ఫీజులు కడుతున్నా మౌలిక వసతులు కల్పించడం లేదంటూ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీసీని బయటకు రానీయకుండా ముఖ ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించి అడ్డుకొని నినాదాలు చేశారు. వేలకు వేలు ఫీజులు కడుతున్నా శిథిలావస్థకు చేరిన వసతిగృహాన్ని ఇచ్చారని ఆరోపించారు. విద్యార్థినులు ఉన్న వసతి గృహంలో పెచ్చులూడి పడుతున్నాయని, ప్రమాదం పొంచి ఉందని విద్యార్థులు చెప్పారు. గదులు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయని, రుచికరమైన భోజన సదుపాయం కల్పించడం లేదన్నారు. వసతి గృహానికి యూనివర్సిటీకి ఒక్కో విద్యార్థికి రోజుకు 100 రూపాయలు ఆటో ఖర్చు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ కి ఉండాల్సిన మెరుగైన వసతులు ఒక్కటి కూడా లేవని వాపోయారు. డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తుంటే యూనివర్సిటీ క్యాంపస్ లోకి పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తాము ఏమైనా టెర్రరిస్టులమా అంటూ పోలీసులను నిలదీశారు.
Police Constable Saved The Woman's Life | రైల్వే ట్రాక్ పై మహిళ.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్
CM Jagan Meeting with MLAS | చంద్రబాబు అరెస్టు పై ఎమ్మెల్యే సమావేశంలో షాకింగ్ కామెంట్స్ | ABP Desam
CM Jagan Helicoptor for Organs Transport : గుంటూరు నుంచి తిరుపతికి 'గుండె' తరలింపు | ABP Desam
Nara Lokesh on Inner Ring Road Case : యువగళం ప్రారంభం అనగానే కేసులు మొదలు | ABP Desam
Nara Lokesh Met President of India : రాష్ట్రపతి భవన్ కు చేరిన చంద్రబాబు అరెస్ట్ అంశం | ABP Desam
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక
ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్తో భారత్కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ
/body>