అన్వేషించండి

Medaram Jatara: మేడారం భక్తులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్, సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు

TS RTC MD Sajjanar: ఆర్‌టీసీ బస్సులు సమ్మక్క గద్దెల వరకు వెళ్తాయని, ప్రైవేట్​ వాహనాలు జాతరకు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే ఆగుతాయని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

TS RTC MD Sajjanar: మేడారం జాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త అందించారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3,845 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ప్రకటించారు. సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సు సర్వీసులు నడుపుతామని తెలిపారు. గత 50 ఏళ్లుగా మేడారంకు ఆర్‌టీసీ బస్సులను నడిపిస్తుందని, ప్రయాణీకులను సురక్షితంగా  గమ్యస్థానాలకు చేరుస్తుందని అన్నారు. ఆర్‌టీసీ బస్సులు సమ్మక్క గద్దెల వరకు వెళ్తాయని, ప్రైవేట్​ వాహనాలు జాతరకు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే ఆగుతాయని, ఆర్‌టీసీ బస్సు సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మేడారం విత్ టీఎస్ఆర్‌టీసీ వెబ్‌సైట్, యాప్‌ను శుక్రవారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సాధారణ చార్జీలే.. 
మేడారం జాతరకు నడిపే స్పెషల్​ బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయని ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్​ వెల్లడించారు. మేడారం జాతరకు బస్సులు నడపడాన్ని రెవెన్యూ అంశంగా చూడటం లేదని, మేడారం రవాణా సేవలను సామాజిక సేవ, సామాజిక బాధ్యతగా ఆర్టీసీ భావిస్తోందని అన్నారు. ఈసారి జాతరకు 3,845 బస్సులను ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. గత 50 ఏళ్ల నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ సేవలు అందిస్తోందని, 1968వ సంవత్సరంలో ఆర్టీసీ 100 బస్సులను మేడారంకు నడిపిందన్నారు. 2020లో 3,382 బస్సుల్లో 50,230 ట్రిప్పులతో 19.98 లక్షల మంది ప్రయాణికులను మేడారం జాతరకు చేరవేశామని, తద్వారా ఆర్‌టీసీకి రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

ఈ ఏడాది సుమారు 23 లక్షల మందిని మేడారానికి చేర్చాలని అంచనా వేస్తున్నామని, మొత్తం 51 పాయింట్స్ నుంచి బస్సులను నడుపుతామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బస్సులను నడిపిస్తున్నామని, మహారాష్ట్ర నుంచి 45 బస్సులు నడిపిస్తున్నామని వెల్లడించారు. ఇక మేడారం జాతరకు వెళ్లే వారు 30 మంది ఉంటే వాళ్ళ కాలనీకే బస్సులు నడిపిస్తామన్నారు. అవసరమైన వారు 040-30102829 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. కానీ ఈ నెల 13 తర్వాత ఈ సదుపాయం ఉండదని తెలిపారు. 
మేడారం జాతరకు ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు స్పెషల్​ బస్సులు కొనసాగుతాయని ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్​ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 523 బస్సులను, 1,250 ట్రిప్పులు నడిపించి 1.50 లక్షల మంది ప్రయాణికులను మేడారం జాతరకు తీసుకెళ్లామని చెప్పారు. బస్సుల నిర్వహణ కోసం 50 ఎకరాల్లో బేస్ క్యాంపును ఏర్పాటు చేశామని, అందులో 42 క్యూ లైన్స్ 7,400 మీటర్ల మేర ఏర్పాటు చేశామని, అందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఉంటుందని, 100కు పైగా సీసీటీవీలను ఏర్పాటు చేశామని తెలిపారు. బేస్ క్యాంప్ వద్ద ఒక అంబులెన్స్, ఐసీయూ కేంద్రం ఉంటుందన్నారు. వరంగల్ నుంచి 2,250 బస్సులు తిరుగుతాయని, ఖమ్మం, మెదక్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి బస్సులను నడిపిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రైవేట్ వాహనాల పార్కింగ్ స్థలం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 30 ఫ్రీ షటిల్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. బస్సుల మెయింటెనెన్స్ కోసం 11 మొబైల్ మెకానికల్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. ఇక ప్రయాణికుల కోసం మేడారం విత్ టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆర్‌టీసీ ఎండీ తెలిపారు. ఈ యాప్‌లో 8 రకాల సేవలు అందిస్తున్నామని, బస్సుల వివరాలు, పర్యాటక కేంద్రాలు, హోటల్, పోలీస్ సేవలు, వైద్య సౌకర్యాలు వంటి వివరాలు ఉంటాయన్నారు. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను కిట్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు నెల రోజుల పాటు కృషిచేసి తయారు చేశారని ఎండి సజ్జనార్​ తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !

వీడియోలు

RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget