అన్వేషించండి

TS Politics: బండి సంజయ్‌ది పాదయాత్ర కాదు.. బీజేపీ కార్యకర్తల ఊరేగింపు యాత్ర: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

సీఎం కేసీఆర్ పాలనలో అన్ని మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నారని, దీన్ని జీర్ణించుకోలేక బండి సంజయ్ మత విద్వేషాలు రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ది పాదయాత్ర కాదని.. బీజేపీ కార్యకర్తల ఉరేగింపు యాత్ర మాత్రమే అని ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సంజయ్ పాదయాత్ర వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదని, బీజేపీ కార్యకర్తలే హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ కన్నా బీజేపీ ప్రజలకు చేసిన మేలు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరును ప్రజలు పోల్చుకుని కేసీఆర్ పాలనకు బ్రహ్మ రథం పడుతున్నారని తెలిపారు. ప్రజలతో చర్చించడానికి సమస్యలు లేవు కనుకే సంజయ్ మతపరమైన అంశాలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. 

కేసీఆర్ పాలనలో అన్ని మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నారని, దీన్ని జీర్ణించుకోలేక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో వెల్లివిరుస్తున్న మత సామరస్యాన్నిచెడగొట్టాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనబడుతోందని ఆరోపించారు. బండి సంజయ్ యాత్ర పావలాకు కూడా పనికి రాని యాత్ర అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి తెలంగాణకు గుజరాత్ తరహాలో నిధులిచ్చి తమ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ఏదైనా అంటే ఆలోచిస్తామని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏ సాయం చేయకుండా పని చేస్తున్న కేసీఆర్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు.  

బీజేపీ ప్రజలకేం చేసిందో చెప్పండి: ప్రకాష్ గౌడ్ 
కనీసం హైదరాబాద్ చరిత్ర తెలియకుండా.. పేర్లు మారుస్తా అని బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బీజేపీ ప్రజలకేం చేసింది, అధికారంలోకి వస్తే ఏం చేయనుందో పాదయాత్రలో చెప్పాలని స్పష్టం చేశారు. బండి సంజయ్ యాత్ర పావులాకు కూడా పనికిరాని యాత్రని కాలె యాదయ్య అన్నారు. ప్రజలు లేకపోతే బస్సుల్లో తీసుకొచ్చి యాత్ర కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ లాంటి లీడర్ తెలంగాణలో మరొకరు లేరని.. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉండటం ఖాయమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత లేదని.. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. 

Also Read: Breaking News: మొదటి రోజు 40 శాతం విద్యార్థులు వచ్చారు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

Also Read: Dalit Bandhu Telangana:తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 4 మండలాల్లో దళిత బంధు అమలు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget