అన్వేషించండి

Telangana: 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి

TS Minister Errabelli Dayakar Rao: రాష్ట్రం ఏర్ప‌డేనాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు నుంచి రాష్ట్రం ఏర్పాటైన 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ‌వించింద‌ని అన్నారు.

- రాష్ట్రం ఏర్ప‌డే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు

- రాష్ట్రం ఏర్పాటైన 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌

వరంగల్ /జనగామ : చీక‌ట్లో మ‌గ్గిపోతున్న రాష్ట్రాన్ని వెలుగు జిలుగుల తెలంగాణ‌గా మార్చిన ఘ‌త‌న సీఎం కేసీఆర్ కే దక్కుతుంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. రాష్ట్రం ఏర్ప‌డేనాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు నుంచి రాష్ట్రం ఏర్పాటైన 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ‌వించింద‌ని అన్నారు. ఇంత త‌క్కువ కాలంలో ఇంత ఎక్కువ‌గా ప‌ని చేసి, దేశంలోనే విద్యుత్ వినియోగంలో నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా నిలిచింద‌ని, రాష్ట్రం వ‌స్తే చీక‌ట్లో మ‌గ్గుతార‌ని అన్న అప్ప‌టి సీఎం ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు.

విద్యుత్ విజ‌యం ప్ర‌తిభ అంతా సీఎం కేసీఆర్ కే చెందుతుంద‌ని, అకుంఠిత దీక్ష‌, ద‌క్ష‌త‌ల‌తో నిరంత‌రం శ్ర‌మించి, తెలంగాణ‌లో కోత‌లు లేని, హాలీడేలు లేని, నాణ్య‌మైన 24 గంట‌ల విద్యుత్ ని నింరంత‌రాయంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవ‌త‌రించింద‌ని మంత్రి తెలిపారు. రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌ల్లో భాగంగా పాల‌కుర్తిలో 132/33 కేవీ స‌బ్ స్టేష‌న్ ను ప్రారంభించిన మంత్రి, అనంత‌రం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో జ‌రిగిన విద్యుత్ విజ‌యోత్స‌వ స‌భ‌లో మంత్రి మాట్లాడారు. 

విద్యుత్ లోటు, నిరంత‌ర కోత‌లు, ప‌వ‌ర్ హాలీడేలు, క‌రెంటు లేక పంట‌లు ఎండిపోయే దుస్థితి నుండి నేడు రాష్ట్రం ఏర్పాటు త‌ర్వాత విద్యుత్ మిగులు రాష్ట్రంగా అభివృద్ధి చెందింద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. అభివృద్ధికి సూచిక‌గా, ఇవ్వాళ త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో 1196 యూనిట్ల‌తో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింద‌ని తెలిపారు. రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుండి నేటి వ‌ర‌కు ప్ర‌భుత్వం అందించిన స‌బ్సిడీల స‌హ‌కారం రూ.50వేల కోట్లకు పైగా ఉంద‌ని అన్నారు. 

రాష్ట్రంలో 27ల‌క్ష‌ల 10వేల విద్యుత్ క‌నెక్ష‌న్లు ఉండ‌గా, రైతుల త‌ర‌పున ఇత‌ర అన్ని ర‌కాల స‌బ్సిడీగా 50వేల కోట్లు ప్ర‌భుత్వం విద్యుత్ స‌హ‌కారం అందించింద‌ని మంత్రి వెల్ల‌డించారు. ఒక్కో మోటారుకు ల‌క్షా 20వేల స‌బ్సిడీ ఇచ్చిన‌ట్లు తెలిపారు. గ‌తంలో కేవ‌లం 49వేల కోట్లు మాత్ర‌మే చెల్లిస్తే, ఇప్పుడు 883 కోట్లు స‌బ్సిడీగా ప్ర‌భుత్వం చెల్లించంద‌న్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో 87వేల 980 మంది రైతుల‌కు 880 కోట్ల 4 ల‌క్ష‌లు సబ్సిడీగా చెల్లించిన‌ట్లు వివ‌రించారు. 

విద్యుత్ రంగంలో అగ్ర‌గామిగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం
అలాగే రజకులకు ఆర్థికంగా తోడ్పాటుకు పాలకుర్తి నియోజకవర్గానికి 501 రజక సర్వీసులకు 250 యూనిట్లు ఉచితంగా ఇస్తూ, ఇప్పటి వరకు 16 లక్షల 66 వేల రూపాయలు  అందించడం జరిగింది. 246 నాయీబ్రాహ్మణ సర్వీసులకు గాను 250 యూనిట్లు ఉచితంగా ఇస్తూ, ఇప్పటివరకు 36 లక్షల 62 వేల రూపాయల సబ్సిడీ అందించాము. SC/ST విద్యుత్ వినియోగదారులకు 101 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద 887 సర్వీసులకు ఇప్పటి వరకు 3 కోట్ల 73 లక్షల రూపాయలు అందించడం జరిగింది. నాడు పాల‌కుర్తి నియోజకవర్గంలో 27 సబ్ స్టేషన్లు మాత్రమే ఉండగా తెలంగాణ ఏర్పడిన తరువాత అదనంగా 14 సబ్ స్టేషన్లు  25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోన్నాము. పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పడక ముందు 32 వేల 624 కనెక్షన్లకు 149 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది, కాని తెలంగాణ ఏర్పడిన తరువాత అదనముగా 8 వేల 275 సర్వీసులు మంజూరు చేసి మొత్తం ఈ 10 ఏళ్లలో 883 కోట్ల 73 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చెల్లించిందన్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పడక ముందు 5 వేల 830 ట్రాన్స్ ఫార్మర్లు ఉండగా 99 కోట్ల 93 లక్షల రూపాయల తో ఏర్పాటు చేశారు, కాని తెలంగాణ ఏర్పడిన తరువాత అదనంగా 2 వేల 500 కొత్త  ట్రాన్స్ ఫార్మర్లు 37 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోన్నాము. పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పడక ముందు 71 వేల 712 కరెంటు పోల్స్ 29 కోట్ల 56 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయగా, తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాల కాలంలో అదనంగా 61 వేల 412  కరెంటు పోల్స్ ను 25 కోట్ల 30 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకోన్నామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు. నిజాలు ఇలా ఉండగా, కొంద‌రు అర్థంలేని ఆరోప‌ణ‌లు చేస్తూ, ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని, అలాంటివాళ్ళు ఊళ్ళ‌కు వ‌స్తే, వారిని నిల‌దీయాల‌ని ప్ర‌జ‌ల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. 

విద్యుత్ ఉత్ప‌త్తి, వినియోగంలో మ‌న‌మే నెంబ‌ర్ వ‌న్‌
జిల్లా క‌లెక్ట‌ర్ శివ‌లింగ‌య్య మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్ప‌త్తితోపాటు, వినియోగంలోనూ మ‌న రాష్ట్రం దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు క‌లిసి అటు రాష్ట్రాన్ని, ఇటు పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని అద్భుతంగా విద్యుత్ రంగంలో తీర్చిదిద్దార‌న్నారు. అంతకుముందు మంత్రికి విద్యుత్ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్య‌క్ర‌మాల్లో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా త‌ర‌లి వ‌చ్చిన పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget