అన్వేషించండి

తెలంగాణలో భారీగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం- 1.24 కోట్ల ఎకరాల్లో పంటలేస్తున్న రైతులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అసాధారణ రీతిలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయా పంటల వారీగా అధికంగానే సాగైందని చెప్పవచ్చు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అసాధారణ రీతిలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అధిక వర్షాలతో ఓవైపు పంట నష్టం జరిగిన, మరోవైపు ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయా పంటల వారీగా అధికంగానే సాగైందని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఈ సంవత్సరం సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతోంది. ఇదే సమయానికి గత ఏడాది 83.43 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని లెక్కల్లో చెప్పింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వానకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలకు ఎగబాకింది. ఇప్పటి వరకు 95.78 లక్షల ఎకరాలకు 77 శాతం సాగు చేరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 36.06 లక్షల ఎకరాల్లో... అంటే 72 శాతం నాట్లు వేశారని తెలిపింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు ఉండగా... 44.49 లక్షలు ఎకరాల్లో 87 శాతం సాగవుతుందని తెలియజేసింది. 

నాలుగు జిల్లాల్లో 100 శాతానికి పైగా సాగు.... నాలుగు జిల్లాల్లో సాగు విస్తీర్ణం 100 శాతానికిపైగా పెరిగింది. ఆయా జిల్లాల వారీగా చూస్తే మెదక్ 105.80, అదిలాబాద్ 103.90, కొమరం భీం ఆసిఫాబాద్ 102.19, నిజామాబాద్ 101.10 శాతం విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తిలో 24.90 శాతం, ఆ తర్వాత మూలుగు 32.90 శాతం పంటలు సాగయ్యాయని అని అధికారులు నివేదిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 31 శాతం అధిక వర్షపాతం నమోదయింది. జూన్ నెలలో 44 శాతం వర్షపాతం కొరత ఉండగా... జూలై నెలలో ఏకంగా 114 శాతం భారీ అధిక వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఆరు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయింది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.

జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగులు, పప్పు దినుసులు, వేరుశనగ, సోయాబీన్ సాగును రైతులు ఇప్పటికే ప్రారంభించారని వివరించింది. వరి నాట్లు వచ్చే నెల మొదటి వారం వరకు సాగనున్నయని అప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పంటల సాగు కోటి ఎకరాలను దాటుతుందని పేర్కొంది. 

జిల్లాల వారిగా సాగు చూసుకుంటే..... అదిలాబాద్, కొమరం భీం, నిజామాబాద్, మెదక్ జిల్లాలో 100 శాతానికి పైగా పంటలు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ నిర్ధారించింది. వనపర్తి లో 25 శాతం విస్తీర్ణంలోపే పంటలు సాగుతున్నాయని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ములుగు, మేడ్చల్ జిల్లాల్లో 40 శాతం, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, సూర్యాపేట జిల్లాలో 70 శాతం పంటలు సాగుతున్నాయి. 

మిగిలిన జిల్లాలు అంటే నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, భద్రాద్రి, సంగారెడ్డి, జనగామ, వికారాబాద్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి, జిల్లాలో 90 శాతం పంటలు సాగుతున్నాయి.

పంటల వారీగా సాగు ప్రారంభం చూస్తే... మొక్కజొన్న 5.02 లక్షల సాగు విస్తీర్ణం(70శాతం), సోయాబీన్ 4.43 లక్షల ఎకరాలు (107 శాతం), జొన్న 21 వేల ఎకరాలు(26.74శాతం), చెరుకు 20 వేల ఎకరాలు(31.49శాతం), మినుములు 18 వేల ఎకరాలు(41 శాతం), పెసర్లు 49 వేల ఎకరాలు(39 శాతం), నువ్వులు 2 వేల ఎకరాలు (8 శాతం సాగు విస్తీర్ణం) లో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget