అన్వేషించండి

Hyderabad ఓల్డ్ సిటీని బీజేపీ స్వాధీనం చేసుకుంటుంది - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hyderabad old city ని ఎప్పటికైనా బీజేపీ స్వాధీనం చేసుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హన్మకొండలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో Bandi Sanjay సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP surge in Old city says bandi sanjay | బీజేపీ హైదరాబాద్ ఓల్డ్ సిటీని స్వాధీనం చేసుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం బిజెపికి పాటుపడుతుందనన్నారు. ఓల్డ్ సిటీలో ఉన్న సంఘ విద్రోహక శక్తులను నామ రూపాలు లేకుండా చేస్తామని  బండి సంజయ్ అన్నారు. హన్మకొండలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన bjp సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరితో సభ్యత్వ నమోదు చేయించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో 18 కోట్ల సభ్యత్వాలు ఉన్న ఏకైక పెద్ద పార్టీ బిజేపి అని బండి సంజయ్ అన్నారు.

హైడ్రా... ఒక డ్రామా.. 
హైడ్రాకు బిజెపి వ్యతిరేకం కాదని.. చెరువులు, కుంటలు కబ్జాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టవద్దని బండి సంజయ్ అన్నారు. హైడ్రా పేరుతో పేద ప్రజల పొట్టకొడితే బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, రైతు రుణ మాఫీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. దాన్ని పక్కదారి పట్టించడం కోసం రేవంత్ రెడ్డి హైడ్రా అనే డ్రామాను లేవనెత్తారని బండి సంజయ్ ఆరోపించారు.

Brs విలీనంపై బండి సంజయ్ క్లారిటీ  
బిజెపి బీఆర్ఎస్ కు సంబంధాలే లేదని.  గూలాబీ పార్టీ బీజేపీలో చేరడం అనేది అసాధ్యమని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలని రెండు పార్టీ లకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. బిజెపి కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కాదని. బీఆర్ఎస్ విలీనం అనేది ఆసాధ్యమని, ఒకవేళ విలీన ప్రస్తావన వస్తే కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా ఆ కుటుంబం మొత్తానికి బీజేపీ టికెట్లు ఇస్తుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలకు కాబట్టి. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని భవిష్యత్తులో అదే జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు లాంటివని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెద్దేవా చేశారు.

కవిత బెయిల్ పై ఘాటు వ్యాఖ్యలు 
ప్రభుత్వాలు, వ్యక్తులు చెబితే సుప్రీంకోర్టు ఎవరికీ బెయిల్ ఇవ్వదని బండి సంజయ్ అన్నారు. కవిత డాటర్ ఆఫ్ ఫాదర్ కేసీఆర్ అని బండి సంజయ్ అన్నారు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయలేదన్నారు. ఇదంతా కవిత బెయిల్ కోసమేనన్నారు. కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి మద్దతిచ్చారని అన్నారు. అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ ఎన్నికలు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్ కాదని కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ లీకులు.. 
కవిత జైల్లో నుండి రాగానే కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని లీకులు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఏం ఉద్ధరిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.  బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం... దుకాణం బంద్ అయిందన్నారు. స్థానికల సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ నేతలను చేతులెత్తమంటే ఎవరు ఎత్తడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. 2028లో అధికారంలోకి వచ్చే పార్టీ బిజెపి అన్నారు

రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి
64 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ రుణాలు మాఫీ చేస్తుందని.. ఇందుకు 49 వేల కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. తర్వాత మాట మార్చి అసెంబ్లీలో 31 వేల కోట్లు మంజూరు చేస్తామన్నారని, చివరకు రేవంత్ రెడ్డి 17 కోట్ల రూపాయలు మంజూరు చేసి రైతులను మోసం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget