అన్వేషించండి

Congress Politics: ఆస్తి గొడవలతో బీఆర్ఎస్‌ గల్లంతు, 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్: మహేష్ కుమార్ గౌడ్

Telangana News | కాంగ్రెస్ పార్టీ 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ క‌నపడదు అన్నారు.

ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఆ పార్టీ కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఖమ్మంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గిరిజన తండాలను గుర్తించిన తొలి నేత ఇందిరా గాంధీ. ఆదివాసుల అభివృద్ధి కోసం ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి జీవం పోసిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే అన్నారు.

ఆదివాసీలను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం

 ‘కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక చట్ట సవరణలు చేసింది. కానీ  గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పోడు భూముల కోసం పోరాడిన గిరిజనులపై కేసులు పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం. ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్. ప్రభుత్వం చేపట్టిన ఇందిర సౌర గిరి జల వికాసం పథకంతో గిరిజనుల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. గిరిజనులకు పిసిసిలో సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తాను.

వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ గల్లంతు

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తోంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కుల గణన (Caste Census) సర్వే పూర్తి చేసిన ఘనత సీఎం రేవంత్, మంత్రులదే. జల్-జమీన్-జంగల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన ఏకైక పార్టీ కాంగ్రెస్. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు .. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆ పార్టీని ఆదరించరు. తెలంగాణలో 90 సీట్లతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. బిఆర్ఎస్ లో ఆస్తుల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ క‌నపడదు’ అని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget