అన్వేషించండి

Karedu Lands Controversy | కరేడు లో ఏం జరుగుతోంది.. గ్రామస్తుల ఆందోళన ఎవరికీ పట్టడం లేదా.? | ABP

కందుకూరు, సింగరాయ కొండ సమీపంలోని కరేడు గ్రామం మండుతోంది. సారవంత మైనతమ భూములు ఒక కంపెనీ కి కట్టబెడతామంటే ఊరుకోమంటూ అక్కడి రైతులు రోడ్డెక్కారు. బంగారం పండే తమ భూములను వదిలి తామెక్కడకి పోవాలనేది  వారి ప్రశ్న. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం గా ఆక్కడి ప్రజలు ఇటీవల హైవే దిగ్బదం చేయడం తోవిషయం వెలుగులోనికి వచ్చింది. అక్కడి రైతులకు అన్యాయం జరుగుతోంది అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షు రాలు షర్మిల, BYC పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆరోస్తున్నారు.

"కరేడు"  గ్రామం  ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధి లోకి వస్తుంది.  పలువురు ఎనలిస్ట్ లు, గ్రామ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం గత వైసీపీ హయాంలో  సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఇండిసోల్ అనే కంపెనీ కోసం పీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 5000 ఎకరాల భూమి ని రామాయపట్నం పోర్టు సమీపం లో కేటాయించింది. అది జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుల కంపెనీ అని ప్రజలకు రైతులకు అన్యాయం చేసి భూమిని అప్పజెబుతున్నారు అంటూ వామపక్షాలు, ప్రజలు ఆరోపించారు. తరువాత 2024 ఎన్నికల ముందు ఆ భూ కేటాయింపులను మరింత పెంచారు. యువగళం పాదయాత్ర లో భాగంగా పర్యటన కు వచ్చిన లోకేష్ ఆ సంస్థ జగన్ సన్నిహితులదే అని విమర్శలు చేసారు. అయితే కూటమి అధికారం లోకి వచ్చాక ఆ భూ కేటాయింపు లు ఆపేస్తారని అనుకున్నామని కానీ ఆలా జరగలేదు అని గ్రామస్తులు అంటున్నారు.  రామాయపట్నం సమీపంలో  జగన్ ప్రభుత్వం కేటాయించిన భూముల్ని బీపీసీయెల్ రిఫైనరీ కి కేటాయించడం కోసం వెనక్కి తీసుకుని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులుగా 'కరేడు ' గ్రామం దగ్గర 8000 ఎకరాల పైగా భూమిని ఇండో సోల్ కంపెనీ కి కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదం అయింది అంటున్నారు వామ పక్షాలకు చెందిన నేతలు.  అప్పుడు జగన్, ఇప్పుడు కూటమి కేటాయించిన భూములు అత్యంత విలువైన వనీ తాము రెండేసి పంటలు పండించే భూమి ఇదనీ కాస్త లోతు తవ్వితే చాలు నీరు పడే సారవంతమైన భూముల్ని ప్రవేటు కంపెనీ కి కేటాయించడం ఏమిటి అని గ్రామస్తులు అంటున్నారు. ఇదే ప్రాంతం లో ఎన్న అప్ ల్యాండ్ లేదా డ్రై ల్యాండ్ ను పరిశ్రమ కు కేటాయించి తమ భూముల్ని వదిలేయాలనేది తమ డిమాండ్ గా కరేడు గ్రామస్తుడు వెంకటేశ్వర్లు అంటున్నారు.. ఈ డిమాండ్ తోనే వారు మొన్న నేషనల్ హైవే ని దిగ్బంధించడంతో  పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. అయితే ప్రభుత్వ అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పి తాత్కాలికంగా ఆందోళన ను అదుపు చేయగలిగారు.  ప్రస్తుతానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి  అక్కడ రైతులు ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు ఇటుగా  పదివేల మందికి పైగానే  ఈ భూ కేటాయింపు ల వల్ల ప్రభావితం అవుతారని, ముందస్తుగా 4 ఎకరాల భూసమీకరణ కోసం రాత్రికి రాత్రి నోటిఫికేషన్ కూడా ఇచ్చారని స్థానిక ఉద్యమ నాయకుడు  మిరియం శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దీనితో స్థానికంగా పరిస్థితి  ఉద్రిక్తం గా మారింది. ఈ భూ సమీకరణ పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తమ ఆందోళనను ఉదృతం చేస్తామని వారు అంటున్నారు.   మరోవైపు  ఈ ఆందోళన ప్రభావం కందుకూరు నియోజకవర్గం తో పాటు  కొండేపి,కావలి లాంటి కీలక నియోజకవర్గాల పైనా పడే అవకాశం ఉందని  ఎనలిస్ట్ లు అంటున్నారు . మరివైపు అప్పట్లో భూ కేటాయింపు లు చేసిన వైసిపి గానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్న కూటమి గాని  ఈ వివాదం పై నోరుమెరపకపోవడం ఏంటని వైఎస్ షర్మిల, రామచంద్ర యాదవ్ లాంటి రాజకీయవేత్తలు  విమర్శలు చేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

65 Foot Trishul: కైలాస గిరిపై భారీ త్రిశూలం రెడీ.. వైజాగ్ టూరిజానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్ - ఈ వారంలోనే ప్రారంభం
కైలాస గిరిపై భారీ త్రిశూలం రెడీ.. వైజాగ్ టూరిజానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్ - ఈ వారంలోనే ప్రారంభం
Stand-up Comedian Sarat Uday: స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
AP special assembly sessions: మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
Andhra Pradesh News: వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం
వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP special assembly sessions: మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
Stand-up Comedian Sarat Uday: స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
BRS Foundation Day: సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
Angkrish Raghuvanshi Dismissed: అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
65 Foot Trishul: కైలాస గిరిపై భారీ త్రిశూలం రెడీ.. వైజాగ్ టూరిజానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్ - ఈ వారంలోనే ప్రారంభం
కైలాస గిరిపై భారీ త్రిశూలం రెడీ.. వైజాగ్ టూరిజానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్ - ఈ వారంలోనే ప్రారంభం
Mehreen Pirzada Wedding: హానీ పాపకు పెళ్లైంది... సడన్‌గా మెహరీన్ వెడ్డింగ్... షాక్ ఇచ్చిన పంజాబీ బ్యూటీ
హానీ పాపకు పెళ్లైంది... సడన్‌గా మెహరీన్ వెడ్డింగ్... షాక్ ఇచ్చిన పంజాబీ బ్యూటీ
Andhra Pradesh News: వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం
వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం
CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
Embed widget