అన్వేషించండి

Budget 2022: రైతులకు గుడ్‌ న్యూస్.. పీఎం కిసాన్ యోజన్ ఎంత పెరగనుందంటే?

రాబోయే బడ్జెట్‌లో కేంద్రం రైతులకు ప్రత్యేక వరాలు ప్రకటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తైందని ప్రకటనే ఆలస్యమంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

రైతులకు కేంద్రం గుడ్ చెప్పనుంది. అధికారిక సమాచారం ప్రకారం రైతులకు అందించే పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే నిధులను పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి1 కేంద్రం ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో ఈ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడు చట్టాలను వెనక్కి తీసుకుంది. దీనికి తోడు బడ్జెట్‌లో మరిన్ని నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ కనిపిస్తోందని సమాచారం. కరోనా టైంలో అన్ని సెక్టార్లతోపాటు వ్యవసాయ రంగం కూడా దెబ్బతింది. అందుకే దీన్ని అభివృద్ధి చేసుకునేలా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

అందులో భాగంగానే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన కేటాయింపులు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీని వల్ల పది కోట్ల మందిర ప్రజలు లబ్ధి పొందుతున్నారు. గత బడ్జెట్‌లో 65వేల కోట్లు ఖర్చు పెట్టారు. దీన్ని మరింతగా పెంచనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు రైతుకు ఆరు వేలు ఇస్తున్నారు. దీన్ని ఎనిమిది వేలకు పెంచనున్నట్టు సమాచారం. 

కనీస మద్దతు ధరపై కూడా నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయనున్నారట.  అన్ని పంటలకు వర్తించేలా నిర్ణయం తీసుకోనున్నారని బోగట్టా. మూడు చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత తెరపైకి వచ్చిన ప్రధాన డిమాండ్ ఇది. ప్రతి పంటకు మద్దతు ధర కల్పించాలని మొన్నటి వరకు రైతులు ధర్నాలు చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇలా ప్రకటించడం ఎన్నికల నియామవళికి వ్యతిరేకమా కాదా అన్న దానిపై క్లారిటీ తీసుకున్న తర్వాతే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆయా రాష్ట్రాలకు ఉద్దేశించిన పథకం కాదని... దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని కేంద్రం పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. 

రుణ పరిమితిని కూడా పెంచాలని భావిస్తోంది కేంద్రం. ప్రస్తుతం ఉన్న 16.5 లక్షల రుణ పరిమితిని 18 లక్షలకు పెంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

సంవత్సరానికి ఏడు శాతం వడ్డీ రేటుతో రైతులకు మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు ఇప్పిస్తోంది కేంద్రం. దీంట్లో రెండు శాతం వడ్డీ రాయితీ అందిస్తోంది. గడువులోపు రుణాలు చెల్లించిన వారికి మూడు శాతం అనదపు ప్రోత్సాహకం ఇస్తోంది. దీంతో అంటే నాలుగు శాతంతో రైతులకు రుణాలు ఇప్పిస్తోంది. దీన్ని కూడా పెంచాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!

Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌! ఈ సారి పార్ట్‌1, పార్ట్‌2గా విభజన!

Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!

Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్‌ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!

టాప్ హెడ్ లైన్స్

KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget