Vijayawada Organic Mela: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విజయవాడలో ఆర్గానిక్ మేళా
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి తేవడం ద్వారా ముప్పును అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వంద మంది వరకు సేంద్రియ రైతులు ఈ ప్రదర్శనలో పాల్గొని నాణ్యమైన విత్తనాలు ఆహార ఉత్పత్తులను ప్రదర్శించారు. నగరం నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి సైతం సందర్శకులు ఈ ప్రదర్శనకు తరలివచ్చి తనకు అవసరమైన సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయ విధానాలను తెలుసుకుంటున్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించే దిశగా వారిని చైతన్య పరచడమే ఈ ప్రదర్శన ఉద్దేశమని ఆర్గానిక్ మేళా నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. తాము తొలిసారిగా ప్రదర్శన ఏర్పాటు చేసిన సమయంలో ప్రజల్లో అంత అవగాహన లేదని అన్నారు ప్రస్తుతం నిర్వహిస్తున్న నాల్గవ సేంద్రియ మేళాకు అటు రైతులు ఇటు ప్రజల్లోనూ స్పందన గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets