అన్వేషించండి

ఏపీ వ్యవసాయంలో సరికొత్త శకం!ఈ ఖరీఫ్‌ నుంచే 'డిజిటల్ వ్యవసాయం' అరచేతిలోనే రైతన్న భవిష్యత్తు... 

ఖరీఫ్ 2025 నుంచి ఏపీలో వ్యవసాయ కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్‌గా మారనున్నాయి. ఈ విప్లవాత్మక మార్పునకు ఏపీఏఐఎంఎస్ 2.0' (APAIMS 2.0) అనే శక్తివంతమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్ నాంది పలుకుతోంది.

Amaravati: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం దేశంలోనే ఒక చరిత్రాత్మక అడుగు ముందుకు వేస్తోంది. విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలకు.. పంట అమ్ముకోవడానికి పడే తిప్పలకు స్వస్తి పలికేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తోంది. విత్తనం నాటిన దగ్గర నుంచి.. పంట అమ్మే వరకూ ప్రతి సేవ ఇకపై రైతన్న సెల్‌ఫోన్‌లోనే అందుబాటులోకి రానుంది.APAIMS 2.0 (Andhra Pradesh Agriculture Information Management System) తో వ్యవసాయ సేవలన్నీ డిజిటలైజ్ అవ్వనున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఉపగ్రహ చిత్రాలు వంటి అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ వ్యవస్థ, వ్యవసాయాన్ని సులభతరం చేయడమే కాకుండా, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడనుంది.

60లక్షల మంది రైతులకు ప్రయోజనం

అమెరికాకు చెందిన వాసర్ ల్యాబ్ Vassar Lab ఈ సాంకేతికతను రూపొందించింది. MIT ఇందుకు తోడ్పాటునిస్తోంది.రాష్ట్రంలో 60,02,607 మంది రైతుల్లో 37,65,463 మంది రైతుల గుర్తింపు కార్డులు ఇప్పటికే తయారయ్యాయి. 80లక్షల హెక్టార్ల పంట సాగు దీని పరిధిలోకి రానుంది. 18వేల గ్రామాల్లో ఈసేవలు అందుబాటులోకి వస్తాయి. 

రైతుకు అందే ప్రయోజనాలివే!

ఇంతకీ ఈ కొత్త విధానం వల్ల రైతుకు ఏం లాభం? వ్యవసాయ శాఖ చెబుతున్న దాని ప్రకారం ప్రయోజనాలు ఇలా ఉన్నాయి:

వ్యక్తిగత సలహాలు: ఇకపై రైతు తన పొలానికి ఏ పురుగు ఆశించనుంది, ఏ ఎరువు ఎప్పుడు వేయాలి, నీరు ఎప్పుడు పెట్టాలి వంటి కీలక సమాచారాన్ని తన సెల్‌ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. ప్రతి రైతు పొలానికి ప్రత్యేకంగా సలహాలు అందుతాయి.
అన్నీ ఒక్కచోటే: విత్తనాల బుకింగ్, ఎరువుల సబ్సిడీ, పంటల బీమా, ఈ-క్రాప్ బుకింగ్, మార్కెట్‌లో పంట అమ్ముకోవడం వరకు అన్ని సేవలు ఈ యాప్ ద్వారానే జరుగుతాయి. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి.
పారదర్శకత: సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల అవినీతికి, జాప్యానికి ఆస్కారం ఉండదు. రైతులకు అందాల్సిన ప్రయోజనాలు నేరుగా, వేగంగా అందుతాయి.
నష్ట నివారణ: తుపానులు, తెగుళ్ల వంటి వాటి గురించి ముందుగానే హెచ్చరికలు అందడం వల్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

ఈ మార్పుపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లి రావు మాట్లాడుతూ, "ఖరీఫ్ 2025 నుంచి ఆఫ్‌లైన్ సేవలు అనేవే ఉండవు. ప్రతిదీ APAIMS 2.0 వేదిక ద్వారానే జరుగుతుంది. ఇది పారదర్శకతను పెంచి, రైతులకు వేగంగా సేవలు అందిస్తుంది," అని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే ఫలితాలు వస్తున్నాయి. Vassar  ల్యాబ్ సూచనలు పాటించడం వల్ల ఎరువుల వినియోగం 7.5శాతం తగ్గింది. అంతే కాదు..వేరు శనగ పంట కాలాన్ని జూన్ నుంచి జూలై 15కు మార్చడం వల్ల చీడపీడల సమస్య తగ్గి దిగుబడి పెరుగుతోంది. 

ఏపీ మోడల్‌కు అంతర్జాతీయ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఈ డిజిటల్ నమూనా కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఇటీవల  ఇథియోపియా ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శించింది. ఇక్కడి విధానాలను చూసి అబ్బురపడిన వారు, తమ దేశంలో కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రశంసించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 దేశాలు ఏపీ మోడల్‌పై ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) "ఛాంపియన్" అవార్డుకు నామినేట్ చేసింది.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 187.58 కోట్లు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్‌ను సిఫార్సు చేసింది

మొత్తం మీద, ఈ డిజిటల్ పరివర్తన ద్వారా వ్యవసాయాన్ని మరింత పారదర్శకంగా, లాభసాటిగా, సుస్థిరంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నాలజీని రైతన్నకు చేరువ చేసి, వారి కష్టాలను తగ్గించడమే ఈ  ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
Royal Challengers Bangalore and Rajasthan Royals: ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
హ్యుందాయ్ వెర్నాపై భారీ డిస్కౌంట్లు: రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!
హ్యుందాయ్ వెర్నాపై భారీ డిస్కౌంట్లు: రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!
Vijayawada Crime News: ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ విచారణలో విస్తుపోయే అంశాలు: సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ
ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు!
Embed widget