అన్వేషించండి

Reasons For Operation Polo: హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్ పోలో చేపట్టడానికి  5 ప్రధాన కారణాలు ఇవే

Telangana Praja Palana Dinotsavam | వల్లభాయ్ పటేల్ సంస్థానాల రాజ్యాలను ఒప్పించి భారతదేశంలో విలీనం చేయించారు. కానీ, ఇందుకు వ్యతిరేకించిన హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్ పోలో నిర్వహించారు

బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే సమయంలో, దేశాన్ని భారత్, పాకిస్థాన్‌లుగా రెండు ముక్కలుగా విడగొట్టింది. అంతేకాకుండా, దేశంలో ఆనాడు దాదాపు 500కు పైగా సంస్థానాలు ఉండేవి. ఇవి బ్రిటీష్ పాలన కింద ఉన్న స్వతంత్ర రాజ్యాలు. ఇవి భారత్‌లో గానీ, పాకిస్థాన్‌లో గానీ కలవవచ్చని, లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండవచ్చని స్వేచ్ఛను కల్పించింది. దీంతో హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర దేశంగా ఉండాలని నాటి పాలకులు నిజాంలు భావించారు. అయితే, భారతదేశానికి నడిబొడ్డున ఉన్న ఈ రాజ్యం స్వతంత్రంగా ఉండటం భారతదేశ సమగ్రతకు ముప్పుగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది.

భారతదేశ తొలి హోం శాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ ఈ సంస్థానాల విలీనంపై దృష్టి పెట్టారు. ఇందుకు నిరాకరించిన రాజ్యాలను నయానా, భయానా ఒప్పించి భారతదేశంలో విలీనం చేయించారు. కానీ, ఇందుకు వ్యతిరేకించిన హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్ పోలో నిర్వహించారు. దీంతో హైదరాబాద్ సంస్థానం 1948, సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది. అయితే, ఈ ఆపరేషన్ పోలో సైనిక చర్యకు ప్రేరేపించిన ముఖ్య కారణాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

1. హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే నిజాం నిర్ణయం

బ్రిటిష్ ప్రభుత్వం 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది. హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్రంగా కొనసాగాలని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్ణయించుకున్నారు. మన దేశ సంస్థానాలన్నింటికన్నా హైదరాబాద్ సంస్థానం అతి పెద్దది. ఒక రకంగా చెప్పాలంటే, ప్రస్తుత ఫ్రాన్స్ దేశంలో సగం నాటి హైదరాబాద్ సంస్థానం ఉండేది. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక రాష్ట్రాల్లో కొంత భాగం, తెలంగాణ మొత్తం హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. భారతదేశం మధ్యలో మరో రాజ్యం ఉండటం ముప్పుగా భావించిన హోం మంత్రి వల్లభాయ్ పటేల్, భారతదేశంలో ఈ సంస్థానం కలవాల్సిందేనన్న మొండి పట్టుదలతో ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్యకు దిగారు.


Reasons For Operation Polo: హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్ పోలో చేపట్టడానికి  5 ప్రధాన కారణాలు ఇవే

2. ప్రజలపై రజాకార్ల హింస

నిజాం ప్రభుత్వానికి మద్దతుగా ఖాసీం రజ్వీ నాయకత్వంలో 'రజాకార్లు' అనే సంస్థ ఏర్పడింది. ఈ ప్రైవేటు సైన్యం ప్రజలపై అరాచకాలకు దిగింది. హింస, దోపిడీ, దాడులకు ఈ రజాకార్లు పాల్పడ్డారు. మరోవైపు, తెలంగాణ సాయుధ పోరాటం నిజాంకు వ్యతిరేకంగా జరుగుతోంది. హైదరాబాద్ సంస్థానంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తాయి. ప్రజలను ఈ రజాకార్ల హింస నుండి రక్షించేందుకు భారత సైన్యం ఆపరేషన్ పోలోకి దిగింది.

3. పాకిస్తాన్‌తో సంబంధాల కోసం నిజాం ప్రయత్నాలు

హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండేందుకు నిజాం పాలకులు పాకిస్థాన్‌తో సంబంధాలు పెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం పాకిస్థాన్‌కు భారీ మొత్తంలో నిజాం పాలకులు అప్పు కూడా ఇచ్చారు. భారతదేశం ఒకవేళ దాడికి పాల్పడితే, పాకిస్థాన్‌లో చేరే విషయంలో కూడా చర్చలు జరిపారు. ఈ సమాచారం నిఘా వర్గాల ద్వారా భారత ప్రభుత్వానికి చేరింది. ఆలస్యం చేస్తే చరిత్రలో ఇది వ్యూహాత్మక తప్పిదం అవుతుందని, భారత సమగ్రతకు ఇది ముప్పుగా మారుతుందని భారత ప్రభుత్వం భావించింది. ఆపరేషన్ పోలో చేపట్టడానికి ఇది మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

4. భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం సహాయం కోసం నిజాం ప్రయత్నాలు

తన రాజ్యం స్వతంత్రంగా ఉండాలని భావించిన నిజాం, ఈ సమస్యను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి భారతదేశానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి తలుపులు కూడా తట్టారు. నిజాం పాలకులను ఇలాంటి ప్రయత్నాలు చేసేందుకు అనుమతిస్తే మరింత సమస్యలు ఉత్పన్నమవుతాయని, బయటి దేశాల జోక్యాన్ని తమ అంతర్గత వ్యవహారాల్లో అనుమతించకూడదన్న భారత ప్రభుత్వ ఆలోచనతో వెంటనే ఆపరేషన్ పోలోకు సైన్యాన్ని దింపారు.

5. భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయాలన్న ప్రజల డిమాండ్

నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల హింసకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఒకవైపు జరుగుతోంది. రైతులు భూస్వామ్య దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రజా నిరసనలు పెద్ద ఎత్తున తెలంగాణ అంతటా జరుగుతున్నాయి. రజాకార్ల హింసను అడ్డుకునేందుకు గ్రామ గ్రామాన ప్రజా దళాలు ఏర్పడ్డాయి. భారత కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల వంటివి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నాయి. ప్రజలు భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోవాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. జాతీయ జెండా ఎగురవేస్తే నిజాం ప్రైవేటు సైన్యం అడ్డుకునే పరిస్థితి. ప్రజల ఒత్తిడి భారత ప్రభుత్వంపై అధికంగా పెరిగింది. దీంతో ఆపరేషన్ పోలోకు భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఈ అన్ని కారణాల కారణంగా హైదరాబాద్ సంస్థానం విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. శాంతి చర్చలు జరిపినా నిజాం పాలకులు అంగీకరించరన్న దృఢ నిశ్చయానికి భారత ప్రభుత్వం వచ్చింది. సైనిక చర్యే సరైన నిర్ణయంగా భావించాల్సి వచ్చింది. పాకిస్థాన్‌తో సంబంధాలు, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు అందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితులే ఆపరేషన్ పోలోకు దారి తీశాయి.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Kadem Forest Missing Farmer: అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - అడవిలో తప్పిపోయిన వృద్ధ రైతు - డ్రోన్లతో పోలీసుల ముమ్మర గాలింపు!
అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - డ్రోన్లతో కడెం పోలీసుల ముమ్మర గాలింపు!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget