By: ABP Desam | Updated at : 23 Jan 2022 12:58 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రహంపాడ్ లో కొండా మురళీధర్ రావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన స్థూపాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. నిన్న సాయంత్రం హుటాహుటిన స్థూపం దగ్గరకు వచ్చిన కొండా సురేఖ అత్తమామలకు నివాళి అర్పించారు. పడుకున్న సింహాన్ని లేపారని కొండా మురళి కూతురు సుశ్మితా పటేల్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆదేశంతో స్థూపాన్ని కూల్చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ఇకపై కొండా ఫ్యామిలీ అంటే ఏంటో చూపిస్తామని చల్లా ధర్మారెడ్డిని హెచ్చరించారు.
కొండా దంపతులపై ధర్మారెడ్డి ఫైర్
ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్పందించారు. కొండా దంపతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కోపం వస్తే కొండా దంపతులు అడ్రస్స్ లేకుండా పోతారన్నారు. ప్రజలు కొండా దంపతులను ఎప్పుడో తరిమికొట్టారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే అగ్రహంపాడ్ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల ఆగ్రహనికీ గురై కొండా దంపతులు అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read: కొండా మురళి తల్లిదండ్రుల స్థూపాల ధ్వంసం.. పరకాలలో తీవ్ర ఉద్రిక్తత !
అసలేం జరిగిందంటే..
ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి తల్లిదండ్రుల స్మారక నిర్మాణాన్ని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు ధ్వంసం చేయడం సంచలనం రేపుతోంది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ మేడారం జాతర సమీక్ష సమావేశానికి శనివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. రహదారికి అడ్డంగా ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో కొండా మురళి తల్లిదండ్రులైన కొండా చెన్నమ్మ, కొమురయ్యల జ్ఞాపకార్థం నిర్మించిన గద్దెలను కూల్చివేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే అవి ప్రైవేటు స్థలంలో ఉన్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే చెప్పారని టీఆర్ఎస్ నాయకులు కొంతమంది కొండా మురళి తల్లిదండ్రుల స్మారక నిర్మాణాన్ని కూల్చివేశారు. కొండా సురేఖ 2010 పరకాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత నిధులతో ఈ నిర్మాణం చేశారు. సొంత స్థలంలో నిర్మించుకున్న స్థూపాన్ని ఎలా ధ్వంసం చేస్తారని కొండా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొండ సురేఖ ఆగ్రహం
Also Read: దళితబంధుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుకు సన్నద్ధం
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?