అన్వేషించండి

RaghuRama plea on Jagan: జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం

ఏపీ మాజీ సీఎం, వైకాపా అధ్యక్షుడు వైఎస్​ జగన్‌ మోహన్​ రెడ్డి బెయిల్‌ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ కోసం ఏర్పాటుచేసిన బెంచ్​ మారింది.

రఘురామకృష్ణరాజు పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ సీఎం, వైకాపా అధ్యక్షుడు వైఎస్​ జగన్‌ మోహన్​ రెడ్డి బెయిల్‌ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని కోరుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విచారించిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం నుంచి కేసును బదిలీ చేసింది. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనానికి మార్చింది. 

12 ఏళ్లుగా ట్రయల్‌ అడుగు ముందుకు కదల్లేదు
ఈ నేపథ్యంలో కొత్త ధర్మాసనం ముందు రఘురామ, జగన్‌, సీబీఐ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రఘురామకృష్ణ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా ట్రయల్‌ అడుగు కూడా ముందుకు కదల్లేదని, ఒక్క డిశ్ఛార్జ్‌ అప్లికేషన్‌ కూడా డిస్పోజ్‌ చేయలేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో సీబీఐ, నిందితులు కుమ్మక్కయారని వెల్లడించారు. డిశ్ఛార్జ్‌ పిటిషన్లపై వాదనలు విని ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని.. ఒక్క డిశ్ఛార్జ్‌ అప్లికేషన్‌పైనా తుది నిర్ణయం వెలువడకుండా బదిలీ కావడంలో కుట్రకోణం దాగి ఉందన్నారు. తాము ట్రయల్‌ బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశామని పేర్కొన్నారు. అయితే బదిలీ సాధ్యం కాదని ధర్మాసంన గత విచారణలోనే చెప్పిందన్నారు. ట్రయల్ బదిలీపై పిటిషన్ వేశామని ఇప్పుడు ఆ రెండింటినీ తాము కోరట్లేదని.. కేసు మానిటరింగ్‌ పూర్తిస్థాయిలో జరగాలని కోరుతున్నామని అన్నారు. 

వచ్చే సోమవారానికి వాయిదా
సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ న్యాయవాది తెలిపారు. కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా పెండింగ్‍లో ఉందని జగన్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. గత పదేళ్లుగా ట్రయల్ జాప్యం కొనసాగుతూనే ఉందని రఘురామ తరఫు న్యాయవాది చెప్పగా.. కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలన్న సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. ఏఎస్‍జీ మరో కేసులో వాదనలు వినిపిస్తోందని, అందుకే వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ బెంచ్​.. ఈ అంశంపై వచ్చే సోమవారం విచారణ చేపడతామని తెలిపింది.

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget