అన్వేషించండి

Errabelli Dayakar Rao: మహిళలకు రూ.3 లక్షల రుణం, పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి -మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: మహిళలకు మూడు లక్షల రూపాయల రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజక వర్గాన్ని ఎంపిక చేశామన్నారు. 

Errabelli Dayakar Rao: మహిళలకు మూడు లక్షల రూపాయల రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నామని, ఇందుకోసం తొలుత పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజక వర్గాన్ని ఎంపిక చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యాక తెలంగాణ రాష్ట్రం అంతటా అమలు చేస్తామని చెప్పారు. జనగామలో దాదాపు 3 వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ఇవాళ హాజరు అయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలో మహిళలకు మంత్రి  కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి.. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లోని మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి, శిక్షణ కూడా ఇస్తామని మంత్రి వివరించారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

మహిళల సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేనన్ని కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని మంత్రి వివరించారు. శిక్షణ తీసుకున్న మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చేయడమై తన బాధ్యత అని చెప్పారు. మహిళా సాధికారత లక్ష్యంగా 3000 మందికి మహిళల కుట్టు మిషన్ శిక్షణా తరగతులనువ ప్రారంభించారు. అనంతరం శిక్షణ పొందే మహిళలు, స్థానిక నేతలు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండగా 7 సార్లు ఎన్నికల్లో గెలిచానని చెప్పారు. చాలా మంది సీఎంలను, పార్టీలను చూశాను కానీ సీఎం కేసీఆర్ లా ఎవరూ అభివృద్ధి చేయలేరని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయినప్పుడు తన నియోజక వర్గంలో, రాష్ట్రంలోని అక్కా, చెల్లెళ్లు కుండలు పట్టుకుని నీళ్ల కోసం నిలబడే వారని... నీళ్లకు బోరింగ్ వేస్తే చాలు అనేవాళ్లని గుర్తు చేశారు.

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చే నిధులన్నీ బోరింగ్ల నిర్మాణాలకో పోయేవని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తున్నారన్నారు. ఈ మిషన్ భగీరథ శాఖ కూడా సీఎం తనకే ఇచ్చారని వివరించారు. అప్పట్లో మహిళలు బయటకు రావడానికి భయపడే వాళ్లని, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు డ్వాక్రా మహిళలకు ఒక రూపాయి ఇస్తే బ్యాంక్ లో వేయడానికి వెళ్తే కూడా అభాండాలు వేసేవాళ్లని అన్నారు. కానీ ఇప్పుడు బ్యాంకుకు నేరుగా వెళ్లి దర్జాగా వేస్తున్నారని చెప్పారు. మహిళలకు డబ్బులు రావడం వల్ల వారిపై అరాచకాలు తగ్గాయని వివరించారు. తెలంగాణ రాక ముందు మహిళలకు 4 వేల కోట్ల రూపాయల రుణాలు వచ్చేవని, ఇపుడు 18 వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నామన్నారు. మహిళలకు చైతన్యం వచ్చిందని, మహిళా సంఘాలు ఇంకా బాగా అభివృద్ధి కావాలన్నారు.

అలాగే టెక్స్ టైల్ పార్కులో ఉద్యోగాలు ఇవ్వడానికి 35 సంవత్సరాల లోపు ఉన్న వారు కావాలని టెక్స్ టైల్ పార్క్ వాళ్ళు అడిగారని... అందుకే ఈసారి శిక్షణ కోసం 35 ఏళ్లలోపు మహిళలు అని నిబంధన పెట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. జాబ్ వద్దు అనుకున్న వాళ్ళు 40, 50 ఏళ్లు ఉన్నా వచ్చే బ్యాచ్ లో శిక్షణ ఇస్తామన్నారు. వచ్చే బ్యాచ్ కు వయో పరిమితి, విద్య అర్హత నిబంధన తీసేయమని చెబుతున్నానన్నారు. ఈ కుట్టు మిషన్ల శిక్షణ కోసం సెర్ప్ నుంచి 10వేల రూపాయలు, స్త్రీ నిధి నుంచి 7 వేల రూపాయలు చొప్పున ఒక్కొకరిపై 17వేల రూపాయల ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తం 5 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీనిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఏ బట్టలు ఆర్డర్ ఇచ్చినా అది మనకే వచ్చేటట్లు చేస్తానని చెప్పారు. దీని తరవాత దశలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియ, జనగామ జిల్లా కలెక్టరు శివ లింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, పీడీ డీఆర్డీఏ రామ్ రెడ్డి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, మాజీ చైర్మన్ గాంధీ నాయక్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు సావిత్రి, జ్యోతి, సర్పంచ్ యకాంత రావు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget