అన్వేషించండి

Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!

Raithu Bharosa: తెలంగాణలో రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం కసర్తు చేస్తోంది. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. సర్వే పూర్తయిన వెంటనే నగదు జమ చేయనుంది.

Raithu Bharosa: వర్షాలు సమృద్ధిగా పడటంతో ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. రైతులంతా పొలాలు దున్ని విత్తనాలు నాటడం పూర్తయ్యింది. అయినా ఇప్పటికీ తెలంగాణ(Telangana) ప్రభుత్వం నుంచి రైతుకు ఎలాంటి సాయం అందలేదు. రైతులకు పెట్టుబడిగా సాగు సమయంలో అందించే రైతు భరోసా(Raithu Bharosa) సాయం కోసం తెలంగాణలో అన్నదాతలు ఎదురు చూపులు తప్పడం లేదు.

రైతు భరోసా ఎప్పుడు
అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు 15వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని తెలంగాణ(Telangana)లో గద్దెనెక్కిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం...ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులు దాటినా ఇప్పటికీ రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో రైతుభరోసా(Raithu Bharosa) పథకంపై అధ్యయనం చేసి విధివిధానాలు రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని(Cabinet Sub Commitee) ఏర్పాటు చేసింది. డివ్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Batti Vikramarka) అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswararao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasareddy), శ్రీధర్‌బాబు(Sridharbabu)తో కమిటీ వేశారు. అయితే రైతు భరోసా పథకం ఎవరెవరికి వర్తింపజేయాలి..ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నదానిపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామాలవారీగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రతి సహకారసంఘం పరిధిలో రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 5 ఎకరాలు, 8 ఎకరాలు, పది ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాల లోపు వారికి ఈ పథకం వర్తింపజేస్తే బాగుంటుందన్నది వారి నుంచే సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించి వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించనుంది.

పక్కాగా అమలు 
రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Reavanth Reddy) భావిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో పంటలు వేయని బీడు భూములకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారంపడింది.పైగా వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల ప్రచారంలోనే రైతు భరోసాపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.  అందులో భాగంగా ఊరూరా సర్వే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూములు ఎన్ని, వ్యవసాయేతర భూములు ఎన్ని అన్నదానిపై సర్వే జరుగుతోంది. ఫైలట్‌ ప్రాజెక్ట్‌గా కామారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే సర్వే పూర్తయ్యింది. మిగిలిన జిల్లాల్లోనూ వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏరివేత
గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం రైతు భరోసా సాయం అందజేశారు. బడా భూస్వాములు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, ఇన్‌కంటాక్స్ కట్టేవారు, ఫాంహౌస్ ఉన్న భూములు, రీసార్ట్‌లు ఉన్న భూములు, కమర్షియల్ వ్యాపారాలకు వినియోగిస్తున్న భూములకు సైతం రైతు భరోసా డబ్బులు పడేవి. దీంతో ఈ పథకం అమలుపై చాలా విమర్శలు వచ్చాయి.పన్నులు ద్వారా వచ్చిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది మండపడ్డారు. దీంతో సర్వేద్వారా ఇలాంటి భూములన్నింటినీ తొలగించనున్నారు. దీంతో ప్రభుత్వంపై భారం తగ్గిపోవడంతోపాటు అర్హులకు మాత్రమే సాయం అందే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు పైసా కూడా చెల్లించేది లేదని సీఎం స్పష్టం చేశారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget