అన్వేషించండి

Green Field Airport: భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి

New Airport: భద్రాచలం-కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు సుముఖంగా ఉంది. భూసేకరణ, ఇతరత్ర అంశాలపై తెలంగాణ నుంచే ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్రమంత్రి అన్నారు.

Kothagudem Airport: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణ(Telangana)కు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెంచినట్లు  కేంద్రమంత్రులు వెల్లడించారు.తెలంగాణ ప్రభుత్వం కోరిన అన్ని ప్రతిపాదనలకు దాదాపు ఆమోదం తెలిపినట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం(Airport)పై ఇప్పటికే ప్రీ ఫిజిబిలిటీ స్టడీ సైతం పూర్తయ్యిందన్న కేంద్రం..రైల్వే బడ్జెట్‌లోనూ భారీగా కేటాంపులు చేసినట్లు  వెల్లడించింది.

భద్రాచలంలో  కొత్త విమానాశ్రయం 
తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు  భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు  పౌరవిమానయానశాఖ  సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు.ఈ మేరకు జనవరిలోనే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)  ప్రీ ఫీజిబిలిటీ స్టడీ సైతం నిర్వహించిందని ఆయన తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అయితే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పాలసీ ప్రకారం అటు తెలంగాణ(Telangana) ప్రభుత్వం గానీ, ఎయిర్‌పోర్టు డెవలపర్‌ నుంచి గానీ  భూసేకరణకు  సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి  ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు  రాలేదన్నారు.

గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టు(Greanfield Airport) నిబంధనల ప్రకారం భూసేకరణ, పునరావాసం,నిధుల సమీకరణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం గానీ,ఎయిర్‌పోర్టు డెవలపర్‌ గానీ వహించాల్సి ఉంటుంది. భూసేకరణ, అనుమతుల లభ్యత,ఆర్థిక అంశాలపై ఆధారపడే  విమానాశ్రయం నిర్మాణం ఉంటుందని  కేంద్రమంత్రి వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే భద్రాచలం-కొత్తగూడెంలో  కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నా...రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఎలాంటి కదలిక లేనట్లు ఆయన వెల్లడించారు. 

రైల్వే కేటాయింపులు
కేంద్ర బడ్జెట్‌లో  రైల్వేశాఖ(Railways)కు  సంబంధించి తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయింపులు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన దానికన్నా ఇది 6 రెట్లు అధికమని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Aswani vishnaw) వెల్లడించారు. యూపీఏ(UPA) హయాంలో ఏడాదికి రూ.886 కోట్లు మాత్రమే కేటాయించినట్లు ఆయన వివరించారు. తెలంగాణలో  ఈ దశాబ్ద కాలంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌లకు  రూ.41,677కోట్లు ఖర్చు చేసినట్లు  వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు  తెలంగాణలో 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాకులను ఏర్పాటు చేశామన్నారు.  అలాగే విద్యుద్దీకరణ వందశాతం పూర్తయ్యిందన్నారు.

తెలంగాణ చిరకాల వాంఛ అయినటువంటి కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సైతం  ఎన్డీఏ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తుచేసిన కేంద్రమంత్రి...దీన్ని మల్టీపర్పస్‌ రైల్వే ప్రొడక్షన్ యూనిట్‌గా  అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రూ. 327 కోట్లతో, సికింద్రాబాద్‌(Secunderabad) రైల్వే స్టేషన్‌ను రూ.715 కోట్లతో ఆధునీకస్తున్నట్లు  అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. అలాగే తెలంగాణలో ఇప్పటి వరకు 1,326 కిలోమీటర్ల మేర కవచ్‌ సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని...మరో వెయ్యి కిలోమీటర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందన్నారు. 

హైదరాబాద్‌- విజయవాడకు నమోభారత్‌
తెలంగాణకు తొలి దశలోనే  వందే భారత్‌ రైలు కేటాయించినట్లు గుర్తు చేసిన అశ్వనీ వైష్ణవ్‌...వాటిని 5కు పెంచామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లు కేటాయిస్తామని తెలిపారు. అలాగే తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లను అమృత్‌భారత్‌(Amruth Bharath) పథకం కింద ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌-విజయవాడ మధ్య నమో భారత్‌ (Namo Bharath)రైళ్లు నడపనున్నట్లు వివరించారు. 

ఏపీకి భారీగా  కేటాయింపులు
తెలంగాణతో పోల్చితే ఏపీకీ భారీగా కేటాయింపులు పెరిగాయి.రూ.9,417 కోట్లు రైల్వేకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. యూపీఏ ప్రభుత్వం  కేటాయింపులతో పోల్చితే ఇది  11 రెట్లు ఎక్కువ. 

 

టాప్ హెడ్ లైన్స్

నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget