రైతు భరోసా సాయం అందజేశారు. బడా భూస్వాములు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, ఇన్‌కంటాక్స్ కట్టేవారు, ఫాంహౌస్ ఉన్న భూములు, రీసార్ట్‌లు ఉన్న భూములు, కమర్షియల్ వ్యాపారాలకు వినియోగిస్తున్న భూములకు సైతం రైతు భరోసా డబ్బులు పడేవి. దీంతో ఈ పథకం అమలుపై చాలా విమర్శలు వచ్చాయి.పన్నులు ద్వారా వచ్చిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది మండపడ్డారు. దీంతో సర్వేద్వారా ఇలాంటి భూములన్నింటినీ తొలగించనున్నారు. దీంతో ప్రభుత్వంపై భారం తగ్గిపోవడంతోపాటు అర్హులకు మాత్రమే సాయం అందే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు పైసా కూడా చెల్లించేది లేదని సీఎం స్పష్టం చేశారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
Vemulawada Dargah History: వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
Vemulawada Dargah History: వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
Karumuri Nageswara Rao: కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
United Nations On Iran crisis: ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
Repu Udayam 10 Gantalaku First Look: రేపు ఉదయం 10 గంటలకు... సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ - ఎవరెవరు నటిస్తున్నారో చూశారా?
రేపు ఉదయం 10 గంటలకు... సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ - ఎవరెవరు నటిస్తున్నారో చూశారా?
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Embed widget