అన్వేషించండి
Surya Prabha Vahanam: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.| ABP Desam
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సూర్య ప్రభ వాహనంపై కనువిందు చేశారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. లోకాలనే నిద్ర లేపి,నూతన శక్తి ని ప్రసాదించే సూర్యుడి పై అధిరోహుడై సిరితల్లి అభయ ప్రదానం చేసింది.
వ్యూ మోర్
Advertisement
Advertisement




















