అన్వేషించండి

Andhra Pradesh: ఏపీ మిర్చి రైతులకు బిగ్‌ న్యూస్ - లాం ఫారంలో అమ్మకానికి మిరప విత్తనాలు

Andhra Pradesh: మిర్చి రైతులకు అదిరిపోయే వార్తను చెబుతున్నారు అధికారులు. నకిలీ సమస్యల్లో చిక్కుకోకుండా ఉండేందుకు లాం ఫారం లో మిరప విత్తనాలు అమ్మకానికి సిద్ధం చేశారు.

Andhra Pradesh:  ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ లాం ఫారంలో జూన్ నెల 16  వ తేది (సోమవారం) నుంచి ఎల్.సి ఎ–625, ఎల్.సి ఎ–657, ఎల్.సి.ఎ-643 మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్మనున్నట్లు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ తెలియజేశారు. 

 ఎల్. సి ఎ–643 రకం: పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైన రకము. కాయలు లేత ఆకుపచ్చ రంగులో పొడవుగా (13-14 సెం.మీ) ఆకర్షణీయంగా ఉంటాయి.  కాయలు ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి, బ్యాడగి రకం వలె ఉంటాయి. బాగా బెట్టను తట్టుకొంటుంది, కొంతవరకు జెమిని వైరస్ ను కూడా తట్టుకొంటుంది. అంతే కాక నల్లతామర పురుగు ఉద్ధృతి ఉన్న కూడా కొద్ధి పాటి పురుగు మందుల పిచికారితో, అధిక దిగుబడినివ్వ కలిగిన రకము.           

ఎల్.సి ఎ–625 రకం: ఎండు మిరపకు అనువైన ఈ రకం, మొక్కలు బలిస్టమైన కొమ్మలతో ఎత్తుగా పెరుగుతాయి. కణుపులు దగ్గరగా ఉండి, కాపు చిక్కగా ఉంటుంది. ప్రధాన పొలంలో నేరుగా ఎద పెట్టడానికి మిక్కిలి అనువైన రకం. కాయలు సన్నగా, మధ్యస్థ పొడవుతో (8-10 సెం. మీ ) ఉంటాయి. తేజ రకాన్ని పోలి ఉంటాయి. పచ్చి కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూటి రకాలలో కెల్లా అధిక ఘాటు (45000–50000 ఎస్.హెచ్.యు) మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60-65 ఎ.ఎస్.టి.ఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉండి, అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకొని, తాలు కాయలు చాలా తక్కువుగా వస్తాయి.
     
ఎల్. సి ఎ–657 రకం: తొలకరి తరువాత నేరుగా ఎద పెట్టుకోవడానికి అనువైన జెమిని వైరస్ ను తట్టుకునే రకం. మొక్కలు ఎత్తుగా, దృఢమైన కాండంతో నిటారైన కొమ్మలు కలిగి, బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. కాయలు పొడవుగా (11-12 సెం.మీ), ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండినప్పుడు ముదురు ఎరుపు రంగుతో తెల్లటి తొడిమ కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు అధిక ఘాటు (50,000-55,000 ఎస్.హెచ్.యు), మంచి రంగును కలిగి ఉంటాయి. అధిక బెట్టను తట్టుకునే రకం.                                  

 విత్తనాలు కొనదలచిన రైతులు నేరుగా ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ లాం ఫారంలో జూన్ 16 వ తేదీ మొదలు, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు  విత్తనాలు అందిస్తారు. అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే పంపిణీ చేస్తారు. రెండో శనివారం, ప్రతి ఆదివారం పంపిణీకి సెలవు ప్రకటించారు. కిలో విత్తనాల ధర 1,200 రూపాయలుగా నిర్దారించారు.  

ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ మాట్లాడుతూ, పైన తెలియజేసిన మిరప విత్తనాలు కేవలం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం, లాం ఫారం నందు మాత్రమే పొందగలరని, అవే పేర్లతో బయట ఎవరైనా ఈ విత్తనాలు అమ్మజూపినట్లైతే రైతులు వాటిని ఖరీదు చేసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.  దీని కోసం 99898 09554  / 9440592982 ఫోన్ నెంబర్లను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget