Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
Kingfisher: ప్రముఖ బ్రాండ్ కంపెనీ బీర్లు ఇక తెలంగాణలో లభించవని ఆందోళన చెందిన మందుబాబులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చింది. ఆ బీర్ల సరఫరా ఆపట్లేదని కంపెనీ ప్రకటన జారీ చేసింది.

UB Company: తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది.బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ లేఖ విడుదల చేసింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తెలంగాణలో అమ్ముడయ్యే బీర్లలో మొత్తం అరవై శాతం వరకూ కింగ్ ఫిషర్ బ్రాండ్లే ఉంటాయని అంచనా.
కంపెనీ భారీగా రేట్లు పెంచాలని కోరుతోందని తాము వారి డిమాండ్ కు అంగీకరించేది లేదని ప్రజలపై భారం పడేందుకు అంగీకరించబోమని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. అదే సమయంలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త బ్రాండ్ల బీర్లకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల బినామీ కంపెనీల ద్వారా కొత్త బ్రాండ్లను సరఫరా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బీర్ల కంపెనీకి బకాయిలు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
కొద్ది రోజుల కిందట యూబీ సంస్థ తెలంగాణలో తమ బీర్ల సరఫరాను ఆపేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ కంపెనీకి చెందిన బీర్ల బ్రాండ్ల నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఇప్పటి వరకూ సరఫరా ఆగిపోలేదు. ఫిబ్రవరి నెల కూడా వస్తాయని ఎక్సైజ్ వర్గాలు ప్రకటించాయి.
బీర్ ధరలో 70 శాతం పన్నులే ఉన్నాయని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ అంటోంది. ప్రభుత్వం తమకు రూ.658 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీ కోరితే స్పందించడం లేదని కంపెనీ ఆరోపించింది. గిట్టుబాటు కావడం లేదని భారీగా నష్టాలు వస్తున్నాయని తాము ఉత్పత్తిని ఆపేస్తామని కంపెనీ ప్రకటించింది. ఆ తర్వాత ఆపేసిన్లు ప్రకటించింది. ఇటీవల పండుగ సీజన్ లో పెద్ద ఎత్తున బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే వేసవి కాలంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతాయి. అందుకే కంపెనీ కూడా మార్కెట్ కోల్పోతే మళ్లీ సాధించుకోవడం కష్టమని ఆలోచించి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ప్రభుత్వం ధరల విషయంలో చర్చించేందుకు ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసు మేరకు మద్యం ధరలను సవరించనున్నారు. ఆ కమిటీ .. బీర్ల రేట్లను పెంచితే యూబీ కంపెనీ మరోసారి బీర్ల తయారీని, సరఫరాను ఆపేయాలని ఆలోచన చేసే అవకాశం ఉండదు. మరో వైపు కింగ్ ఫిషర్ బీర్లకు ఎక్కువ మార్కెట్ ఉన్న అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని యూబీ కంపెనీ బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమైనట్లే అనుకోవచ్చు. మందుబాబుల సమస్యలూ పరిష్కారం అవుతాయి.
Also Read: RaghuRama plea on Jagan: జగన్పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

