అన్వేషించండి

TSRTC: 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఒలెక్ట్రా కంపెనీకి టీఎస్ ఆర్టీసీ ఆర్డర్‌, విజయవాడకు 50 సర్వీసులు

మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ అనుబంధ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (Olectra Greentech Limited) మరో భారీ ఆర్డర్‌ దక్కించుకుంది.

TSRTC Orders 550 Electric Buses: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 550 విద్యుత్‌ బస్సులకు ఒలెక్ట్రా కంపెనీకి ఆర్డర్‌ ఇచ్చింది. మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ అనుబంధ విద్యుత్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (Olectra Greentech Limited) మరో భారీ ఆర్డర్‌ దక్కించుకుంది. టీఎస్ ఆర్టీసీ నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి తమకు భారీ ఆర్డర్‌ లభించినట్లు సోమవారం ఓ ప్రకటనలో ఒలెక్ట్రా కంపెనీ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇంత మొత్తంలో ఆర్డర్ రావడం ఇదే తొలిసారి అని, తమ కంపెనీపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒలెక్ట్రా గ్రీన్‌కు చెందిన 40 బస్సులను వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు టీఎస్‌ ఆర్టీసీ నడుపుతోంది.

ఈ ఆర్డర్‌లో 500 లో ఫ్లోర్‌ ఇంట్రాసిటీ ఈ-బస్సులతో పాటు 50 స్టాండర్డ్‌ ఫ్లోర్‌ 12 మీటర్ల ఇంటర్‌సిటీ కోచ్‌లను తెలంగాణ ఆర్టీసీ సంస్థకు అందించనున్నట్లు సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ వెల్లడించారు. అయితే తమకు వచ్చిన ఆర్డర్ ను దశలవారీగా బస్సులను అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా టీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే రెండు రకాల కాలుష్యాలు కొంతలో కొంత తగ్గుతాయన్నారు.

పర్యావరణం కోసమే ఎలక్ట్రిక్ బస్సులు - టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్
కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా విద్యుత్‌ బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. వచ్చే రెండేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 3400 విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నామని చైర్మన్ తెలిపారు. 2025 నాటికి హైదరాబాద్‌ నగరమంతా విద్యుత్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. కాలుష్య రహిత వాహనాల వినియోగంలో భాగంగా 550 బస్సులను తొలి దశలో అందుకోనున్నట్లు వెల్లడించారు.

విజయవాడకు 50 ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు
బెస్ట్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఒలెక్ట్రా మొత్తం 550 విద్యుత్ బస్సులకు గానూ టీఎస్ ఆర్టీసీ ఆర్డర్ అందుకుంది. ఇందులో 50 ఇంటర్‌సిటీ బస్సులను హైదరాబాద్‌ నుంచి విజయవాడకు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. ఎందుకంటే ఎయిర్‌ కండీషన్‌ (AC Facility) కలిగిన ఈ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ తో దాదాపు 325 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. ఈ ఆర్డర్ లో మిగిలిన 500 బస్సులను హైదరాబాద్‌ పరిధిలో అందుబాటులోకి తేనున్నారు. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.  

తెలంగాణలో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులు 
రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అందుబాటు లోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు అందుబాటు లోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు లోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరి గానే ఏసీస్లీపర్ బస్సులకు ‘లహరి’ (Sleeper Buses Named A Lahari) గా సంస్థ నామకరణం చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Gachibowli DLF Road Closed 90 Days: మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget