Kadiri MPP: టోల్ ప్లాజా సిబ్బంది పై వైసీపీ ఎంపీపీ దాడి...వీడియో వైరల్
అనంతపురం జిల్లా కదిరిరూరల్ పరిధిలో ఉన్న ఎర్రదొడ్డి టోల్గేట్ వద్ద అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై కదిరి ఎంపీపీ అమర్నాథ్రెడ్డి బుధవారం సాయంత్రం దాడి చేసినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి సోమవారంతో టోల్ప్లాజా కాంట్రాక్ట్ ముగిసింది. మంగళవారం నుంచి కొత్త కాంట్రాక్టర్ అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం. 15 రోజుల క్రితం ఎంపీపీ అమర్నాథ్రెడ్డి తనకు సం బంధించిన ముగ్గురిని అక్కడ పనిలో ఉంచారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మంగళవారం ఆ ముగ్గురిని విధుల నుంచి తొలగించాడు. ఈ విషయమై ఎంపీపీ తన మనుషులను ఎందుకు తీసేశారని అక్కడ ఉన్న సిబ్బందిపై తన అనుచరులతో దాడికి దిగినట్లు వీడియో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎంపీపీ వివరణ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















