అన్వేషించండి

Warangal News: పాలకుర్తిలో పండుగ‌లా రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Warangal News: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాలకుర్తి నియోజకవర్గంలో పండుగ‌లా రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. 

Warangal News: తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ధి ఉత్స‌వాలు ప్రతి పల్లె పల్లెలో పండుగలా నిర్వహించాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ వేడుకల్లో పాల్గొనాలని అదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం విస్తరించి ఉన్న జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల అన్ని శాఖల అధికారులను మంత్రి పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేకంగా గురువారం సమీక్ష చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావ ద‌శాబ్ధి ఉత్స‌వాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పారు. ఘ‌నంగా, పండుగ‌లా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్రుజ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వ‌ర‌కు 21 రోజుల పాటు నిర్వ‌హించే అన్ని ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాలన్నారు. మన రాష్ట్రం దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది. అన్ని శాఖ‌ల్లో అనేక అవార్డులు సాధించాం. ఈ వేడుక‌ల‌ను విజ‌యోత్స‌వంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. మిగ‌తా శాఖ‌ల‌కు భిన్నంగా ఎక్కువ శాఖ‌ల‌తో మ‌న‌కే ఎక్కువ అనుబంధం ఉంది. అందుకే ఆయా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించే బాధ్య‌త మ‌న‌పై ఎక్కువ‌గా ఉంద‌ని సూచించారు. 21 రోజుల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖలు ఎక్కువ భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తూనే పాలకుర్తి నియోజకవర్గం లో ప్రత్యేకంగా మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి నిర్ణయించారు. 

  • జూన్ 3వ తేదీ.. రైతు దినోత్సవం ఘనంగా జరపాలి. ఆరోజు మార్కెట్ యార్డుల్లో రైతు కొనుగోలు కేంద్రాల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలన్నారు. తాను వరంగల్ మార్కెట్ తోపాటు రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగర, కొడకండ్ల తదితర పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మార్కెట్ యార్డులను సందర్శిస్తానని మంత్రి తెలిపారు. 
  • నాలుగవ తేదీ.. సురక్ష దినోత్సవ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించాలని మంత్రి చెప్పారు. అలాగే పోలీసు శకటాలు గౌరవ వందన స్వీకారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయాలనన్నారు. పోలీసు శాఖ ద్వారా జరుగుతున్న రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి తెలిపారు.
  • ఐదవ తేదీ.. తెలంగాణ విద్యుత్ విజయోత్సవం కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిర్వహిస్తూ.. ఆరోజు పోలేపల్లి చిట్యాల సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన జరపాలని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామాలకు పెరిగిన విద్యుత్ సదుపాయాలను తెలపాలి అన్నారు.
  • జూన్ ఆరవ తేదీ.. పారిశ్రామిక ప్రగతి ఉత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం లో నూతనంగా ఏర్పాటు చేయనున్న కొడకండ్ల మినీ టెక్స్టైల్ పార్క్ కి శంకుస్థాపన చేయాలని, మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు
  • 7వతేదీ.. సాగునీటి దినోత్సవం పండుగను చెక్ డ్యాంల వ‌ద్ద‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆరోజు నియోజకవర్గంలోని 129 గ్రామాల్లో 108 చెరువుల వద్ద చెరువుల పండుగ నిర్వహించాలని, అలాగే కాలువల వెంట నీటిని విడుదల చేయాలని ఆ అంశాలను ప్రజలకు అర్థం చేయాలని సూచించారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలోని 1000 మందితో ఒక సమావేశం నిర్వహించి సాగునీటి ప్రాధాన్యతలను ప్రజలకు వివరించాలని మంత్రి తెలిపారు. పెద్ద వంగర, రాయపర్తి, మైలారం, తొర్రూరు ప్రాంతాలలో నీటి కాలువల వద్ద సీఎం గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని మంత్రి ఆదేశించారు.
  • 8వ తేదీన.. ఊర్లల్లో చెరువుల పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను చెరువుల వ‌ద్ద‌కు తీసుకెళ్లి, చెరువుల్లో నీటిని చూపించాలన్నారు. కట్ట మైసమ్మ పండుగ నిర్వహిస్తూ మేకలను కోళ్లను కోసుకోవాలి అక్కడే దావతులు జరిగేటట్టు చూడాలి అని మంత్రి తెలిపారు.
  • 9వ తేదీన.. తెలంగాణ సంక్షేమ సంబరాలు సందర్భంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయాలన్నారు. అలాగే రాయపర్తిలో గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. కులవృత్తుల వారికి ప్రభుత్వం వినూత్నంగా అందించనున్న లోన్లను అందించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కొడకండ్ల పాలకుర్తి దేవరుప్పుల మండలాలలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ఆరోజు పాలకుర్తిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
  •  10వ తేదీన.. సుప‌రిపాల‌న దినోత్స‌వం సంద‌ర్భంగా కొత్త‌గా జిల్లాలు, మండ‌లాలు, గ్రామ పంచాయ‌తీలు ఏర్పాట‌య్యాయని చెప్పుకొచ్చారు. వాటిని అందంగా అలంక‌రించి, విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హించాలని మంత్రి తెలిపారు. కొత్త‌గా భ‌వ‌నాలు ఉంటే వాటిని ప్రారంభించాలన్నారు. కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లా కేంద్రం, పెద్ద వంగర మండల కేంద్రం, తొర్రూరు మున్సిపాలిటీ, ఆర్డీవో ఆఫీసు, డీఎస్పీ, కొత్త గ్రామపంచాయతీ భవనాలు తండాలు గూడాలలో పెద్ద ఎత్తున ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి వివరించారు. ఆరోజు సీఎం కీసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలని చెప్పారు. అదే రోజు రాయపర్తి మండలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. 
  • 11వ తేదీన.. తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాలు, కవి సమ్మేళనాలు నిర్వహించాలని మంత్రి అధికారులకు తెలిపారు. తొర్రూరు మండలం మాటేడు, ఫతేపురం గ్రామాలకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. 
  • 12వ తేదీన.. తెలంగాణ రన్ నిర్వహించాలని ఆ రోజు పాలకుర్తిలో ఉదయం 6, 7 గంటల మధ్య కొడకండ్ల, పాలకుర్తి, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి, దేవరుప్పుల మొత్తం మండలాల నాయకులు ప్రజలు అధికారులు అందరిని భాగస్వామ్యం చేస్తూ పాలకుర్తిలో భారీగా తెలంగాణ రన్ నిర్వహించాలని మంత్రి తెలిపారు.
  • 13వ తేదీన.. మ‌హిళా దినోత్స‌వాన్ని పురస్కరించుకొని పాలకుర్తి తొర్రూరు కేంద్రాలలో 600 చొప్పున ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని మంత్రి నిర్ణయించారు. అలాగే పెద్ద వంగర గ్రామంలో మహిళలకు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయాలని మంత్రి తెలిపారు. మహిళలు, మహిళ అధికారులు, మహిళా సర్పంచులకు ఉత్తములుగా ఎంపిక చేసి వాళ్ళకి సన్మానం చేయాలని మంత్రి ఆదేశించారు. మహిళలు, డ్వాక్రా సంఘాలు, వీఓఏలు, సెర్ప్ ఉద్యోగులు అంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేయండని మంత్రి తెలిపారు.
  • 14వ తేదీన.. వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ దవాఖానాలలో పండ్ల పంపిణీ చేయాలని మంత్రి తెలిపారు. గర్భిణీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ చేపట్టాలన్నారు. తొర్రూరు పట్టణంలో బస్తీ దావఖానాలను ప్రారంభించాలన్నారు. అన్ని దవాఖానాలలో కేసీఆర్ కిట్లను ప్రదర్శిస్తూ వాటిని బాలింతలకు పంపిణీ చేయాలని అలాగే రాయపర్తి పాలకుర్తి తొర్రూరు గ్రామాల్లో తాను పాల్గొంటానని మంత్రి తెలిపారు.
  • 15వ తేదీన.. ప‌ల్లె ప్ర‌గ‌తి దినోత్సవం సంద‌ర్భంగా ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ద్వారా మ‌న గ్రామాలు బాగుప‌డ్డ తీరుని వివ‌రించాలన్నారు. వివిధ గ్రామాభివృద్ధి సంఘాల‌ను భాగ‌స్వాముల‌ను చేయాలని చెప్పారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని వివరించారు. గ్రామ స‌భ‌లు నిర్వ‌హించాలన్నారు. జాతీయ జెండాలు ఎగురవేయాలన్నారు.  గ్రామంలో జరిగిన అభివృద్ధి మొత్తం సవివరంగా సమాచారం కరపత్రాల ద్వారా తెలపాలన్నారు. అన్ని శాఖల వివరాలు అందులో ఉండాలని, ప‌ల్లెల అభివృద్ధికి పాటు ప‌డిన పారిశుద్ధ్య కార్మికుల‌ను స‌త్క‌రించాలని తెలిపారు. వారికి బ‌ట్ట‌లు, బూట్లు, అప్రాన్‌, స‌ర్టిఫికేట్లు పంపిణీ చేయాలని మంత్రి వివ‌రించారు. దాతలకు సన్మానం చేయాలని చెప్పారు. కొత్త గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని.. అదే రోజు తాను రాయపర్తిలో నూతన భవనాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తానని మంత్రి వెల్లడించారు.
  • 16వ తేదీన.. తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా తొర్రూరు పట్టణంలో ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్లను అందంగా అలంకరించి ఊరేగించాలని, నాడు - నేడు పట్టణ ప్రగతిపై నివేదికలు ఫోటోలతో కూడిన ప్రదర్శన చేయాలని మంత్రి వివరించారు. అలాగే ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి అభివృద్ధికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలుపాలని, కరపత్రాలు వేసి ప్రజలకు పంచాలని ర్యాలీ నిర్వహించాలని జెండా ఆవిష్కరణలు చేయాలని సూచించారు. అదే రోజు సమీకృత మార్కెట్ షాపుల కేటాయింపు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశించారు. ఈరోజు గ్రామాలను పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
  • 17వ తేదీన.. తెలంగాణ గిరిజన ఉత్సవం సందర్భంగా సేవాలాల్ కేసీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు చేయాలని 10% రిజర్వేషన్లు బంజారా భవన ఏర్పాటు బంటి అంశాలను ప్రజలకు వివరించాలన్నారు. పాలకుర్తిలో  రెండు కోట్లతో నిర్మించనున్న బంజారా భవన్ కు ఆరోజు శంకుస్థాపన చేస్తామని అలాగే తండాలలో గూడాలలో ఏర్పాటు చేసిన కొత్త భవనాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయాలని మంత్రి నిర్ణయించారు.
  • 18వ తేదీన.. తెలంగాణ మంచినీళ్ల పండుగ రోజున మిషన్ భగీరథ... గతంలో, ప్రస్తుతం ప్రజలకు అర్థం అయ్యే విధంగా చేయాలన్నారు. ఊరు అంతా పండుగ చేయాలని, ప్రతి ఇంటికి న‌ల్లాల ద్వారా నీటిని అందిస్తున్న విష‌యం ప్ర‌జ‌ల‌కు తెల‌పాలన్నారు. ఆరోజు ఫిల్ట‌ర్ బెడ్ల ద‌గ్గ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను తీసుకెళ్లి భోజ‌నాలు పెట్టి, నీటిని ప‌రీక్ష చేసి, శుద్ధి చేసిన నీరు ఎందుకు ఆరోగ్య‌క‌ర‌మో వివ‌రించాలని చెప్పారు. ఆరోజు సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేయాలని చెప్పుకొచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలను మరిపెడ ఫిల్టర్ బెడ్లు తీసుకెళ్లి చూపించాలని అందుకు తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండలాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇంటింటిలో నల్లాల దగ్గర మామిడి తోరణాలు కట్టి.. కొబ్బరికాయలు, కొట్టి మిషన్ భగీరథ ట్యాంకుల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలని మంత్రి నిర్ణయించారు.
  • 19వ తేదీన.. తెలంగాణకు హరితోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బడుల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని మంత్రి అధికారులకు వివరించారు.  వ్యక్తిగతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని, అటవీ పునరుద్ధరణపై, పెరిగిన గ్రీనరీ శాతంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. హరిత హారం కింద నాటిన మొక్క‌లను 98శాతం సంర‌క్షించుకున్నామని, వాటి ద్వారా 7.7 శాతం గ్రీనరీ పెరిగిందని దాని వల్లే వర్షాలు పడి కాలం అవుతున్న‌ది ప్రజలకు తెలపాలన్నారు.
  • 20వ తేదీన.. తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా అన్ని బడుల వద్ద జెండా వందనం జరపాలని.. బడిలో విద్యార్థులతో భారీగా ర్యాలీ నిర్వహించాలని చెప్పారు. గత పదేళ్లలో విద్యా విధానంలో వచ్చిన మార్పులను విద్యార్థులకు తెలిపాలన్నారు. సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. కవితలు, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని.. విజేతలకు బహుమతులు అందించాలని చెప్పారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన స్కూళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొల్పాలన్నారు. నియోజకవర్గంలోని హరిపిరాల, చిట్యాల, గంట్లకుంట, కొడకండ్ల పాలకుర్తి చిన్న బంగార తదితరచోట్ల కస్తూర్భా పాఠశాలలో మన ఊరు మనబడి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. అలాగే ప్రత్యేకంగా పాలకుర్తికి మంజూరైన డిగ్రీ కాలేజీని ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
  • 21వ తేదీన.. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పరిచిన దేవాలయాల ప్రాంగణాల్లో అనేక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. నియోజకవర్గంలోని సన్నూరు, చెన్నూరు వాన కొండయ్య, తిరుమలాయపల్లి, నాంచారి మడూరు, పాలకుర్తి, వల్మీ డి, బమ్మెర వంటి అనేక గ్రామాలలో ని దేవాలయాల వద్ద నిర్వహించవలసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నియోజకవర్గంలోని మసీదులు, చర్చిలను అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేయాలని చెప్పారు.
  •  22వ తేదీన.. అమ‌రుల దీనోత్స‌వం ఉంటుంద‌ని, ఆనాటి అమ‌రుల‌ను గుర్తుకు చేసుకుంటూ జిల్లా ఒక యూనిట్ గా ఒకే స‌మ‌యానికి నివాళుల‌ర్పించాలని మంత్రి చెప్పారు.  దేవరుప్పులలో శ్రీకాంతాచారి విగ్రహానికి రెండు నిమిషాలు మౌనం పాటించాలన్నారు. అలాగే గ్రామ పంచాయతీలు తొమ్మిది గంటలకు, మండల పరిషత్తులకు 10 గంటలకు, జిల్లా పరిషత్లకు 11 గంటలకు అలాగే అన్ని ప్రభుత్వ వివిధ మున్సిపాలిటీ సొసైటీలో వద్ద ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 

ఈ స‌మీక్ష‌లో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, డీఆర్డీఓ రాంరెడ్డి, ఏపీడీ నూరుద్దీన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget