అన్వేషించండి

Karedu Lands Controversy | కరేడు లో ఏం జరుగుతోంది.. గ్రామస్తుల ఆందోళన ఎవరికీ పట్టడం లేదా.? | ABP

కందుకూరు, సింగరాయ కొండ సమీపంలోని కరేడు గ్రామం మండుతోంది. సారవంత మైనతమ భూములు ఒక కంపెనీ కి కట్టబెడతామంటే ఊరుకోమంటూ అక్కడి రైతులు రోడ్డెక్కారు. బంగారం పండే తమ భూములను వదిలి తామెక్కడకి పోవాలనేది  వారి ప్రశ్న. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం గా ఆక్కడి ప్రజలు ఇటీవల హైవే దిగ్బదం చేయడం తోవిషయం వెలుగులోనికి వచ్చింది. అక్కడి రైతులకు అన్యాయం జరుగుతోంది అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షు రాలు షర్మిల, BYC పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆరోస్తున్నారు.

"కరేడు"  గ్రామం  ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధి లోకి వస్తుంది.  పలువురు ఎనలిస్ట్ లు, గ్రామ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం గత వైసీపీ హయాంలో  సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఇండిసోల్ అనే కంపెనీ కోసం పీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 5000 ఎకరాల భూమి ని రామాయపట్నం పోర్టు సమీపం లో కేటాయించింది. అది జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుల కంపెనీ అని ప్రజలకు రైతులకు అన్యాయం చేసి భూమిని అప్పజెబుతున్నారు అంటూ వామపక్షాలు, ప్రజలు ఆరోపించారు. తరువాత 2024 ఎన్నికల ముందు ఆ భూ కేటాయింపులను మరింత పెంచారు. యువగళం పాదయాత్ర లో భాగంగా పర్యటన కు వచ్చిన లోకేష్ ఆ సంస్థ జగన్ సన్నిహితులదే అని విమర్శలు చేసారు. అయితే కూటమి అధికారం లోకి వచ్చాక ఆ భూ కేటాయింపు లు ఆపేస్తారని అనుకున్నామని కానీ ఆలా జరగలేదు అని గ్రామస్తులు అంటున్నారు.  రామాయపట్నం సమీపంలో  జగన్ ప్రభుత్వం కేటాయించిన భూముల్ని బీపీసీయెల్ రిఫైనరీ కి కేటాయించడం కోసం వెనక్కి తీసుకుని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులుగా 'కరేడు ' గ్రామం దగ్గర 8000 ఎకరాల పైగా భూమిని ఇండో సోల్ కంపెనీ కి కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదం అయింది అంటున్నారు వామ పక్షాలకు చెందిన నేతలు.  అప్పుడు జగన్, ఇప్పుడు కూటమి కేటాయించిన భూములు అత్యంత విలువైన వనీ తాము రెండేసి పంటలు పండించే భూమి ఇదనీ కాస్త లోతు తవ్వితే చాలు నీరు పడే సారవంతమైన భూముల్ని ప్రవేటు కంపెనీ కి కేటాయించడం ఏమిటి అని గ్రామస్తులు అంటున్నారు. ఇదే ప్రాంతం లో ఎన్న అప్ ల్యాండ్ లేదా డ్రై ల్యాండ్ ను పరిశ్రమ కు కేటాయించి తమ భూముల్ని వదిలేయాలనేది తమ డిమాండ్ గా కరేడు గ్రామస్తుడు వెంకటేశ్వర్లు అంటున్నారు.. ఈ డిమాండ్ తోనే వారు మొన్న నేషనల్ హైవే ని దిగ్బంధించడంతో  పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. అయితే ప్రభుత్వ అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పి తాత్కాలికంగా ఆందోళన ను అదుపు చేయగలిగారు.  ప్రస్తుతానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి  అక్కడ రైతులు ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు ఇటుగా  పదివేల మందికి పైగానే  ఈ భూ కేటాయింపు ల వల్ల ప్రభావితం అవుతారని, ముందస్తుగా 4 ఎకరాల భూసమీకరణ కోసం రాత్రికి రాత్రి నోటిఫికేషన్ కూడా ఇచ్చారని స్థానిక ఉద్యమ నాయకుడు  మిరియం శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దీనితో స్థానికంగా పరిస్థితి  ఉద్రిక్తం గా మారింది. ఈ భూ సమీకరణ పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తమ ఆందోళనను ఉదృతం చేస్తామని వారు అంటున్నారు.   మరోవైపు  ఈ ఆందోళన ప్రభావం కందుకూరు నియోజకవర్గం తో పాటు  కొండేపి,కావలి లాంటి కీలక నియోజకవర్గాల పైనా పడే అవకాశం ఉందని  ఎనలిస్ట్ లు అంటున్నారు . మరివైపు అప్పట్లో భూ కేటాయింపు లు చేసిన వైసిపి గానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్న కూటమి గాని  ఈ వివాదం పై నోరుమెరపకపోవడం ఏంటని వైఎస్ షర్మిల, రామచంద్ర యాదవ్ లాంటి రాజకీయవేత్తలు  విమర్శలు చేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కోన‌సీమ‌లో తీవ్ర విషాదం.. స‌ముద్రంలో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు
కోన‌సీమ‌లో తీవ్ర విషాదం.. స‌ముద్రంలో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget