అన్వేషించండి

ఏపీ వ్యవసాయంలో సరికొత్త శకం!ఈ ఖరీఫ్‌ నుంచే 'డిజిటల్ వ్యవసాయం' అరచేతిలోనే రైతన్న భవిష్యత్తు... 

ఖరీఫ్ 2025 నుంచి ఏపీలో వ్యవసాయ కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్‌గా మారనున్నాయి. ఈ విప్లవాత్మక మార్పునకు ఏపీఏఐఎంఎస్ 2.0' (APAIMS 2.0) అనే శక్తివంతమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్ నాంది పలుకుతోంది.

Amaravati: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం దేశంలోనే ఒక చరిత్రాత్మక అడుగు ముందుకు వేస్తోంది. విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలకు.. పంట అమ్ముకోవడానికి పడే తిప్పలకు స్వస్తి పలికేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తోంది. విత్తనం నాటిన దగ్గర నుంచి.. పంట అమ్మే వరకూ ప్రతి సేవ ఇకపై రైతన్న సెల్‌ఫోన్‌లోనే అందుబాటులోకి రానుంది.APAIMS 2.0 (Andhra Pradesh Agriculture Information Management System) తో వ్యవసాయ సేవలన్నీ డిజిటలైజ్ అవ్వనున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఉపగ్రహ చిత్రాలు వంటి అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ వ్యవస్థ, వ్యవసాయాన్ని సులభతరం చేయడమే కాకుండా, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడనుంది.

60లక్షల మంది రైతులకు ప్రయోజనం

అమెరికాకు చెందిన వాసర్ ల్యాబ్ Vassar Lab ఈ సాంకేతికతను రూపొందించింది. MIT ఇందుకు తోడ్పాటునిస్తోంది.రాష్ట్రంలో 60,02,607 మంది రైతుల్లో 37,65,463 మంది రైతుల గుర్తింపు కార్డులు ఇప్పటికే తయారయ్యాయి. 80లక్షల హెక్టార్ల పంట సాగు దీని పరిధిలోకి రానుంది. 18వేల గ్రామాల్లో ఈసేవలు అందుబాటులోకి వస్తాయి. 

రైతుకు అందే ప్రయోజనాలివే!

ఇంతకీ ఈ కొత్త విధానం వల్ల రైతుకు ఏం లాభం? వ్యవసాయ శాఖ చెబుతున్న దాని ప్రకారం ప్రయోజనాలు ఇలా ఉన్నాయి:

వ్యక్తిగత సలహాలు: ఇకపై రైతు తన పొలానికి ఏ పురుగు ఆశించనుంది, ఏ ఎరువు ఎప్పుడు వేయాలి, నీరు ఎప్పుడు పెట్టాలి వంటి కీలక సమాచారాన్ని తన సెల్‌ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. ప్రతి రైతు పొలానికి ప్రత్యేకంగా సలహాలు అందుతాయి.
అన్నీ ఒక్కచోటే: విత్తనాల బుకింగ్, ఎరువుల సబ్సిడీ, పంటల బీమా, ఈ-క్రాప్ బుకింగ్, మార్కెట్‌లో పంట అమ్ముకోవడం వరకు అన్ని సేవలు ఈ యాప్ ద్వారానే జరుగుతాయి. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి.
పారదర్శకత: సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల అవినీతికి, జాప్యానికి ఆస్కారం ఉండదు. రైతులకు అందాల్సిన ప్రయోజనాలు నేరుగా, వేగంగా అందుతాయి.
నష్ట నివారణ: తుపానులు, తెగుళ్ల వంటి వాటి గురించి ముందుగానే హెచ్చరికలు అందడం వల్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

ఈ మార్పుపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లి రావు మాట్లాడుతూ, "ఖరీఫ్ 2025 నుంచి ఆఫ్‌లైన్ సేవలు అనేవే ఉండవు. ప్రతిదీ APAIMS 2.0 వేదిక ద్వారానే జరుగుతుంది. ఇది పారదర్శకతను పెంచి, రైతులకు వేగంగా సేవలు అందిస్తుంది," అని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే ఫలితాలు వస్తున్నాయి. Vassar  ల్యాబ్ సూచనలు పాటించడం వల్ల ఎరువుల వినియోగం 7.5శాతం తగ్గింది. అంతే కాదు..వేరు శనగ పంట కాలాన్ని జూన్ నుంచి జూలై 15కు మార్చడం వల్ల చీడపీడల సమస్య తగ్గి దిగుబడి పెరుగుతోంది. 

ఏపీ మోడల్‌కు అంతర్జాతీయ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఈ డిజిటల్ నమూనా కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఇటీవల  ఇథియోపియా ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శించింది. ఇక్కడి విధానాలను చూసి అబ్బురపడిన వారు, తమ దేశంలో కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రశంసించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 దేశాలు ఏపీ మోడల్‌పై ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) "ఛాంపియన్" అవార్డుకు నామినేట్ చేసింది.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 187.58 కోట్లు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్‌ను సిఫార్సు చేసింది

మొత్తం మీద, ఈ డిజిటల్ పరివర్తన ద్వారా వ్యవసాయాన్ని మరింత పారదర్శకంగా, లాభసాటిగా, సుస్థిరంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నాలజీని రైతన్నకు చేరువ చేసి, వారి కష్టాలను తగ్గించడమే ఈ  ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్

వీడియోలు

Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Viral News: మోడిఫైడ్ సైలెన్సర్లతో స్టంట్లు.. 1 లక్ష జరిమానా విధించి, కారును సీజ్ చేసిన బెంగళూరు పోలీసులు
మోడిఫైడ్ సైలెన్సర్లతో స్టంట్లు.. 1 లక్ష జరిమానా విధించి, కారును సీజ్ చేసిన బెంగళూరు పోలీసులు
Embed widget