వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేసే రాజేశ్ నాయక్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రైలు కింద పడి మరణించాడు.
Warangal Crime News: భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Crime News | వరంగల్లో ఆస్తి గొడవల వల్ల మనస్తాపంతో రాజేష్ అనే వ్యక్తి భార్యకు వీడియో కాల్ చేస్తూ, ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

- కాజీపేటలో రాజేష్ నాయక్ భార్యతో వీడియో కాల్లో ఆత్మహత్య.
- ఆస్తి గొడవలతో భార్యతో కలహించి తీవ్ర మనస్తాపం చెందాడు.
- భర్త బెదిరింపుగా భావించి భార్య మొదట తేలికగా తీసుకుంది.
- భార్య, కుమారుడిని విడిచి రాజేష్ ఆత్మహత్య; పోలీసుల దర్యాప్తు.
కాజీపేట: వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ, ఆమెకు చూపిస్తూ.. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి రాజేశ్ నాయక్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాజేశ్ నాయక్ వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
రైలుకు అడ్డంగా వెళ్తూ భార్యకు వీడియో
అయితే, గత కొంతకాలంగా రాజేష్ భార్యకు, ఆయన తల్లిదండ్రులకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మరోసారి భార్యతో గొడవ జరిగింది. రాజేశ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోయాడు. ఆపై రైలు పట్టాల మీదకు చేరుకుని, భార్యకు నేరుగా వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్తూ ఎదురుగా వస్తున్న రైలును చూపించాడు. నిజంగానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త రాజేష్ తనను కేవలం భయపెట్టడానికే అలా చేస్తున్నాడని భావించిన భార్య ఆ విషయాన్ని లైట్ తీసుకుంది.
Also Read: Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్కు స్వల్ప ఊరట
మరోవైపు రాజేశ్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాత్రంగా బంధువులు, స్నేహితులు, సన్నిహితుల ఇండ్లు, పలు చోట్ల వెతికారు. మరుసటి రోజు ఉదయం కాజీపేట సమీపంలోని రైలు పట్టాలపై ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి చూశారు. అది రాజేష్ మృతదేహమేనని గుర్తించి వారు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మృతుడు రాజేష్కు భార్యతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్షణికావేశంలో ఒకరు తీసుకునే నిర్ణయాలు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయని.. ఇలాంటి పనులు చేయవద్దని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. సమస్యలు ఉంటే కుటుంబసభ్యులు కూర్చుని చర్చించుకోవాలని, లేకపోతే పిల్లలు అనాథలు అయిపోతారని, తల్లిదండ్రుల బాగోగులు చూసేవారు ఉండరని పేర్కొన్నారు.
Frequently Asked Questions
కాజీపేటలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరు?
రాజేష్ నాయక్ ఆత్మహత్యకు గల కారణం ఏమిటి?
ఆస్తి పంపకాల విషయంలో భార్యకు, అతని తల్లిదండ్రులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడిన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజేష్ నాయక్ తన ఆత్మహత్యను ఎలా చేశాడు?
అతను రైలు పట్టాలపైకి వెళ్లి, భార్యకు వీడియో కాల్ చేసి, ఎదురుగా వస్తున్న రైలును చూపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట భార్య అతని మాటలను తేలికగా తీసుకుంది.
రాజేష్ నాయక్ వృత్తి ఏమిటి?
అతను వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ట్రెండింగ్ వార్తలు























