అన్వేషించండి

ఏపీలో ఫిబ్రవరి 20 నుంచి ఇ-క్రాప్‌ బుకింగ్- మార్చిలో తుది జాబితా విడుదల

2014–19 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే.. 2019–20 నుంచి 2022–23 ఖరీప్‌ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉందని సీఎంకు వివరించారు అధికారులు.

రబీలో రైతులకు విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది రాకుండా జగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎంకు... ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై అధికారులు నివేదిక అందించారు. 

2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే.. 2019–20 నుంచి 2022–23 ఖరీప్‌ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉందని సీఎంకు వివరించారు అధికారులు. రబీకి సంబంధించి ఇ–క్రాప్‌ బుకింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించిన అధికారులు, మార్చి మొదటి వారంలో తుది జాబితా ప్రకటిస్తామన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం, ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, కిసాన్‌ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తి గత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఏడాది మార్చి, మే–జూన్‌ నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని అధికారులు తెలిపారు. 2వేల డ్రోన్లను పంపిణీ చేసే దిశగా కార్యాచరణ రెడీ చేసినట్టు వివరించారు. తొలివిడతగా రైతులకు 500 డ్రోన్లు ఇస్తామని తెలిపిన అధికారులు, గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నామన్న అధికారులు, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. 

ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ పై సమీక్ష

గతంలో చెప్పినట్టుగా ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై కార్యాచరణ, సాయిల్‌ టెస్టింగ్‌ ప్రతి ఏటా ఏప్రిల్‌ లో జరిగేలా ప్లాన్ చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పరీక్ష అయిన తర్వాత సర్టిఫికెట్లను రైతులకు ఇవ్వాలని, ఫలితాలు ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై మార్గనిర్దేశం చేయాలని అన్నారు. దీని వలన పంటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ల్యాబుల్లో వీటి పరీక్షలు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలో సాయిల్‌ టెస్ట్‌ పరికరాలు ఉంచాలన్న సీఎం, దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో సాయిల్‌ టెస్టింగ్‌ తర్వాత మ్యాపింగ్‌ జరగాలన్నారు సీఎం. దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాల మేరకే జరుగుతుందని, రైతులకు పెట్టబడులు ఆదా అవడంతోపాటు, కాలుష్యం తగ్గుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ధాన్యం సేకరణపై వివరాలు అందజేత 

ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా గన్నీబ్యాగుల డబ్బులు, రవాణా ఖర్చులు రైతులకు ఇచ్చినట్టు సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటికే రైతులకు 89శాతం చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు. ఇ–క్రాప్‌ డేటా మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మాండస్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించామని అధికారులు సీఎంకు వివరించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించినందున చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget