అన్వేషించండి

Warangal: కడియం శ్రీహరిలో భారీ మార్పు, గతానికి భిన్నంగా పర్యటనలు

Kadiyam Srihari: కడియం శ్రీహరి తన రాజకీయ జీవితంలో ఏ రోజు అధికారుల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవు. ప్రజా సమస్యలు పరిష్కారం, పనుల కోసం వారికే ఫోన్ చేసేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది.

Kadiyam Srihari News: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలో ఊహించని విధంగా మార్పు వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కడియం శ్రీహరి కనుసైగలు, ఫోన్లతోనే అధికారులతో పనులను చేయించేవారు. కానీ కొద్ది రోజులుగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతూ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

కడియం శ్రీహరి రాజకీయ జీవితంలో ఆధిపత్యాన్ని కొనసాగించారు తప్ప. ఏ రోజు అధికారుల వద్దకు వెళ్లలేదు. ప్రజా సమస్యలు పరిష్కారం, పనుల కోసం అధికారులకు ఫోన్ చేయడం, లేదంటే ఇంటికి రప్పించుకునేవారు. జిల్లాల్లో కేంద్రంలోనే ఉండి తన మార్క్ చాటుకొనేవారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు ఉంటే తప్ప నియోజకవర్గానికి పెద్దగా వెళ్లేవారు కాదు. కొద్ది రోజులుగా కడియం శ్రీహరి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. నియోజకవర్గం లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేయడంతో పాటు ప్రజల్లో ఉంటున్నారు.

కారణాలేంటి?
అయితే ఈ మార్పు రావడానికి కారణం ఏంటి అనే అనుమానాలు లేకపోలేదు. ఆధిపత్యంతో కడియం శ్రీహరి కనుసైగలతో అధికారులతో పనులు చేయించడంతోపాటు పార్టీలోని నేతలను చక్కదిద్దేవారు. ఒక రకంగా చెప్పాలంటే సొంత నియోజకవర్గాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాను కడియం తన తన సంఘంలో ఉంచుకునేవారు. శ్రీహరి లో ఒక్కసారిగా మార్పు రావడంపై నియోజకవర్గం ప్రజల్లో తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తన కూతురుకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఎంపీలు చేశారు. 

అయితే కడియం శ్రీహరి పార్టీ మారడంపై స్వంత నియోజకవర్గ పజల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని అనేక ప్రకటనలు చేస్తూ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వ్యతిరేకత నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా కొనసాగుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంచార్జీ ఇందిర బలంగా ఉంది. కడియం శ్రీహరి రాక తీవ్రంగా వ్యతిరేకించారు ఇందిర వర్గం. పార్టీ కార్యక్రమాల్లో ఇందిర వర్గం కడియం ను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో అధిష్టానం పెద్దలు సయోధ్య కుదూర్చడంతో సమస్య సద్దుమనిగింది. కడియం అధిపత్యానికి ఇందిర ఆమె వర్గం అడ్డుపడుతుందడంతో చేసేది ఏమిలేక నియోజకవర్గం లో పట్టు కోసం ఉనికిని కాపాడుకోవడం కోసం కడియం శ్రీహరి క్షేత్ర స్థాయి లో ఉంటున్నారట. 

ఉనికి కోసమే!
అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇందిర నియోజకవర్గంలోని అధికారులను ఆమె ఆధిపత్యంలో కి తెచ్చుకుంది. కడియం శ్రీహరి ఎమ్మెల్యే గా ఉన్న ఆయన పవర్ నడవలేదు. అయితే  కడియం పార్టీ మారడానికి ఇది కూడా ఒక కారణం గా ప్రచారంలో లేకపోలేదు. అధికారులను తన కనుసన్నల్లోనే తెచ్చుకోవడం కోసం, నియోజకవర్గం ఉనికి కాపాడుకోవడం కోసం క్షేత్రస్థాయిలో వెతున్నారట.

మరో ప్రచారం లేకపోలేదు. కడియం శ్రీహరి బీ అర్ ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అనర్హత వేటు కోసం బీ అర్ ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లింది. కడియం శ్రీహరి అనర్హత వేటు పై వాదనలు కొనసాగుతున్నాయి. అనర్హత భయంతో కాంగ్రెస్ లో చేరిన బీ అర్ ఎస్ ఎమ్మెల్యే తిరిగి పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కడియం తిరిగి బీ అర్ ఎస్ లోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో పాటు అనర్హత వేటు పడడం సాధ్యమయ్యే పనికాదు. కానీ దురదృష్టవశాత్తు వేటు పడితే తిరిగి ఎన్నికలకు వెళ్ళాలి. దీంతో ముందు జాగ్రత్తగా కడియం నిత్యం  నియోజకవర్గంలో ఉంటున్నారనే  ప్రచారం లేకపోలేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Target Harish Rao: తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
TDP MLAs: టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చక్రవర్తులా? - ధ్యానం సలహాతో వారిని చంద్రబాబు దారిలో పెట్టగలరా?
టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చక్రవర్తులా? - ధ్యానం సలహాతో వారిని చంద్రబాబు దారిలో పెట్టగలరా?
Peddi: పెద్ది లేట్ అవ్వడం లేదు... రిలీజ్ కన్‌ఫ్యూజన్‌పై రామ్ చరణ్ క్లారిటీ
పెద్ది లేట్ అవ్వడం లేదు... రిలీజ్ కన్‌ఫ్యూజన్‌పై రామ్ చరణ్ క్లారిటీ
Who will be next PM : మోదీ తర్వాత ప్రధాని ఎవరు? జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణలో ఆసక్తికర విషయాలు!
మోదీ తర్వాత ప్రధాని ఎవరు? జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణలో ఆసక్తికర విషయాలు!

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Target Harish Rao: తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
TDP MLAs: టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చక్రవర్తులా? - ధ్యానం సలహాతో వారిని చంద్రబాబు దారిలో పెట్టగలరా?
టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చక్రవర్తులా? - ధ్యానం సలహాతో వారిని చంద్రబాబు దారిలో పెట్టగలరా?
Peddi: పెద్ది లేట్ అవ్వడం లేదు... రిలీజ్ కన్‌ఫ్యూజన్‌పై రామ్ చరణ్ క్లారిటీ
పెద్ది లేట్ అవ్వడం లేదు... రిలీజ్ కన్‌ఫ్యూజన్‌పై రామ్ చరణ్ క్లారిటీ
Who will be next PM : మోదీ తర్వాత ప్రధాని ఎవరు? జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణలో ఆసక్తికర విషయాలు!
మోదీ తర్వాత ప్రధాని ఎవరు? జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణలో ఆసక్తికర విషయాలు!
Hyderabad Gold Man Vijay Kumar: ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
YSRCP ON AMARAVATI: మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
Happy Hanuman Jayanti 2026 Wishes in Telugu: హనుమాన్ జయంతి - మీ బంధు మిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
హనుమాన్ జయంతి - మీ బంధు మిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
Daily Shower in Summer : వేసవిలో స్నానం చేయడం మానేయకండి.. రోజూ చల్లటి నీటితో ఉదయం, సాయంత్రం చేస్తే కలిగే లాభాలివే
వేసవిలో స్నానం చేయడం మానేయకండి.. రోజూ చల్లటి నీటితో ఉదయం, సాయంత్రం చేస్తే కలిగే లాభాలివే
Embed widget