Jinnah Tower: జిన్నా టవర్ పై జాతీయ జెండాను ఎగర వేసేందుకు యత్నం..అడ్డుకున్న పోలీసులు
గుంటూరు నగరంలోని జిన్నాటవర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగురవేస్తామని హిందూ వాహిని అనే సంస్థ ప్రకటించడంతో ఉద్రిక్తత పరిస్తితులు ఏర్పడ్డాయి. బంజరంగ్ దళ్ లో బాగంగా ఉన్న హిందూ వాహిని రిపబ్లిక్ డే సందర్బంగా ఎవరు అడ్డువచ్చినా జిన్నా టవర్ పై జాతీయ జండా ఎగర వేస్తామని సోషల్ మీడియా లో తెలియచేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు భారీగా జిన్నాటవర్ సర్కిల్ వద్ద మోహరించారు...అయనా కొందరు హిందూ వాహినీ సభ్యులు జన్నాటవర్ వద్దకు చేరుకొని జండా ఎగర వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు...ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళన కారుల మద్య వాగ్వివాదం నెలకొంది.





















