అన్వేషించండి

Breaking News Live: రుషికొండ బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News Live: రుషికొండ బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

Background

ఢిల్లీలోని గోకుల్ పురిలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. శివార్లలోని గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారి బతుకులు బుగ్గిపాలయ్యాయి. గుడిసెలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణ నష్టం అధికంగా వాటిల్లినట్లు తెలుస్తోంది. నిద్రపోతున్న సమయం కనుక, మంటల్ని త్వరగా గుర్తించక పోవడంతో పెను నష్టాన్ని మిగిల్చింది అగ్ని ప్రమాదం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఎంగానో శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. చిన్నారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. 

ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్లకు ఎగబాకింది. హైదరాబాద్‌లో ఇంధన ధరలు గత ఏడాది డిసెంబర్ నుంచి నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు సైతం పెట్రోల్ ధర లీటర్ రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 

ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది.  వరంగల్‌లో 19 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌‌పై 17 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 కు పతనమైంది. నిజామాబాద్‌లోపెట్రోల్ లీటర్ ధర రూ.109.93 కాగా, డీజిల్‌ లీటర్ ధర రూ.96.23 అయింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 12th March 2022)పై 40 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.48 కాగా, ఇక్కడ డీజిల్ పై 37 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.56 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. 48 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్‌పై 44 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.51కి పతనమైంది.

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు దుమ్మురేపారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్ సేన ప్రత్యర్థి విండీస్ మహిళల ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్లు ఓపెనర్ స్మృతి మందాన (123), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (109) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది.

21:04 PM (IST)  •  12 Mar 2022

రుషికొండ బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

పరదేశిపాలేనికి చెందిన శ్రీ రామా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెందిన ఇద్దరు విద్యార్థులు రుషికొండ బీచ్ లో గల్లంతయ్యారు. వీరిలో 8వ తరగతి చదువుతున్న మొయ్య పార్డు(15)మృతదేహం లభ్యంకాగా 10వ తరగతి విద్యార్థి సత్యాల రాజేష్(16) గల్లంతయ్యాడు. 9వ తరగతి చదువుతున్న బాలుడు పర్రి సాయి ప్రాణాలతో బయట పడగా, అతడికి గీతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

19:19 PM (IST)  •  12 Mar 2022

మార్చి 16 నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు

ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రోజూ ఉద‌యం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 వ‌ర‌కు బ‌డులు నిర్వహిస్తారు. ఎండ‌లు పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బ‌డుల‌పై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

17:17 PM (IST)  •  12 Mar 2022

ఒడిశాలో లఖీంపూర్ తరహా ఘటన, జనంపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు 

ఒడిశాలో లఖీంపూర్ తరహా ఘటన చోటుచేసుకుంది. బీజేడీ ఎమ్మెల్యే కారు జనం పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది పోలీసులు, స్థానికులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మె్ల్యేపై దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యేకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

16:43 PM (IST)  •  12 Mar 2022

సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కన్నుమూత 

సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. గత కొంత కాలంగా కందికొండ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆయన గేయాలు రాశారు. 

15:33 PM (IST)  •  12 Mar 2022

Bandi Sanjay Letter To KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ, నిరుద్యోగుల కోసం డిమాండ్లు

Bandi Sanjay Letter To KCR: బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువత కోసం స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. కోచింగ్‌ కేంద్రాల్లో అల్పాహారం, భోజనం ప్రభుత్వమే కల్పించాలని, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని సైతం కోరారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Indiramma Illu Latest News: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Indiramma Illu Latest News: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
SKN: 'జోక్‌ను జోక్‌లా తీసుకోండి.. తప్పుడు ప్రచారం వద్దు' - తెలుగుమ్మాయిల కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ వివరణ
'జోక్‌ను జోక్‌లా తీసుకోండి.. తప్పుడు ప్రచారం వద్దు' - తెలుగుమ్మాయిల కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ వివరణ
Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ - పిల్లలు ఎంత ఎదిగిపోయారో తెలుసా?
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ - పిల్లలు ఎంత ఎదిగిపోయారో తెలుసా?
Mazaka movie OTT: 'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?
'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?
Qatar Amir Networth: ఖతర్‌ పాలకుడికి విమానాశ్రయానికి వెళ్లి మరీ స్వాగతం పలికిన మోదీ, అతని సంపద ఎంతో తెలుసా?
ఖతర్‌ పాలకుడికి విమానాశ్రయానికి వెళ్లి మరీ స్వాగతం పలికిన మోదీ, అతని సంపద ఎంతో తెలుసా?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.