అన్వేషించండి

Warangal ORR: వరంగల్ ఓఆర్ఆర్ ప్రాజెక్టుపై రైతుల ఎఫెక్ట్, వెనక్కి తగ్గిన ప్రభుత్వం

సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నీరు అందుబాటులోకి రావడంతో ఇప్పటికే భూముల ధరలు అక్కడ భారీగా పెరిగాయి. దీంత రైతులు తీవ్రంగా నిరసనలు చేశారు

వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పడడంలో ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములను సేకరించాలనే ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణం కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములు తీసుకోవాల్సి ఉంది. 41 కిలో మీటర్ల వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాల్సి ఉంది. ఇందుకోసం రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో భూములు తీసుకోవాలని కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (KUDA) గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత సర్వే పనులు కూడా మొదలయ్యాయి. అయితే ల్యాండ్‌ పూలింగ్‌కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీఓ 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో గత 5 నెలలుగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత
సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నీరు అందుబాటులోకి రావడంతో ఇప్పటికే భూముల ధరలు అక్కడ భారీగా పెరిగాయి. దాంతో, తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. దీంతో భూముల సమీకరణ వివాదాస్పదంగా మారింది. ఇక్కడి భూములకు ఎకరానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ ధర పలుకుతోందని, చక్కగా మూడు పంటలు పండే సారవంతమైన భూములని రైతులు అంటున్నారు. అలాంటి వీటిని ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు నిరసనల్లో చెబుతున్నారు. 

వరంగల్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నారని తెలిసి ఆ నిర్మాణానికి సమీపంలో ఎమ్మెల్యేలు, వారి బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని రైతులు ఆరోపించారు. వాటి విలువ పెంచుకోవడం కోసమే ఇప్పుడు ల్యాండ్‌ పూలింగ్‌ను తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట రైతులు ఆందోళన బాట పట్టగా ల్యాండ్‌ పూలింగ్‌ నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ పి.ప్రావీణ్య భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

 అయినా ఆందోళనలు ఆగలేదు. రైతులు రోడ్లను దిగ్బంధనం చేశారు. నిరసనలు మరింత పెరుగుతుండడంతో సోమవారం ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని ఆపేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు అర్వింద్‌ కుమార్‌ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Embed widget